టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తర్వాత చై, శోభితలు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దీంతో, ఈ స్టార్ కపుల్ పెళ్లి ఎప్పుడు అని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి పెళ్లి తేదీ, వెన్యూ రివీల్ చేస్తూ అక్కినేని నాగార్జున బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు.
డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో నాగ చైతన్య, శోభితల పెళ్లి జరపాలని నిశ్చయించామని నాగ్ చెప్పారు. అయితే, పెళ్లి చాలా సింపుల్ గా చేసుకోవాలని వారిద్దరూ భావిస్తున్నారని, అందుకే కేవలం 400 మంది సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో వారి వివాహం జరగబోతోందని నాగె వెల్లడించారు. సింపుల్ గా వివాహం చేసుకునే నిర్ణయంతో పాటు ఆ ఏర్పాట్లను కూడా వారికే వదిలేశానని తెలిపారు.
గోవాలో జరిగిన ఐఎఫ్ఎఫ్ఐ 2024 అవార్డ్స్ వేడుకలలో అక్కినేని ఫ్యామిలీ సందడి చేసింది. నాగ చైతన్య తనకు కాబోయే భార్య శోభిత దూళిపాళ్లతో సందడి చేశారు. ఇక, అక్కినేని నాగార్జున, అమల జంట కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య-శోభితల పెళ్లి తేదీ, వేదికపై నాగార్జున ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం చై-శోభితల పెళ్లి డేట్ న్యూస్ వైరల్ గా మారింది.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…