యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్కు అనారోగ్యం అంటూ రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే అనారోగ్యం అంటే పెద్దగా పట్టింపు ఉండదు కానీ.. ఇది కరోనా కాలం కావడంతో దాని గురించి గుసగుసలు మొదలయ్యాయి. తేజుకు కరోనా సోకిందనే ప్రచారం మొదలైంది సోషల్ మీడియాలో. దీనిపై తేజు ఒకట్రెండు రోజులు మౌనంగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ట్విట్టర్ ద్వారా ఆ ప్రచారాన్ని సింపుల్గా ఖండించేశాడు.
తన గురించి జరుగుతున్న ప్రచారం గురించి ఏమీ మాట్లాడకుండా తాను ఆరోగ్యంగా, మామూలుగానే ఉన్నట్లు చెప్పకనే చెప్పాడు తేజు. తాను నటించబోయే కొత్త సినిమా దర్శకుడైన దేవా కట్టాతో కలిసి ఉన్న ఫొటో అది. దేవా ల్యాప్ టాప్ చూస్తూ ఏదో చెబుతుంటే తేజు రాసుకుంటూ కనిపించాడు. అతడిలో అనారోగ్య ఛాయలేమీ లేవు. కరోనా ఉంటే ఇలా వచ్చి దర్శకుడిని ఎందుకు కలుస్తాడు. కాబట్టి తేజుకు వైరస్ లాంటిదేమీ సోకలేదన్నమాట.
దేవా దర్శకత్వంలో చేయబోయే సినిమా గురించి తేజు ముందు నుంచి చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. తాజా ట్వీట్లోనూ దేవా రైటింగ్ అదుర్స్ అన్నట్లుగా మాట్లాడాడు. ఈ ట్వీట్పై దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ.. తనకు తెలిసినంత వరకు ఈ సినిమా అదిరిపోతుందని అన్నాడు. తేజు మావయ్య పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తయారైన పొలిటికల్ థ్రిల్లర్గా ఈ సినిమాను చెబుతున్నారు. తేజు ఇటీవలే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను పూర్తి చేశాడు. అది ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమ్ కానుంది. మరికొన్ని రోజుల్లోనే దేవా సినిమాను తేజు మొదలుపెట్టనున్నాడు.
This post was last modified on October 7, 2020 9:47 am
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…