తెలుగులో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. అచ్చమైన తెలుగు సినిమా తీయాలంటే ఇప్పుడు ఆయన తర్వాతే ఎవరైనా. జంధ్యాల తరహాలో ఈ తరంలో తెలుగుదనం ఉట్టిపడే, సునిశితమైన హాస్యంతో ఆయన నవ్వించగలరు. ఆయనకు కెరీర్లో పెద్ద బ్రేక్ ఇచ్చిన ‘అష్టాచెమ్మా’ తరహాలో సినిమా తీస్తే చూడాలని ప్రేక్షకులు ఆశపడుతున్నారు.
జెంటిల్మ్యాన్, సమ్మోహనం, వి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ఇలా ఇంద్రగంటి చివరగా తీసిన సినిమాలన్నీ సీరియస్ టచ్ ఉన్నవే. వీటిలో ‘జెంటిల్మ్యాన్’, ‘సమ్మోహనం’ విజయవంతం అయ్యాయి. మిగతావి నిరాశ పరిచాయి. ‘అష్టాచెమ్మా’ తర్వాత ‘అమీతుమీ’లోనూ ఆయన వినోదాన్ని బాగా పండించారు. కొంచెం గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ ఆ శైలిలో సినిమా చేశారు. ఆ చిత్రమే.. సారంగపాణి జాతకం.
ఈ రోజే విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘సారంగపాణి జాతకం’ టీజర్ రిలీజైంది. జాతకాల పిచ్చి ఉన్న ఓ కుర్రాడు.. తన చేతిని చూసి ఒక మోడర్న్ జ్యోతిష్యుడు చెప్పిన విషయాలను అనుసరించి తన చుట్టూ ఉన్న వారిని బెంబేలెత్తించే నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. మోడర్న్ జ్యోతిష్యుడిగా అవసరాల శ్రీనివాస్ నటించగా.. జాతకాల పిచ్చితో తన కుటుంబ సభ్యులు, స్నేహితులను ఉక్కిరి బిక్కిరి చేసే హీరో పాత్రను ప్రియదర్శి పులికొండ చేశాడు. టీజర్లో కాన్సెప్ట్, కామెడీ అన్నీ కూడా ‘అష్టాచెమ్మా’ను గుర్తు చేసేలా ఉన్నాయి. ఆ సినిమా మాదిరే ‘సారంగపాణి..’ కూడా అల్లరల్లరిగా సాగేలా కనిపిస్తోంది. ఇంద్రగంటి ఫన్ పవర్ మళ్లీ ఈ సినిమాలో చూడబోతున్నట్లుగా ఉంది.
టీజర్లో వెన్నెల కిషోర్ కూడా బాగా హైలైట్ అయ్యాడు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్ రూపా కొడయూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. ఇంద్రగంటితో వరుసగా సినిమాలు తీస్తున్న శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాదే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 21, 2024 3:24 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…