సోషల్ మీడియాలో నిన్నట్నుంచి కాజల్ అగర్వాల్ పెళ్లి వార్తే హాట్ టాపిక్. దాదాపు ఏడాది నుంచి కాజల్ పెళ్లి గురించి చర్చ నడుస్తోంది. ఆమె ఒక వ్యాపారవేత్తను పెళ్లాడబోతోందని అనుకుంటూనే ఉన్నారు. చివరికి ఆ వార్తే నిజమైంది. ఆమె గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను ఈ నెల 30న పెళ్లి చేసుకోబోతోంది. స్వయంగా కాజలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
ఐతే కాజల్ పెళ్లి చేసుకుందామనుకున్నాక అబ్బాయిల్ని వెతకడం మొదలయ్యాక గౌతమ్ను చూసుకుందని అనుకుంటే పొరబాటే. అతడితో ఆమెకు ఎన్నో ఏళ్ల ముందు నుంచే పరిచయం ఉందని సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్న ఫొటోల్ని చూస్తే అర్థమవుతోంది. కాజల్ గతంలో పార్టీల్లో పాల్గొన్నప్పటి చాలా ఫొటోలో గౌతమ్ ఉన్నాడు. అతడితో ఆమె చాలా క్లోజ్గా కూడా కనిపిస్తోంది.
దీన్ని బట్టి కాజల్ది ప్రేమ పెళ్లి అని అర్థమవుతోంది. ముందు గౌతమ్తో పరిచయం స్నేహంగా మారి.. ఆ తర్వాత ప్రేమకు దారి తీసినట్లుంది. గౌతమ్తో ఉన్న ఫొటోల్లో కాజల్ లుక్ చూస్తే ఏడెనిమిదేళ్ల కిందటి ఆమె సినిమాల లుక్స్ గుర్తుకొస్తున్నాయి. కాబట్టి వీళ్ల సుదీర్ఘ బంధమే అన్నమాట. ఇక కాజల్కు కాబోయే వరుడు అని తెలియగానే గౌతమ్ గురించి నెటిజన్లు ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు. అతడి ప్రొఫైల్, నెట్వర్త్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం గౌతమ్ ‘డిసెర్న్ లివింగ్’ అనే ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీకి సీఈవోగా ఉన్నాడు. ఆన్ లైన్ ద్వారా ఇంటీరియర్ డిజైనింగ్ ఆర్డర్స్ తీసుకుని సర్వీస్ ఇచ్చే సంస్థ ఇది. దీంతో పాటు గత నాలుగైదేళ్లలో అతను మరికొన్ని వ్యాపారాలు చేశాడు. చాలా వరకు అవి స్టార్టప్లే. తన సోషల్ మీడియా ప్రొఫైల్స్లో ‘ఇంటీరియర్, టెక్, డిజైన్ ఎంతూజియాస్ట్’ అని ఉంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చాలా వరకు ఇంటీరియర్ డిజైనింగ్కు సంబంధించిన ఫొటోలే ఉన్నాయి. గౌతమ్ మంచి అథ్లెట్ అని అర్థమవుతోంది. అతను తరచుగా మారథాన్ పరుగుల్లో పాల్గొంటాడని తెలుస్తోంది. సంబంధిత ఫొటోలు చాలానే కనిపిస్తున్నాయి.
This post was last modified on October 7, 2020 2:33 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…