యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్కు అనారోగ్యం అంటూ రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే అనారోగ్యం అంటే పెద్దగా పట్టింపు ఉండదు కానీ.. ఇది కరోనా కాలం కావడంతో దాని గురించి గుసగుసలు మొదలయ్యాయి. తేజుకు కరోనా సోకిందనే ప్రచారం మొదలైంది సోషల్ మీడియాలో. దీనిపై తేజు ఒకట్రెండు రోజులు మౌనంగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ట్విట్టర్ ద్వారా ఆ ప్రచారాన్ని సింపుల్గా ఖండించేశాడు.
తన గురించి జరుగుతున్న ప్రచారం గురించి ఏమీ మాట్లాడకుండా తాను ఆరోగ్యంగా, మామూలుగానే ఉన్నట్లు చెప్పకనే చెప్పాడు తేజు. తాను నటించబోయే కొత్త సినిమా దర్శకుడైన దేవా కట్టాతో కలిసి ఉన్న ఫొటో అది. దేవా ల్యాప్ టాప్ చూస్తూ ఏదో చెబుతుంటే తేజు రాసుకుంటూ కనిపించాడు. అతడిలో అనారోగ్య ఛాయలేమీ లేవు. కరోనా ఉంటే ఇలా వచ్చి దర్శకుడిని ఎందుకు కలుస్తాడు. కాబట్టి తేజుకు వైరస్ లాంటిదేమీ సోకలేదన్నమాట.
దేవా దర్శకత్వంలో చేయబోయే సినిమా గురించి తేజు ముందు నుంచి చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. తాజా ట్వీట్లోనూ దేవా రైటింగ్ అదుర్స్ అన్నట్లుగా మాట్లాడాడు. ఈ ట్వీట్పై దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ.. తనకు తెలిసినంత వరకు ఈ సినిమా అదిరిపోతుందని అన్నాడు. తేజు మావయ్య పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తయారైన పొలిటికల్ థ్రిల్లర్గా ఈ సినిమాను చెబుతున్నారు. తేజు ఇటీవలే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను పూర్తి చేశాడు. అది ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమ్ కానుంది. మరికొన్ని రోజుల్లోనే దేవా సినిమాను తేజు మొదలుపెట్టనున్నాడు.
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను…