కమల్ హాసన్ తనయురాలు శ్రుతి హాసన్ కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లే. తమిళం, తెలుగు, హిందీ.. ఇలా ప్రతి భాషలోనూ పరాజయాలు ఎదురవడంతో ఆమెపై ‘ఐరెన్ లెగ్’ ముద్ర పడిపోయింది. అలాంటి సమయంలో ‘గబ్బర్ సింగ్’ సినిమా ఆమె రాత మార్చింది. ‘బ్లాక్ బస్టర్ హీరోయిన్’ అన్న ముద్ర తీసుకొచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన బలుపు, రేసుగుర్రం సైతం బ్లాక్బస్టర్లయ్యాయి. ఇక శ్రుతి వెనుదిరిగి చూసుకోలేదు.
ఐతే తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నటించిన హిట్ సినిమాల గురించి శ్రుతి తక్కువ చేసి మాట్లాడటం వివాదాస్పదమైంది. ‘‘కెరీర్ ఆరంభంలో చాలా మంది కమర్షియల్ సినిమాలే చేయాలని చెప్పారు. కానీ అది నేను ఎక్కువ కాలం వినలేదు. ఐతే నేను కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాను. అవి చేస్తున్న సమయంలో నాకు అంత గొప్పగా అనిపించలేదు. ఇక నుంచి నేను మంచి ఛాయిస్లను నిజాయితీగా తీసుకుంటాను’’ అని ఆ ఇంటర్వ్యూలో శ్రుతి పేర్కొంది.
ఐతే ఇక్క శ్రుతి తేలిక చేసి మాట్లాడిన ‘బ్లాక్బస్టర్’ సినిమాలు గబ్బర్ సింగ్, రేసుగుర్రంలే అన్న అనుమానాలు నెటిజన్లలో వ్యక్తమయ్యాయి. కొన్ని మీడియాల్లో కూడా దీని గురించి వార్తలు రావడంతో శ్రుతి హాసన్ అప్రమత్తం అయింది. తెలుగు సినిమాల గురించి తాను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదంటూ ట్విట్టర్లో వివరణ ఇచ్చింది.
‘‘కొన్ని తెలుగు మీడియా సంస్థలు నేను జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూను తప్పుగా అర్థం చేసుకుని వక్రీకరించి వార్తలు రాశాయి. వాళ్ల ఉద్దేశాలు తప్పు. రేసుగుర్రం, గబ్బర్ సింగ్ లాంటి చిత్రాల్లో నేను నటించడం నాకెంతో గర్వకారణం.. పైగా పవన్ కళ్యాణ్తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా నా జీవితాన్ని మార్చింది. తెలుగు, దక్షిణాది చిత్ర సీమల్లో భాగస్వామిని అవ్వడం నా హృదయంలో ఒక భాగం కావడం లాంటిది. ఆ ఇంటర్వ్యూలో అన్న మాటల సందర్భం వేరు. నేను ఉత్తరాది సినిమాల గురించి ఆ మాటలు అన్నాను. నార్త్-సౌత్ అని సినిమాలను వేరు చేసి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు’’ అని శ్రుతి స్పష్టం చేసింది.
This post was last modified on October 6, 2020 2:53 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…