ఓటిటిలో విడుదలయ్యే సినిమాలకి కొన్ని ఖచ్చితమైన లక్షణాలుండాలి. ముఖ్యంగా ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టే థ్రిల్లింగ్ అంశాలుండాలి. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం తీసే కమర్షియల్ సినిమాలు ఈ ప్లాట్ఫామ్లో వర్కవుట్ అవ్వవు.
ఉదాహరణకు ఒక మాస్ కామెడీ సీన్ చూస్తున్నపుడు అందరికీ నవ్వు రాదు. అది అందరితో కలిసి చూస్తున్నపుడు మిగతా వాళ్ల నవ్వులను బట్టి ఆ సీన్ మరోలా అనిపిస్తుంది. అదే దానిని ఒక్కరే కూర్చుని చూస్తే ఎంజాయ్ చేయలేరు. అలాగే థియేటర్స్ లో విజిల్స్ పడే కొన్ని సీన్లు, డైలాగులుంటాయి. అవి ఆ అట్మాస్ఫియర్ లేకుండా ఇంట్లో చూస్తే వర్కవుట్ అవ్వవు.
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చేవి దాదాపుగా కమర్షియల్ చిత్రాలే కనుక ఓటిటి రిలీజ్ వాటికి కరక్ట్ కాదు. ఇటీవల ఓటిటిలో విడుదలైన సినిమాలకు వచ్చిన రెస్పాన్స్తో ఆల్రెడీ ఓటిటి రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాల వాళ్లు కూడా వెనక్కి తగ్గుతున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని ముందుగా ఓటిటి రిలీజ్ చేసేద్దామని అనుకున్నారు. కానీ థియేటర్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి కనుక కొద్ది రోజులు ఆగితే థియేటర్స్లోనే విడుదల చేసుకోవచ్చు కదా అని ఆలోచిస్తున్నారు.
అక్టోబర్, నవంబర్లో కాకపోయినా కనీసం డిసెంబర్లో అయినా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని సాయి ధరమ్ తేజ్ అడుగుతున్నాడట. థియేట్రికల్ రైట్స్ కూడా జీ సంస్థ దగ్గరే వున్నాయి కనుక, ఇటీవలి ఫలితాలు చూసి వాళ్లు కూడా ఇదే బెస్ట్ ఆప్షన్ అనుకునే అవకాశాలయితే లేకపోలేదు.
This post was last modified on October 5, 2020 3:55 pm
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…