టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తర్వాత చై, శోభితలు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దీంతో, ఈ స్టార్ కపుల్ పెళ్లి ఎప్పుడు అని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి పెళ్లి తేదీ, వెన్యూ రివీల్ చేస్తూ అక్కినేని నాగార్జున బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు.
డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో నాగ చైతన్య, శోభితల పెళ్లి జరపాలని నిశ్చయించామని నాగ్ చెప్పారు. అయితే, పెళ్లి చాలా సింపుల్ గా చేసుకోవాలని వారిద్దరూ భావిస్తున్నారని, అందుకే కేవలం 400 మంది సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో వారి వివాహం జరగబోతోందని నాగె వెల్లడించారు. సింపుల్ గా వివాహం చేసుకునే నిర్ణయంతో పాటు ఆ ఏర్పాట్లను కూడా వారికే వదిలేశానని తెలిపారు.
గోవాలో జరిగిన ఐఎఫ్ఎఫ్ఐ 2024 అవార్డ్స్ వేడుకలలో అక్కినేని ఫ్యామిలీ సందడి చేసింది. నాగ చైతన్య తనకు కాబోయే భార్య శోభిత దూళిపాళ్లతో సందడి చేశారు. ఇక, అక్కినేని నాగార్జున, అమల జంట కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య-శోభితల పెళ్లి తేదీ, వేదికపై నాగార్జున ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం చై-శోభితల పెళ్లి డేట్ న్యూస్ వైరల్ గా మారింది.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
రాజకీయ నాయకులకు కొన్ని ప్రత్యేకమైన మేనరిజాలు, సిగ్నేచర్లు ఉంటాయి. అవే వారికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి…
మాములుగా మన తెలుగు తమిళ సినిమాల్లో మాఫియా అంటే ముంబైనే చూపిస్తారు. రజనీకాంత్ బాషా నుంచి పవన్ కళ్యాణ్ ఓజి…
ది రాజా సాబ్ తర్వాత దాన్ని మర్చిపోయే సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. వాళ్ళు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులు తెలుగువాళ్లే. ఆర్య తీసిన సుకుమార్,…
రష్యా నుంచి ముడి చమురు (ఆయిల్) కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. రష్యా…