దీపావళికి విడుదలై సూపర్ హిట్ కొట్టేసిన ‘క’ ఓటిటిలో వచ్చేస్తోంది. వచ్చే నవంబర్ 28 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంటే సరిగ్గా నెల రోజులకు డిజిటల్ రిలీజన్న మాట. నిన్నే మలయాళం డబ్బింగ్ వెర్షన్ థియేటర్లలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అక్కడి రెస్పాన్స్ సంగతి పక్కనపెడితే ఇంత త్వరగా ఒక సూపర్ హిట్ మూవీ స్మార్ట్ స్క్రీన్ పై రావడం కొత్తేమి కాదు కానీ ఇంకొన్ని రోజులు ఆగి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయం. కానీ ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ‘క’ ఇంకా కొనసాగుతోంది కానీ కలెక్షన్లు నామమాత్రంగానే ఉంటున్నాయి.
అయితే ‘క’ ఓటిటి వెర్షన్ కు ఒక ప్రత్యేకత ఉంది. మొదటిసారి డాల్బీ విజన్ సినిమా, అట్మోస్ సౌండ్ తో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మంచి 4కె స్క్రీన్ ఉంటే మాత్రం బెస్ట్ క్వాలిటీని ఎంజాయ్ చేయొచ్చు. సుజీత్ సందీప్ జంటగా దర్శకత్వం వహించిన ఈ విలేజ్ థ్రిల్లర్ కు క్లైమాక్స్ ఆయువుపట్టుగా నిలిచింది. నాగ చైతన్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా రావడం, కిరణ్ అబ్బవరం ఆవేదన కలిగిన స్పీచ్ ఓపెనింగ్స్ కి బాగా దోహదపడ్డాయి. దానికి తగ్గట్టే కంటెంట్ థ్రిల్లింగ్ గా ఉండటంతో ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు.
లక్కీ భాస్కర్, అమరన్ పోటీని తట్టుకుని నిలవడం ‘క’ గర్వించాల్సిన అసలు విషయం. ట్విస్ట్ ఏంటంటే ‘క’కు రెండు మూడు రోజుల గ్యాప్ లోనే లక్కీ భాస్కర్, అమరన్ కూడా ఓటిటిలో వస్తాయన్న వార్తల నేపథ్యంలో ఈ వారం సినీ ప్రియులకు ఇంట్లోనే మూవీ ఫెస్టివల్ ఖాయమనేలా ఉంది. వీటికి సంబంధించిన ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ‘క’ సక్సెస్ తర్వాత కిరణ్ ప్రశాంతంగా ఉన్నాడు. త్వరలోనే దిల్ రుబా విడుదలకు రెడీ అవుతోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు ‘క’ పుణ్యమాని బిజినెస్ ఆఫర్స్ బాగుంటాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు
This post was last modified on November 24, 2024 7:56 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…