నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులను తెలుగు సినిమాకు రెండు కళ్లుగా చెప్పేవారు ఒకప్పుడు. వీళ్లిద్దరూ ఎవరి స్థాయిలో వాళ్లు అద్భుతమైన పాత్రలు, గొప్ప చిత్రాలతో తెలుగు సినిమాపై తమదైన ముద్ర వేశారు. ఎన్నో ఘనవిజయాలు అందుకున్నారు. ఎన్టీఆర్ మాస్ చిత్రాలతో తిరుగులేని స్థాయి అందుకుంటే.. ఏఎన్నార్ క్లాస్ సినిమాలతోనే గొప్ప స్థాయిని అందుకున్నారు.
తొలి తరం ట్రెండుకు తగ్గట్లుగా ఎన్టీఆర్లాగా ఎక్కువగా పౌరాణిక చిత్రాలు చేయకపోయినా.. ఆహార్యం, వాచకం లాంటి విషయాల్లో ఎన్టీఆర్ ముందు నిలవలేకపోయినా.. తర్వాతి దశలో మాస్ చిత్రాలు పెద్దగా చేయకపోయినా.. ఎన్టీఆర్కు దీటుగా ఏఎన్నార్ నిలబడడం మామూలు విషయం కాదు. తనకున్న పరిమితుల్లోనే తిరుగులేని విజయాలు సాధించిన ఏఎన్నార్.. తన కెరీర్ ఆరంభంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారంటే షాకవ్వక తప్పదు. గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ వేడుకల్లో మాట్లాడుతూ నాగ్ ఈ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.
“నాన్నగారు నాటకాలు వేసే సమయానికి మహిళలు నటనలోకి వచ్చేవాళ్లు కాదు. దీంతో ఆయన స్టేజ్ మీద ఆడవాళ్ల పాత్రలు వేసేవారు. ఆయన అరంగేట్రం చేసిందే హీరోయిన్ పాత్రతో. ఐతే అమ్మాయిలా కనిపించడం, అమ్మాయిలా మాట్లాడ్డంతో ఆయన్ని చాలామంది ఎగతాళి చేసేవారు. దీంతో ఆయన అవమానంగా భావించి ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. మద్రాస్ మెరీనా బీచ్కు వెళ్లి నీళ్లలోపలికి వెళ్లిపోయారు. కానీ అప్పుడే అది సరైన పని కాదని తన మనసు చెప్పింది. దీంతో వెనక్కి వచ్చేశారు.
తర్వాత ఘంటసాల బలరామయ్య గారు రైల్వే స్టేషన్లో నాన్నగారిని చూడడం, సినిమాల్లో నటిస్తావా అని అడగడం.. అలా సినీ రంగంలో అడుగు పెట్టడం అదంతా ఒక చరిత్ర. సినిమాల్లోకి వచ్చాక కూడా తన వాచకం విషయంలో నాన్న చాలా ఇబ్బంది పడ్డారు. రఫ్ వాయిస్ తెచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. సిగరెట్ తాగితే వాయిస్ రఫ్ అవుతుందంటే అదీ ప్రయత్నించారు. వాయిస్ మార్చుకోవడానికి ఉదయమే బీచ్ దగ్గరికి వెళ్లి ఐదు పది నిమిషాల పాటు గట్టిగా అరవడం లాంటివి కూడా చేశారు” అని నాగ్ వెల్లడించారు.
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…