కమల్ హాసన్ తనయురాలు శ్రుతి హాసన్ కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లే. తమిళం, తెలుగు, హిందీ.. ఇలా ప్రతి భాషలోనూ పరాజయాలు ఎదురవడంతో ఆమెపై ‘ఐరెన్ లెగ్’ ముద్ర పడిపోయింది. అలాంటి సమయంలో ‘గబ్బర్ సింగ్’ సినిమా ఆమె రాత మార్చింది. ‘బ్లాక్ బస్టర్ హీరోయిన్’ అన్న ముద్ర తీసుకొచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన బలుపు, రేసుగుర్రం సైతం బ్లాక్బస్టర్లయ్యాయి. ఇక శ్రుతి వెనుదిరిగి చూసుకోలేదు.
ఐతే తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నటించిన హిట్ సినిమాల గురించి శ్రుతి తక్కువ చేసి మాట్లాడటం వివాదాస్పదమైంది. ‘‘కెరీర్ ఆరంభంలో చాలా మంది కమర్షియల్ సినిమాలే చేయాలని చెప్పారు. కానీ అది నేను ఎక్కువ కాలం వినలేదు. ఐతే నేను కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాను. అవి చేస్తున్న సమయంలో నాకు అంత గొప్పగా అనిపించలేదు. ఇక నుంచి నేను మంచి ఛాయిస్లను నిజాయితీగా తీసుకుంటాను’’ అని ఆ ఇంటర్వ్యూలో శ్రుతి పేర్కొంది.
ఐతే ఇక్క శ్రుతి తేలిక చేసి మాట్లాడిన ‘బ్లాక్బస్టర్’ సినిమాలు గబ్బర్ సింగ్, రేసుగుర్రంలే అన్న అనుమానాలు నెటిజన్లలో వ్యక్తమయ్యాయి. కొన్ని మీడియాల్లో కూడా దీని గురించి వార్తలు రావడంతో శ్రుతి హాసన్ అప్రమత్తం అయింది. తెలుగు సినిమాల గురించి తాను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదంటూ ట్విట్టర్లో వివరణ ఇచ్చింది.
‘‘కొన్ని తెలుగు మీడియా సంస్థలు నేను జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూను తప్పుగా అర్థం చేసుకుని వక్రీకరించి వార్తలు రాశాయి. వాళ్ల ఉద్దేశాలు తప్పు. రేసుగుర్రం, గబ్బర్ సింగ్ లాంటి చిత్రాల్లో నేను నటించడం నాకెంతో గర్వకారణం.. పైగా పవన్ కళ్యాణ్తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా నా జీవితాన్ని మార్చింది. తెలుగు, దక్షిణాది చిత్ర సీమల్లో భాగస్వామిని అవ్వడం నా హృదయంలో ఒక భాగం కావడం లాంటిది. ఆ ఇంటర్వ్యూలో అన్న మాటల సందర్భం వేరు. నేను ఉత్తరాది సినిమాల గురించి ఆ మాటలు అన్నాను. నార్త్-సౌత్ అని సినిమాలను వేరు చేసి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు’’ అని శ్రుతి స్పష్టం చేసింది.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…