కీర్తి సురేష్ అంటే ఇంతకుముందు ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర ఉండేది. కెరీర్ ఆరంభం నుంచి ఆమె సంప్రదాయబద్ధమైన పాత్రలే చేస్తూ వచ్చింది. ‘మహానటి’తో కథానాయికగా తిరుగులేని స్థాయిని అందుకుని పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు తెచ్చుకున్నాక కూడా కొన్ని పరిమితుల్లోనే నటించింది. కానీ ‘సర్కారు వారి పాట’ దగ్గర్నుంచి ఆమెలోని గ్లామర్ కోణాన్ని చూస్తున్నాం. కానీ ఈ మధ్య ఆమె జస్ట్ గ్లామర్తో సరిపెట్టడం లేదు. ఎక్స్పోజింగ్ చేయడానికి కూడా వెనుకాడట్లేదు. తన డ్రెస్సింగ్ స్టైలే మారిపోయింది.
ఫొటో షూట్లలో, ఏవైనా ఈవెంట్లకు హాజరైనపుడు ఎంత సెక్సీగా కనిపిస్తోందో చూస్తూనే ఉన్నాం. ఇదంతా కూడా బాలీవుడ్ ఎఫెక్టే అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఆమె వరుణ్ ధావన్ చిత్రం ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ హీరోయిన్ అంటే సూపర్ సెక్సీగా కనిపించాల్సిందే. సౌత్ హీరోయిన్లు బాలీవుడ్లో నటిస్తే వాళ్ల లుక్సే మారిపోతుంటాయి. కీర్తి సురేష్ సైతం ఆ బాటలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్న నేపథ్యంలో ఒక పోస్టర్ వదిలారు. అందులో కీర్తి లుక్ చూసి అందరూ షాకవుతున్నారు. అందులో అంత సెక్సీగా కనిపిస్తోందామె. ఇప్పటికే బయట కీర్తి లుక్స్ చూసి బాలీవుడ్ ఎఫెక్ట్.. బాలీవుడ్ ఎఫెక్ట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ పాటలో కీర్తి అనుకున్నట్లే అందాలు ఆరబోస్తే ఈ అభిప్రాయం మరింత బలపడుతుంది. ‘బేబీ జాన్’ కోసం కీర్తి లిప్ లాక్స్ కూడా చేసిందని.. కెరీర్లో ఇలా చేయడం ఇదే తొలిసారి ఇంతకుముందే వార్తలు వచ్చాయి. మరి నిజంగానే కీర్తి పెదవి ముద్దు చేసిందంటే సౌత్ జనాలు కూడా ఈ సినిమాను చూస్తారనడంలో సందేహం లేదు. తమిళ బ్లాక్ బస్టర్ ‘తెరి’కి రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దాని దర్శకుడు అట్లీ బాలీవుడ్ నిర్మాతలతో కలిసి ప్రొడ్యూస్ చేశాడు. కాలీస్ డైరెక్ట్ చేశాడు. ఒరిజినల్లో సమంత చేసిన పాత్రను కీర్తి పోషిస్తోంది.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…