డబ్బింగ్ మూవీ ‘బాయ్స్’తో తెలుగులో మంచి ఫలితాన్నందుకుని.. స్ట్రెయిట్గా తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బస్టర్లలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ నటుడు సిద్ధార్థ్. అప్పట్లో అతను తెలుగు స్టార్లతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. యువతలో, ముఖ్యంగా అమ్మాయిల్లో తన ఫాలోయింగే వేరుగా ఉండేది. కానీ తర్వాత వరుస ఫెయిల్యూర్లు రావడంతో సిద్ధు వెనుకబడిపోయాడు. క్రమంగా తెలుగులో మార్కెట్ పడిపోయి, అవకాశాలు తగ్గిపోయి చివరికి తన మాతృ భాష అయిన తమిళంలోకి వెళ్లిపోయాడు. అక్కడ తన అభిరుచికి తగ్గ సినిమాలేవో చేసుకుంటూ సాగిపోతున్నాడు. అందులో కొన్ని విజయవంతమయ్యాయి. కొన్ని డిజాస్టర్లు అయ్యాయి. తెలుగు ప్రేక్షకులు అతణ్ని కాదనుకోవడం లాంటిదేమీ జరగలేదు. తనకు తానుగా కోలీవుడ్కు వెళ్లిపోయాడన్నది వాస్తవం.
ఐతే తిరిగి తెలుగులో మార్కెట్ సంపాదించాలని సిద్ధు చాలా ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాడు కానీ కుదరడం లేదు. ‘గృహం’ సినిమా గేమ్ చేంజర్ అవుతుందనుకున్నాడు కానీ.. అలా ఏమీ జరగలేదు. తర్వాత పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. తెలుగులో నేరుగా చేసిన ‘మహాసముద్రం’ పెద్ద డిజాస్టర్ కావడంతో సిద్ధు పుంజుకోవడానికి అవకాశమే లేకపోయింది. ఐతే ‘మహాసముద్రం’ టైంలో కానీ.. తన డబ్బింగ్ సినిమాల ప్రమోషన్ల కోసం వచ్చినపుడు కానీ.. సిద్ధులో ఒక రకమైన అసంతృప్తి, ఆవేదన, కోపం కనిపిస్తున్నాయి. తెలుగులో ఒకప్పుడు తనకున్న మార్కెట్ అంతా కరిగిపోవడం చూసి అతను తట్టుకోలేకపోతున్నాడు. తన సినిమాలకు థియేటర్లకు ఇవ్వమని, ప్రేక్షకులు వచ్చి థియేటర్లకు చూడమని అడగడం వరకు బాగానే ఉంది. కానీ టాలీవుడ్ మీద, ప్రేక్షకుల మీద అతను అసహనం చూపించడం.. మీడయా మీద కౌంటర్లు వేయడమే ఇక్కడి వాళ్లకు నచ్చట్లేదు. ఏమైనా అంటే ఒకప్పటి తన వైభవం గురించి మాట్లాడతాడు.
అప్పట్లోనే తాను పాన్ ఇండియా స్టార్ అంటాడు. తాను తెలుగులో సినిమాలు చేయట్లేదంటే అది ఇక్కడి ఫిలిం మేకర్స్ తప్పు అంటాడు. ఐతే సిద్ధుకు తెలుగులో ఎందుకు మార్కెట్ పడిపోయింది అన్నది అతను ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు చిత్రాలతో తన మీద భారీగా అంచనాలు పెంచాక.. సరైన సినిమాలు చేయలేదతను. చుక్కల్లో చంద్రుడు, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావ, 180, ఓ మై ఫ్రెండ్.. ఇలా సిద్ధు ఫ్లాపుల జాబితా పెద్దదే. ఎన్ని ఫ్లాపులు వస్తున్నా ప్రతిసారీ సిద్ధుకు తెలుగు ప్రేక్షకులు మంచి ఓపెనింగ్స్ ఇస్తూనే వచ్చారు. కానీ అతను ప్రేక్షకులను మెప్పించే సినిమాలను అందించలేకపోయాడు. అది తన జడ్జిమెంట్ లోపం. ‘ఓ మై ఫ్రెండ్’ తర్వాత తనకు తానుగా టాలీవుడ్ వదిలేసి కోలీవుడ్కు వెళ్లిపోయాడు. చాన్నాళ్లు ఇటు తిరిగి కూడా చూడలేదు. తన తమిళ చిత్రాల డబ్బింగ్ వెర్షన్లు కూడా ఇక్కడ రిలీజ్ కాలేదు. ఇక్కడ ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోయి, కొన్నేళ్ల పాటు ఇక్కడ సినిమాలే రిలీజ్ చేయని సిద్ధు.. ఇప్పుడొచ్చి ఇక్కడి దర్శకులు తనకు మంచి స్క్రిప్టులు ఇవ్వడం లేదు, ఆడియన్స్ తన సినిమాలు చూడట్లేదు అని అసహనం చెందితే లాభమేముంది?
This post was last modified on November 26, 2024 2:35 pm
రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన…
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…