మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ విడుదల తేదీ మాత్రం ఇప్పటిదాకా ప్రకటించలేదు. తాజాగా రిలీజ్ చేసిన మోహన్ బాబు లుక్ లోనూ ఏ వివరం లేదు. టీజర్ వచ్చాక టీమ్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. కొంత ట్రోలింగ్ జరగడం, దాని మీద విష్ణు సీరియస్ గా రెస్పాండ్ కావడం ఇవన్నీ పాత వ్యవహారాలు. వీలైనంత త్వరగా థియేటర్లకు తీసుకువచ్చే నిర్ణయం తీసుకుంటే బెటరనేది అభిమానుల ఫీలింగ్. కానీ వాస్తవ కోణంలో ఆలోచిస్తే ఇలా జాప్యం చేయడం కూడా ఒకరకంగా మంచికే అనిపిస్తోంది.
ఎందుకంటే డిసెంబర్, జనవరి రెండు నెలలు పెద్ద సినిమాలతో పూర్తిగా ప్యాకయ్యాయి. పోటీకి వెళ్తే లేనిపోని రిస్క్. ప్రభాస్ క్యామియో చేశాడు కదా భయమెందుకు అనిపించవచ్చు. కానీ అది ఓపెనింగ్స్ కి పనికి వస్తుంది కానీ లాంగ్ రన్ రావాలంటే తక్కువ నిడివి చేసిన డార్లింగ్ సరిపోడు. అసలు కంటెంట్ మాట్లాడాలి. కానీ పబ్లిసిటీలో వాడుతున్న పోస్టర్లు ఆసక్తిని అమాంతం పెంచడంలో విఫలమవుతున్నాయి. ఇంకేదైనా వినూత్నంగా చేయాలనే డిమాండ్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఏర్పడుతున్న విపరీత పోటీని చూసే మంచు విష్ణు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం లేదు.
శివరాత్రి కన్నా మంచి ఆప్షన్ దొరక్కపోవచ్చు కాబట్టి వీలైనంత త్వరగా దాన్ని లాక్ చేసుకోవడం ఉత్తమం. ఇప్పటికే నితిన్ తమ్ముడు లాంటివి పండక్కు వస్తామని అధికారికంగా ప్రకటనలు ఇచ్చాయి. చివరి నిమిషంలో హడావిడి పడటం కన్నా కన్నప్ప ముందైతే డెసిషన్ తీసుకుని ఆపై ప్రమోషన్ల గురించి ఆలోచించవచ్చు. చాలా పెద్ద క్యాస్టింగ్ తో రూపొందిన కన్నప్పని వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తీశారని టాక్. థియేటర్ హక్కులు కాకుండా ఓటిటిలోనూ మంచి ఆదాయం రావాలంటే ఈ ప్రాజెక్టు మీద ఎగ్జైట్ మెంట్ కలిగించేలా ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉండాలి. అన్ని భాషల్లో ఒకే డేట్ సెట్ చేయడం కూడా సవాలే.
This post was last modified on November 22, 2024 5:11 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…