Movie News

ఒక సినిమా కోసం సంవత్సరం లాక్ : సరైనదేనా…

2019లోనే శాండల్ వుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ రుక్మిణి వసంత్ కు బ్రేక్ రావడానికి నాలుగేళ్లు పట్టింది. సప్తసాగరాలు దాటి సైడ్ ఏబి ఆమెకు ఒకేసారి డబుల్ ప్రమోషన్ తీసుకొచ్చాయి. నటన, అందం రెండూ కలగలిసి ఎక్స్ పోజింగ్ లేకుండా పేరు తెచ్చుకోవడం మాటలు కాదు. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవకుండా వరస ఫ్లాపులు పలకరించాయి. తక్కువ గ్యాప్ లో శ్రీమురళి బఘీరా, నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో రెండూ డిజాస్టర్ కావడం ఊహించని ట్విస్ట్. శివరాజ్ కుమార్ సరసన భైరతి రణగల్ హిట్ అయినప్పటికీ అందులో పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం సంతృప్తిని కలిగించలేదు.

ఇక అసలు విషయానికి వద్దాం. జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందే భారీ ప్యాన్ ఇండియా మూవీకి రుక్మిణి వసంత్ ని ఎంచుకున్నారన్న లీక్ రెండు మూడు వారాల క్రితమే వచ్చింది. ఇప్పుడు ఖరారయ్యే దిశగా ఒప్పందం జరిగిపోయిందని లేటెస్ట్ అప్డేట్. అయితే ఒక మెలిక పెట్టారట. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజయ్యే దాకా కొత్త కమిట్ మెంట్లు ఇవ్వకూడదని. నిర్మాణంలో ఉన్న శివ కార్తికేయన్ మూవీ తప్ప వేరొకరికి ఎస్ చెప్పకూడదు. తారక్ సరసన జోడిగా అంటే ఇంతకన్నా ఎవరైనా కోరుకునేది ఏముంటుంది. అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.

ఇలా చేయడం కెరీర్ పరంగా రైటా కాదా అని చూస్తే ఒకవిధంగా సరైన నిర్ణయమే అని చెప్పాలి. ఎందుకంటే రుక్మిణి వసంత్ ఇప్పటిదాకా స్టార్ లీగ్ లోకి ప్రవేశించలేదు. ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి. తారక్ తో చేయడమంటే బాలీవుడ్ దాకా రీచ్ ఉంటుంది. కాబట్టి ఏడాది వృథా కావడం పెద్ద మ్యాటర్ కాదు. సప్తసాగరాలు దాటి తర్వాత చేసినవేవి సక్సెస్ కాలేదు. పోనీ మంచి పాత్రలు వచ్చాయా అంటే అదీ లేదు. అలాంటప్పుడు సంవత్సరం వేస్ట్ అనుకోకుండా ఫిక్స్ అయిపోవడం ఉత్తమం. కాకపోతే సలార్, కెజిఎఫ్ లా కాకుండా ప్రశాంత్ నీల్ కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా రుక్మిణి పాత్రని డిజైన్ చేస్తే చాలు.

This post was last modified on November 27, 2024 4:33 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

19 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

59 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago