తెలుగులో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. అచ్చమైన తెలుగు సినిమా తీయాలంటే ఇప్పుడు ఆయన తర్వాతే ఎవరైనా. జంధ్యాల తరహాలో ఈ తరంలో తెలుగుదనం ఉట్టిపడే, సునిశితమైన హాస్యంతో ఆయన నవ్వించగలరు. ఆయనకు కెరీర్లో పెద్ద బ్రేక్ ఇచ్చిన ‘అష్టాచెమ్మా’ తరహాలో సినిమా తీస్తే చూడాలని ప్రేక్షకులు ఆశపడుతున్నారు.
జెంటిల్మ్యాన్, సమ్మోహనం, వి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ఇలా ఇంద్రగంటి చివరగా తీసిన సినిమాలన్నీ సీరియస్ టచ్ ఉన్నవే. వీటిలో ‘జెంటిల్మ్యాన్’, ‘సమ్మోహనం’ విజయవంతం అయ్యాయి. మిగతావి నిరాశ పరిచాయి. ‘అష్టాచెమ్మా’ తర్వాత ‘అమీతుమీ’లోనూ ఆయన వినోదాన్ని బాగా పండించారు. కొంచెం గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ ఆ శైలిలో సినిమా చేశారు. ఆ చిత్రమే.. సారంగపాణి జాతకం.
ఈ రోజే విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘సారంగపాణి జాతకం’ టీజర్ రిలీజైంది. జాతకాల పిచ్చి ఉన్న ఓ కుర్రాడు.. తన చేతిని చూసి ఒక మోడర్న్ జ్యోతిష్యుడు చెప్పిన విషయాలను అనుసరించి తన చుట్టూ ఉన్న వారిని బెంబేలెత్తించే నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. మోడర్న్ జ్యోతిష్యుడిగా అవసరాల శ్రీనివాస్ నటించగా.. జాతకాల పిచ్చితో తన కుటుంబ సభ్యులు, స్నేహితులను ఉక్కిరి బిక్కిరి చేసే హీరో పాత్రను ప్రియదర్శి పులికొండ చేశాడు. టీజర్లో కాన్సెప్ట్, కామెడీ అన్నీ కూడా ‘అష్టాచెమ్మా’ను గుర్తు చేసేలా ఉన్నాయి. ఆ సినిమా మాదిరే ‘సారంగపాణి..’ కూడా అల్లరల్లరిగా సాగేలా కనిపిస్తోంది. ఇంద్రగంటి ఫన్ పవర్ మళ్లీ ఈ సినిమాలో చూడబోతున్నట్లుగా ఉంది.
టీజర్లో వెన్నెల కిషోర్ కూడా బాగా హైలైట్ అయ్యాడు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్ రూపా కొడయూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. ఇంద్రగంటితో వరుసగా సినిమాలు తీస్తున్న శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాదే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 21, 2024 3:24 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…