యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్కు అనారోగ్యం అంటూ రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే అనారోగ్యం అంటే పెద్దగా పట్టింపు ఉండదు కానీ.. ఇది కరోనా కాలం కావడంతో దాని గురించి గుసగుసలు మొదలయ్యాయి. తేజుకు కరోనా సోకిందనే ప్రచారం మొదలైంది సోషల్ మీడియాలో. దీనిపై తేజు ఒకట్రెండు రోజులు మౌనంగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ట్విట్టర్ ద్వారా ఆ ప్రచారాన్ని సింపుల్గా ఖండించేశాడు.
తన గురించి జరుగుతున్న ప్రచారం గురించి ఏమీ మాట్లాడకుండా తాను ఆరోగ్యంగా, మామూలుగానే ఉన్నట్లు చెప్పకనే చెప్పాడు తేజు. తాను నటించబోయే కొత్త సినిమా దర్శకుడైన దేవా కట్టాతో కలిసి ఉన్న ఫొటో అది. దేవా ల్యాప్ టాప్ చూస్తూ ఏదో చెబుతుంటే తేజు రాసుకుంటూ కనిపించాడు. అతడిలో అనారోగ్య ఛాయలేమీ లేవు. కరోనా ఉంటే ఇలా వచ్చి దర్శకుడిని ఎందుకు కలుస్తాడు. కాబట్టి తేజుకు వైరస్ లాంటిదేమీ సోకలేదన్నమాట.
దేవా దర్శకత్వంలో చేయబోయే సినిమా గురించి తేజు ముందు నుంచి చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. తాజా ట్వీట్లోనూ దేవా రైటింగ్ అదుర్స్ అన్నట్లుగా మాట్లాడాడు. ఈ ట్వీట్పై దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ.. తనకు తెలిసినంత వరకు ఈ సినిమా అదిరిపోతుందని అన్నాడు. తేజు మావయ్య పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తయారైన పొలిటికల్ థ్రిల్లర్గా ఈ సినిమాను చెబుతున్నారు. తేజు ఇటీవలే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను పూర్తి చేశాడు. అది ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమ్ కానుంది. మరికొన్ని రోజుల్లోనే దేవా సినిమాను తేజు మొదలుపెట్టనున్నాడు.
This post was last modified on October 7, 2020 9:47 am
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…
ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు…
ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…
భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…