హిట్ అవుతుందనుకుంటే ఏకంగా రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకున్న అమరన్ నెల రోజులవుతున్నా ఇంకా బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉండటం గొప్ప విజయం. తమిళంలో అంటే ఏమో అనుకోవచ్చు కానీ తెలుగు వెర్షన్ సైతం దానికి ధీటుగా హిట్టు కొట్టడం ఊహించని పరిణామం. ఏకంగా విజయ్, కమల్, రజని స్థాయిలో శివ కార్తికేయన్ లాంటి టయర్ టూ హీరో కలెక్షన్లు కొల్లగొట్టడం చూసి ఎవరికీ నోటమాట రావడం లేదు. ఒక ఆర్మీ ఆఫీసర్ బయోపిక్ ని ఇంతగా ప్రేక్షకులు స్వంతం చేసుకోవడం అరుదు. గతంలో అడవి శేష్ మేజర్ సక్సెసైనప్పటికీ అమరన్ చాలా స్పెషల్ గా నిలిచింది.
ఇంతగా ఆడియెన్స్ కదిలించిన ఈ సినిమా హీరో శివ కార్తికేయన్ ప్రజలకు ట్విట్టర్ వాడొద్దని సలహా ఇస్తున్నాడు. ఎలాన్ మస్క్ తనను బ్లాక్ చేసినా సరే ఇది చెప్పకుండా ఉండలేకపోతున్నానని ఒక వివరణ ఇచ్చాడు. సాధారణంగా తన చిత్రం ఏదైనా ఫెయిలైనప్పుడు సోషల్ మీడియా మీద ఆధారపడి తప్పులను తెలుసుకునే ప్రయత్నం చేసేవాడినని కానీ అది ఫలితం ఇవ్వకపోగా నెగటివిటీని మరింత పెంచిందని చెప్పుకొచ్చాడు. టీవీ యాంకర్ గా ఉన్నప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి నేరుగా నిజమైన వ్యక్తుల ఫీడ్ బ్యాక్ తీసుకుని తప్పొప్పులను సరిచేసుకునేవాడినని, కానీ ఎక్స్ లో అలా సాధ్యం కాదని అన్నాడు.
బ్యాక్ టు బేసిక్స్ (మూలాల్లోకి వెళ్లి నేర్చుకోవడం) సూత్రాన్ని పాటించడం వల్లే గత రెండేళ్ల నుంచి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్టు వివరించాడు. క్రికెటర్లు ఫామ్ కోల్పోయినప్పడు చేయాల్సింది ఇదేనని మరో ఉదాహరణ ఇచ్చాడు. శివ కార్తికేయన్ వెర్షన్ లో చూస్తే ఒకరకంగా ఇది కరెక్టే. అక్కర్లేని తప్పుడు సమాచారం విపరీతంగా పెరిగిపోతున్న ట్రెండ్ లో ఏది రైట్ ఏది రాంగని గుర్తించలేని పలువురు నెటిజెన్లు అనవసరమైన సినీ, రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చి చేటు చేసుకుంటున్నారు. ట్విట్టర్ వాడకంలో మంచి బోలెడుంది. కానీ దాన్ని వాడుకునే నేర్పు లేనప్పుడు అమరన్ హీరో అన్నట్టు జాగ్రత్తగా ఉండటం అవసరం.
This post was last modified on November 26, 2024 12:37 pm
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…