ఓటిటిలో విడుదలయ్యే సినిమాలకి కొన్ని ఖచ్చితమైన లక్షణాలుండాలి. ముఖ్యంగా ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టే థ్రిల్లింగ్ అంశాలుండాలి. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం తీసే కమర్షియల్ సినిమాలు ఈ ప్లాట్ఫామ్లో వర్కవుట్ అవ్వవు.
ఉదాహరణకు ఒక మాస్ కామెడీ సీన్ చూస్తున్నపుడు అందరికీ నవ్వు రాదు. అది అందరితో కలిసి చూస్తున్నపుడు మిగతా వాళ్ల నవ్వులను బట్టి ఆ సీన్ మరోలా అనిపిస్తుంది. అదే దానిని ఒక్కరే కూర్చుని చూస్తే ఎంజాయ్ చేయలేరు. అలాగే థియేటర్స్ లో విజిల్స్ పడే కొన్ని సీన్లు, డైలాగులుంటాయి. అవి ఆ అట్మాస్ఫియర్ లేకుండా ఇంట్లో చూస్తే వర్కవుట్ అవ్వవు.
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చేవి దాదాపుగా కమర్షియల్ చిత్రాలే కనుక ఓటిటి రిలీజ్ వాటికి కరక్ట్ కాదు. ఇటీవల ఓటిటిలో విడుదలైన సినిమాలకు వచ్చిన రెస్పాన్స్తో ఆల్రెడీ ఓటిటి రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాల వాళ్లు కూడా వెనక్కి తగ్గుతున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని ముందుగా ఓటిటి రిలీజ్ చేసేద్దామని అనుకున్నారు. కానీ థియేటర్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి కనుక కొద్ది రోజులు ఆగితే థియేటర్స్లోనే విడుదల చేసుకోవచ్చు కదా అని ఆలోచిస్తున్నారు.
అక్టోబర్, నవంబర్లో కాకపోయినా కనీసం డిసెంబర్లో అయినా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని సాయి ధరమ్ తేజ్ అడుగుతున్నాడట. థియేట్రికల్ రైట్స్ కూడా జీ సంస్థ దగ్గరే వున్నాయి కనుక, ఇటీవలి ఫలితాలు చూసి వాళ్లు కూడా ఇదే బెస్ట్ ఆప్షన్ అనుకునే అవకాశాలయితే లేకపోలేదు.
This post was last modified on October 5, 2020 3:55 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…