కీర్తి సురేష్ అంటే ఇంతకుముందు ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర ఉండేది. కెరీర్ ఆరంభం నుంచి ఆమె సంప్రదాయబద్ధమైన పాత్రలే చేస్తూ వచ్చింది. ‘మహానటి’తో కథానాయికగా తిరుగులేని స్థాయిని అందుకుని పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు తెచ్చుకున్నాక కూడా కొన్ని పరిమితుల్లోనే నటించింది. కానీ ‘సర్కారు వారి పాట’ దగ్గర్నుంచి ఆమెలోని గ్లామర్ కోణాన్ని చూస్తున్నాం. కానీ ఈ మధ్య ఆమె జస్ట్ గ్లామర్తో సరిపెట్టడం లేదు. ఎక్స్పోజింగ్ చేయడానికి కూడా వెనుకాడట్లేదు. తన డ్రెస్సింగ్ స్టైలే మారిపోయింది.
ఫొటో షూట్లలో, ఏవైనా ఈవెంట్లకు హాజరైనపుడు ఎంత సెక్సీగా కనిపిస్తోందో చూస్తూనే ఉన్నాం. ఇదంతా కూడా బాలీవుడ్ ఎఫెక్టే అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఆమె వరుణ్ ధావన్ చిత్రం ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ హీరోయిన్ అంటే సూపర్ సెక్సీగా కనిపించాల్సిందే. సౌత్ హీరోయిన్లు బాలీవుడ్లో నటిస్తే వాళ్ల లుక్సే మారిపోతుంటాయి. కీర్తి సురేష్ సైతం ఆ బాటలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్న నేపథ్యంలో ఒక పోస్టర్ వదిలారు. అందులో కీర్తి లుక్ చూసి అందరూ షాకవుతున్నారు. అందులో అంత సెక్సీగా కనిపిస్తోందామె. ఇప్పటికే బయట కీర్తి లుక్స్ చూసి బాలీవుడ్ ఎఫెక్ట్.. బాలీవుడ్ ఎఫెక్ట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ పాటలో కీర్తి అనుకున్నట్లే అందాలు ఆరబోస్తే ఈ అభిప్రాయం మరింత బలపడుతుంది. ‘బేబీ జాన్’ కోసం కీర్తి లిప్ లాక్స్ కూడా చేసిందని.. కెరీర్లో ఇలా చేయడం ఇదే తొలిసారి ఇంతకుముందే వార్తలు వచ్చాయి. మరి నిజంగానే కీర్తి పెదవి ముద్దు చేసిందంటే సౌత్ జనాలు కూడా ఈ సినిమాను చూస్తారనడంలో సందేహం లేదు. తమిళ బ్లాక్ బస్టర్ ‘తెరి’కి రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దాని దర్శకుడు అట్లీ బాలీవుడ్ నిర్మాతలతో కలిసి ప్రొడ్యూస్ చేశాడు. కాలీస్ డైరెక్ట్ చేశాడు. ఒరిజినల్లో సమంత చేసిన పాత్రను కీర్తి పోషిస్తోంది.
This post was last modified on November 23, 2024 1:57 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…