ఈ రోజుల్లో కొత్త సినిమాలపై రివ్యూల ప్రభావం చాలా ఉంటోందన్న మాట వాస్తవం. బాగున్న సినిమాకు రివ్యూలు ప్లస్ అవుతుంటే.. బాలేని చిత్రాలకు అవి మైనస్ అవుతాయన్న విషయం తెలిసిందే. ఏదైనా కంటెంట్ను బట్టే ఉంటుంది. కానీ రివ్యూల వల్లే సినిమా దెబ్బ తింటున్నట్లు ఫిలిం మేకర్స్ భావిస్తుంటారు. అందుకే సినిమాకు కలెక్షన్లు రాకుంటే రివ్యూయర్లను నిందిస్తుంటారు. శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి వాళ్లు రివ్యూయర్ల మీద మరీ దారుణమైన భాష వాడడం ఇటీవల టాలీవుడ్లో చర్చనీయాంశం అయింది.
కాగా అటు కోలీవుడ్లోనూ రివ్యూల పట్ల వ్యతిరేకత పెరిగి.. సినిమా థియేటర్ల ముందు రివ్యూలు ఇవ్వడాన్ని నిషేధించే పరిస్థితి తలెత్తింది. థియేటర్లలో షో చూసి బయటికి వస్తున్న ప్రేక్షకులతో టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్ల ప్రతినిధులు అభిప్రాయం తెలుసుకోవడం, రివ్యూలు అడగడం మామూలే. షో అయిన కొన్ని నిమిషాల్లోనే ఈ మార్గంలో టాక్ బయటికి వచ్చేస్తుంటుంది.
ఐతే ఇటీవల సూర్య సినిమా కంగువ, రజినీకాంత్ చిత్రం వేట్టయాన్ రివ్యూల వల్లే దెబ్బ తిన్నాయని.. ఆ సినిమాలో ఉన్న కంటెంట్ కంటే ఎక్కువ నెగెటివిటీని రివ్యూల ద్వారా స్ప్రెడ్ చేశారని తమిళ నిర్మాతల మండలి అభిప్రాయపడింది. అందుకే థియేటర్ల దగ్గర రివ్యూలు చెప్పడాన్ని, ప్రేక్షకుల నుంచి అభిప్రాయం తెలుసుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు తమిళ నిర్మాతల మండలి ప్రకటించింది. రివ్యూల వల్ల సినిమాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, దీనికి అడ్డు కట్ట పడాలని నిర్మాతల మండలి అభిప్రాయపడింది.
ఐతే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కంగువ బ్యాడ్ మూవీ అనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవని.. వేట్టయాన్ కూడా గొప్ప సినిమా ఏమీ కాదు కదా అని అంటున్నారు. ప్రేక్షకులు ఎలాగోలా టాక్ తెలుసుకునే సినిమాకు వెళ్లాలా వద్దా అన్నది నిర్ణయించుకుంటారని.. ఇలా థియేటర్ల దగ్గర రివ్యూలను నియంత్రించినంత మాత్రాన ఏమీ మారిపోందని అంటున్నారు నెటిజన్లు.
This post was last modified on November 21, 2024 12:19 am
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…