ఒక పెద్ద హీరో కొడుకు అంటే ఆటోమేటిగ్గా హీరో అవ్వాల్సిందే. ఒకప్పుడైనా హీరోల కొడుకులు వేరే మార్గాల వైపు చూసేవారు కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం తండ్రుల వారసత్వాన్నే కొనసాగిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఒక దశలో సినిమాల్లోకి వచ్చేలానే కనిపించలేదు. కానీ ఇప్పుడు మనసు మార్చుకుని హీరోగా పరిచయం అవుతున్నాడు.
ఇలాంటి తరుణంలో బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన షారుఖ్ ఖాన్.. తన కొడుకుని దర్శకుడిగా పరిచయం చేస్తుండడం విశేషం. షారుఖ్ పెద్ద కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా అరంగేట్రం చేయబోతుండడం విశేషం. స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ కోసం ఆర్యన్ ఖాన్ ఒక వెబ్ సిరీస్ చేస్తుండడం విశేషం. దీని గురించి షారుఖ్ అధికారికంగా వెల్లడించాడు.
తన సొంత సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బేనర్ మీద తన భార్య గౌరీ ఖాన్.. నెట్ ఫ్లిక్స్తో కలిసి ప్రొడ్యూస్ చేయనున్న సిరీస్తో ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడని.. ఒక కొత్త కథను ప్రేక్షకులకు చెప్పబోతున్నామని.. ఇది తమకు చాలా ప్రత్యేకమైన రోజు అని సిరీస్ మొదలవుతున్న సందర్భంగా షారుఖ్ పోస్ట్ పెట్టాడు.
ఆర్యన్ ఖాన్ కొన్నేళ్ల కిందట డ్రగ్స్ వివాదంలో చిక్కుకుని బాగా అన్ పాపులర్ అయ్యాడు. ఆర్యన్ను పోలీసులు అరెస్ట్ చేసినపుడు షారుఖ్ కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైంది. చివరికి ఈ కేసులో ఆర్యన్ నిర్దోషిగా బయటికి వచ్చాడు. ఆ తర్వాత అతను వార్తల్లో లేడు. ఏదో ఒక రోజు అతను హీరోగా పరిచయం అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఆర్యన్ మెగా ఫోన్ పట్టాడు. మరి దర్శకుడిగా అతనెలాంటి ముద్ర వేస్తాడన్నది ఆసక్తికరం.
This post was last modified on November 20, 2024 7:25 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…