టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తర్వాత చై, శోభితలు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దీంతో, ఈ స్టార్ కపుల్ పెళ్లి ఎప్పుడు అని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి పెళ్లి తేదీ, వెన్యూ రివీల్ చేస్తూ అక్కినేని నాగార్జున బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు.
డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో నాగ చైతన్య, శోభితల పెళ్లి జరపాలని నిశ్చయించామని నాగ్ చెప్పారు. అయితే, పెళ్లి చాలా సింపుల్ గా చేసుకోవాలని వారిద్దరూ భావిస్తున్నారని, అందుకే కేవలం 400 మంది సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో వారి వివాహం జరగబోతోందని నాగె వెల్లడించారు. సింపుల్ గా వివాహం చేసుకునే నిర్ణయంతో పాటు ఆ ఏర్పాట్లను కూడా వారికే వదిలేశానని తెలిపారు.
గోవాలో జరిగిన ఐఎఫ్ఎఫ్ఐ 2024 అవార్డ్స్ వేడుకలలో అక్కినేని ఫ్యామిలీ సందడి చేసింది. నాగ చైతన్య తనకు కాబోయే భార్య శోభిత దూళిపాళ్లతో సందడి చేశారు. ఇక, అక్కినేని నాగార్జున, అమల జంట కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య-శోభితల పెళ్లి తేదీ, వేదికపై నాగార్జున ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం చై-శోభితల పెళ్లి డేట్ న్యూస్ వైరల్ గా మారింది.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…