యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్కు అనారోగ్యం అంటూ రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే అనారోగ్యం అంటే పెద్దగా పట్టింపు ఉండదు కానీ.. ఇది కరోనా కాలం కావడంతో దాని గురించి గుసగుసలు మొదలయ్యాయి. తేజుకు కరోనా సోకిందనే ప్రచారం మొదలైంది సోషల్ మీడియాలో. దీనిపై తేజు ఒకట్రెండు రోజులు మౌనంగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ట్విట్టర్ ద్వారా ఆ ప్రచారాన్ని సింపుల్గా ఖండించేశాడు.
తన గురించి జరుగుతున్న ప్రచారం గురించి ఏమీ మాట్లాడకుండా తాను ఆరోగ్యంగా, మామూలుగానే ఉన్నట్లు చెప్పకనే చెప్పాడు తేజు. తాను నటించబోయే కొత్త సినిమా దర్శకుడైన దేవా కట్టాతో కలిసి ఉన్న ఫొటో అది. దేవా ల్యాప్ టాప్ చూస్తూ ఏదో చెబుతుంటే తేజు రాసుకుంటూ కనిపించాడు. అతడిలో అనారోగ్య ఛాయలేమీ లేవు. కరోనా ఉంటే ఇలా వచ్చి దర్శకుడిని ఎందుకు కలుస్తాడు. కాబట్టి తేజుకు వైరస్ లాంటిదేమీ సోకలేదన్నమాట.
దేవా దర్శకత్వంలో చేయబోయే సినిమా గురించి తేజు ముందు నుంచి చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. తాజా ట్వీట్లోనూ దేవా రైటింగ్ అదుర్స్ అన్నట్లుగా మాట్లాడాడు. ఈ ట్వీట్పై దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ.. తనకు తెలిసినంత వరకు ఈ సినిమా అదిరిపోతుందని అన్నాడు. తేజు మావయ్య పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తయారైన పొలిటికల్ థ్రిల్లర్గా ఈ సినిమాను చెబుతున్నారు. తేజు ఇటీవలే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను పూర్తి చేశాడు. అది ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమ్ కానుంది. మరికొన్ని రోజుల్లోనే దేవా సినిమాను తేజు మొదలుపెట్టనున్నాడు.
This post was last modified on October 7, 2020 9:47 am
రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం... ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం.…
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా…
ఎప్పుడూ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటూ హీరోల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. హీరోయిన్ల గురించి అంత…
టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కొడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ అయిపోయాడు.…
కొన్ని డిమాండ్ల గురించి చర్చకు తీసుకొచ్చినప్పుడు.. ఒకవైపు వాదన విన్నప్పుడు నిజమే కదా? అనిపిస్తుంది. కానీ.. అదే విషయాన్ని మరో…
పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో…