ఓటిటిలో విడుదలయ్యే సినిమాలకి కొన్ని ఖచ్చితమైన లక్షణాలుండాలి. ముఖ్యంగా ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టే థ్రిల్లింగ్ అంశాలుండాలి. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం తీసే కమర్షియల్ సినిమాలు ఈ ప్లాట్ఫామ్లో వర్కవుట్ అవ్వవు.
ఉదాహరణకు ఒక మాస్ కామెడీ సీన్ చూస్తున్నపుడు అందరికీ నవ్వు రాదు. అది అందరితో కలిసి చూస్తున్నపుడు మిగతా వాళ్ల నవ్వులను బట్టి ఆ సీన్ మరోలా అనిపిస్తుంది. అదే దానిని ఒక్కరే కూర్చుని చూస్తే ఎంజాయ్ చేయలేరు. అలాగే థియేటర్స్ లో విజిల్స్ పడే కొన్ని సీన్లు, డైలాగులుంటాయి. అవి ఆ అట్మాస్ఫియర్ లేకుండా ఇంట్లో చూస్తే వర్కవుట్ అవ్వవు.
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చేవి దాదాపుగా కమర్షియల్ చిత్రాలే కనుక ఓటిటి రిలీజ్ వాటికి కరక్ట్ కాదు. ఇటీవల ఓటిటిలో విడుదలైన సినిమాలకు వచ్చిన రెస్పాన్స్తో ఆల్రెడీ ఓటిటి రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాల వాళ్లు కూడా వెనక్కి తగ్గుతున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని ముందుగా ఓటిటి రిలీజ్ చేసేద్దామని అనుకున్నారు. కానీ థియేటర్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి కనుక కొద్ది రోజులు ఆగితే థియేటర్స్లోనే విడుదల చేసుకోవచ్చు కదా అని ఆలోచిస్తున్నారు.
అక్టోబర్, నవంబర్లో కాకపోయినా కనీసం డిసెంబర్లో అయినా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని సాయి ధరమ్ తేజ్ అడుగుతున్నాడట. థియేట్రికల్ రైట్స్ కూడా జీ సంస్థ దగ్గరే వున్నాయి కనుక, ఇటీవలి ఫలితాలు చూసి వాళ్లు కూడా ఇదే బెస్ట్ ఆప్షన్ అనుకునే అవకాశాలయితే లేకపోలేదు.
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…