Movie News

తెలుగు సినిమాలపై నేనలా అనలేదు-శ్రుతిహాసన్

కమల్ హాసన్ తనయురాలు శ్రుతి హాసన్ కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లే. తమిళం, తెలుగు, హిందీ.. ఇలా ప్రతి భాషలోనూ పరాజయాలు ఎదురవడంతో ఆమెపై ‘ఐరెన్ లెగ్’ ముద్ర పడిపోయింది. అలాంటి సమయంలో ‘గబ్బర్ సింగ్’ సినిమా ఆమె రాత మార్చింది. ‘బ్లాక్ బస్టర్ హీరోయిన్’ అన్న ముద్ర తీసుకొచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన బలుపు, రేసుగుర్రం సైతం బ్లాక్‌బస్టర్లయ్యాయి. ఇక శ్రుతి వెనుదిరిగి చూసుకోలేదు.

ఐతే తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నటించిన హిట్ సినిమాల గురించి శ్రుతి తక్కువ చేసి మాట్లాడటం వివాదాస్పదమైంది. ‘‘కెరీర్ ఆరంభంలో చాలా మంది కమర్షియల్ సినిమాలే చేయాలని చెప్పారు. కానీ అది నేను ఎక్కువ కాలం వినలేదు. ఐతే నేను కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాను. అవి చేస్తున్న సమయంలో నాకు అంత గొప్పగా అనిపించలేదు. ఇక నుంచి నేను మంచి ఛాయిస్‌లను నిజాయితీగా తీసుకుంటాను’’ అని ఆ ఇంటర్వ్యూలో శ్రుతి పేర్కొంది.

ఐతే ఇక్క శ్రుతి తేలిక చేసి మాట్లాడిన ‘బ్లాక్‌‌బస్టర్’ సినిమాలు గబ్బర్ సింగ్‌, రేసుగుర్రం‌లే అన్న అనుమానాలు నెటిజన్లలో వ్యక్తమయ్యాయి. కొన్ని మీడియాల్లో కూడా దీని గురించి వార్తలు రావడంతో శ్రుతి హాసన్ అప్రమత్తం అయింది. తెలుగు సినిమాల గురించి తాను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదంటూ ట్విట్టర్లో వివరణ ఇచ్చింది.

‘‘కొన్ని తెలుగు మీడియా సంస్థలు నేను జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూను తప్పుగా అర్థం చేసుకుని వక్రీకరించి వార్తలు రాశాయి. వాళ్ల ఉద్దేశాలు తప్పు. రేసుగుర్రం, గబ్బర్ సింగ్ లాంటి చిత్రాల్లో నేను నటించడం నాకెంతో గర్వకారణం.. పైగా పవన్ కళ్యాణ్‌తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా నా జీవితాన్ని మార్చింది. తెలుగు, దక్షిణాది చిత్ర సీమల్లో భాగస్వామిని అవ్వడం నా హృదయంలో ఒక భాగం కావడం లాంటిది. ఆ ఇంటర్వ్యూలో అన్న మాటల సందర్భం వేరు. నేను ఉత్తరాది సినిమాల గురించి ఆ మాటలు అన్నాను. నార్త్-సౌత్ అని సినిమాలను వేరు చేసి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు’’ అని శ్రుతి స్పష్టం చేసింది.

This post was last modified on October 6, 2020 2:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

53 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago