నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులను తెలుగు సినిమాకు రెండు కళ్లుగా చెప్పేవారు ఒకప్పుడు. వీళ్లిద్దరూ ఎవరి స్థాయిలో వాళ్లు అద్భుతమైన పాత్రలు, గొప్ప చిత్రాలతో తెలుగు సినిమాపై తమదైన ముద్ర వేశారు. ఎన్నో ఘనవిజయాలు అందుకున్నారు. ఎన్టీఆర్ మాస్ చిత్రాలతో తిరుగులేని స్థాయి అందుకుంటే.. ఏఎన్నార్ క్లాస్ సినిమాలతోనే గొప్ప స్థాయిని అందుకున్నారు.
తొలి తరం ట్రెండుకు తగ్గట్లుగా ఎన్టీఆర్లాగా ఎక్కువగా పౌరాణిక చిత్రాలు చేయకపోయినా.. ఆహార్యం, వాచకం లాంటి విషయాల్లో ఎన్టీఆర్ ముందు నిలవలేకపోయినా.. తర్వాతి దశలో మాస్ చిత్రాలు పెద్దగా చేయకపోయినా.. ఎన్టీఆర్కు దీటుగా ఏఎన్నార్ నిలబడడం మామూలు విషయం కాదు. తనకున్న పరిమితుల్లోనే తిరుగులేని విజయాలు సాధించిన ఏఎన్నార్.. తన కెరీర్ ఆరంభంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారంటే షాకవ్వక తప్పదు. గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ వేడుకల్లో మాట్లాడుతూ నాగ్ ఈ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.
“నాన్నగారు నాటకాలు వేసే సమయానికి మహిళలు నటనలోకి వచ్చేవాళ్లు కాదు. దీంతో ఆయన స్టేజ్ మీద ఆడవాళ్ల పాత్రలు వేసేవారు. ఆయన అరంగేట్రం చేసిందే హీరోయిన్ పాత్రతో. ఐతే అమ్మాయిలా కనిపించడం, అమ్మాయిలా మాట్లాడ్డంతో ఆయన్ని చాలామంది ఎగతాళి చేసేవారు. దీంతో ఆయన అవమానంగా భావించి ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. మద్రాస్ మెరీనా బీచ్కు వెళ్లి నీళ్లలోపలికి వెళ్లిపోయారు. కానీ అప్పుడే అది సరైన పని కాదని తన మనసు చెప్పింది. దీంతో వెనక్కి వచ్చేశారు.
తర్వాత ఘంటసాల బలరామయ్య గారు రైల్వే స్టేషన్లో నాన్నగారిని చూడడం, సినిమాల్లో నటిస్తావా అని అడగడం.. అలా సినీ రంగంలో అడుగు పెట్టడం అదంతా ఒక చరిత్ర. సినిమాల్లోకి వచ్చాక కూడా తన వాచకం విషయంలో నాన్న చాలా ఇబ్బంది పడ్డారు. రఫ్ వాయిస్ తెచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. సిగరెట్ తాగితే వాయిస్ రఫ్ అవుతుందంటే అదీ ప్రయత్నించారు. వాయిస్ మార్చుకోవడానికి ఉదయమే బీచ్ దగ్గరికి వెళ్లి ఐదు పది నిమిషాల పాటు గట్టిగా అరవడం లాంటివి కూడా చేశారు” అని నాగ్ వెల్లడించారు.
This post was last modified on November 23, 2024 12:28 pm
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…