కమల్ హాసన్ తనయురాలు శ్రుతి హాసన్ కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లే. తమిళం, తెలుగు, హిందీ.. ఇలా ప్రతి భాషలోనూ పరాజయాలు ఎదురవడంతో ఆమెపై ‘ఐరెన్ లెగ్’ ముద్ర పడిపోయింది. అలాంటి సమయంలో ‘గబ్బర్ సింగ్’ సినిమా ఆమె రాత మార్చింది. ‘బ్లాక్ బస్టర్ హీరోయిన్’ అన్న ముద్ర తీసుకొచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన బలుపు, రేసుగుర్రం సైతం బ్లాక్బస్టర్లయ్యాయి. ఇక శ్రుతి వెనుదిరిగి చూసుకోలేదు.
ఐతే తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నటించిన హిట్ సినిమాల గురించి శ్రుతి తక్కువ చేసి మాట్లాడటం వివాదాస్పదమైంది. ‘‘కెరీర్ ఆరంభంలో చాలా మంది కమర్షియల్ సినిమాలే చేయాలని చెప్పారు. కానీ అది నేను ఎక్కువ కాలం వినలేదు. ఐతే నేను కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాను. అవి చేస్తున్న సమయంలో నాకు అంత గొప్పగా అనిపించలేదు. ఇక నుంచి నేను మంచి ఛాయిస్లను నిజాయితీగా తీసుకుంటాను’’ అని ఆ ఇంటర్వ్యూలో శ్రుతి పేర్కొంది.
ఐతే ఇక్క శ్రుతి తేలిక చేసి మాట్లాడిన ‘బ్లాక్బస్టర్’ సినిమాలు గబ్బర్ సింగ్, రేసుగుర్రంలే అన్న అనుమానాలు నెటిజన్లలో వ్యక్తమయ్యాయి. కొన్ని మీడియాల్లో కూడా దీని గురించి వార్తలు రావడంతో శ్రుతి హాసన్ అప్రమత్తం అయింది. తెలుగు సినిమాల గురించి తాను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదంటూ ట్విట్టర్లో వివరణ ఇచ్చింది.
‘‘కొన్ని తెలుగు మీడియా సంస్థలు నేను జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూను తప్పుగా అర్థం చేసుకుని వక్రీకరించి వార్తలు రాశాయి. వాళ్ల ఉద్దేశాలు తప్పు. రేసుగుర్రం, గబ్బర్ సింగ్ లాంటి చిత్రాల్లో నేను నటించడం నాకెంతో గర్వకారణం.. పైగా పవన్ కళ్యాణ్తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా నా జీవితాన్ని మార్చింది. తెలుగు, దక్షిణాది చిత్ర సీమల్లో భాగస్వామిని అవ్వడం నా హృదయంలో ఒక భాగం కావడం లాంటిది. ఆ ఇంటర్వ్యూలో అన్న మాటల సందర్భం వేరు. నేను ఉత్తరాది సినిమాల గురించి ఆ మాటలు అన్నాను. నార్త్-సౌత్ అని సినిమాలను వేరు చేసి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు’’ అని శ్రుతి స్పష్టం చేసింది.
This post was last modified on October 6, 2020 2:53 pm
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…