Movie News

థియేట‌ర్ల ముందు రివ్యూలపై నిషేధం

ఈ రోజుల్లో కొత్త సినిమాల‌పై రివ్యూల ప్ర‌భావం చాలా ఉంటోంద‌న్న మాట వాస్త‌వం. బాగున్న సినిమాకు రివ్యూలు ప్ల‌స్ అవుతుంటే.. బాలేని చిత్రాల‌కు అవి మైన‌స్ అవుతాయ‌న్న విష‌యం తెలిసిందే. ఏదైనా కంటెంట్‌ను బ‌ట్టే ఉంటుంది. కానీ రివ్యూల వ‌ల్లే సినిమా దెబ్బ తింటున్న‌ట్లు ఫిలిం మేక‌ర్స్ భావిస్తుంటారు. అందుకే సినిమాకు క‌లెక్ష‌న్లు రాకుంటే రివ్యూయ‌ర్ల‌ను నిందిస్తుంటారు. శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి వాళ్లు రివ్యూయ‌ర్ల మీద‌ మ‌రీ దారుణ‌మైన భాష వాడ‌డం ఇటీవ‌ల టాలీవుడ్లో చ‌ర్చ‌నీయాంశం అయింది.

కాగా అటు కోలీవుడ్లోనూ రివ్యూల ప‌ట్ల వ్య‌తిరేక‌త పెరిగి.. సినిమా థియేట‌ర్ల ముందు రివ్యూలు ఇవ్వ‌డాన్ని నిషేధించే ప‌రిస్థితి త‌లెత్తింది. థియేట‌ర్లలో షో చూసి బ‌య‌టికి వ‌స్తున్న ప్రేక్ష‌కుల‌తో టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్ల ప్ర‌తినిధులు అభిప్రాయం తెలుసుకోవ‌డం, రివ్యూలు అడ‌గ‌డం మామూలే. షో అయిన కొన్ని నిమిషాల్లోనే ఈ మార్గంలో టాక్ బ‌య‌టికి వ‌చ్చేస్తుంటుంది.

ఐతే ఇటీవల సూర్య సినిమా కంగువ, ర‌జినీకాంత్ చిత్రం వేట్ట‌యాన్ రివ్యూల వ‌ల్లే దెబ్బ తిన్నాయ‌ని.. ఆ సినిమాలో ఉన్న కంటెంట్ కంటే ఎక్కువ నెగెటివిటీని రివ్యూల ద్వారా స్ప్రెడ్ చేశార‌ని త‌మిళ నిర్మాత‌ల మండ‌లి అభిప్రాయ‌ప‌డింది. అందుకే థియేట‌ర్ల ద‌గ్గ‌ర రివ్యూలు చెప్పడాన్ని, ప్రేక్ష‌కుల నుంచి అభిప్రాయం తెలుసుకోవ‌డాన్ని నిషేధిస్తున్న‌ట్లు త‌మిళ నిర్మాత‌ల మండ‌లి ప్ర‌క‌టించింది. రివ్యూల వ‌ల్ల సినిమాల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లుతోంద‌ని, దీనికి అడ్డు క‌ట్ట ప‌డాల‌ని నిర్మాత‌ల మండ‌లి అభిప్రాయ‌ప‌డింది.

ఐతే ఈ నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కంగువ బ్యాడ్ మూవీ అనే విష‌యంలో ఎవ‌రికీ సందేహాలు లేవ‌ని.. వేట్ట‌యాన్ కూడా గొప్ప సినిమా ఏమీ కాదు క‌దా అని అంటున్నారు. ప్రేక్ష‌కులు ఎలాగోలా టాక్ తెలుసుకునే సినిమాకు వెళ్లాలా వ‌ద్దా అన్న‌ది నిర్ణ‌యించుకుంటార‌ని.. ఇలా థియేట‌ర్ల ద‌గ్గ‌ర‌ రివ్యూల‌ను నియంత్రించినంత మాత్రాన ఏమీ మారిపోంద‌ని అంటున్నారు నెటిజన్లు.

This post was last modified on November 21, 2024 12:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

5 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago