ఓటిటిలో విడుదలయ్యే సినిమాలకి కొన్ని ఖచ్చితమైన లక్షణాలుండాలి. ముఖ్యంగా ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టే థ్రిల్లింగ్ అంశాలుండాలి. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం తీసే కమర్షియల్ సినిమాలు ఈ ప్లాట్ఫామ్లో వర్కవుట్ అవ్వవు.
ఉదాహరణకు ఒక మాస్ కామెడీ సీన్ చూస్తున్నపుడు అందరికీ నవ్వు రాదు. అది అందరితో కలిసి చూస్తున్నపుడు మిగతా వాళ్ల నవ్వులను బట్టి ఆ సీన్ మరోలా అనిపిస్తుంది. అదే దానిని ఒక్కరే కూర్చుని చూస్తే ఎంజాయ్ చేయలేరు. అలాగే థియేటర్స్ లో విజిల్స్ పడే కొన్ని సీన్లు, డైలాగులుంటాయి. అవి ఆ అట్మాస్ఫియర్ లేకుండా ఇంట్లో చూస్తే వర్కవుట్ అవ్వవు.
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చేవి దాదాపుగా కమర్షియల్ చిత్రాలే కనుక ఓటిటి రిలీజ్ వాటికి కరక్ట్ కాదు. ఇటీవల ఓటిటిలో విడుదలైన సినిమాలకు వచ్చిన రెస్పాన్స్తో ఆల్రెడీ ఓటిటి రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాల వాళ్లు కూడా వెనక్కి తగ్గుతున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని ముందుగా ఓటిటి రిలీజ్ చేసేద్దామని అనుకున్నారు. కానీ థియేటర్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి కనుక కొద్ది రోజులు ఆగితే థియేటర్స్లోనే విడుదల చేసుకోవచ్చు కదా అని ఆలోచిస్తున్నారు.
అక్టోబర్, నవంబర్లో కాకపోయినా కనీసం డిసెంబర్లో అయినా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని సాయి ధరమ్ తేజ్ అడుగుతున్నాడట. థియేట్రికల్ రైట్స్ కూడా జీ సంస్థ దగ్గరే వున్నాయి కనుక, ఇటీవలి ఫలితాలు చూసి వాళ్లు కూడా ఇదే బెస్ట్ ఆప్షన్ అనుకునే అవకాశాలయితే లేకపోలేదు.
This post was last modified on October 5, 2020 3:55 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…