‘మిస్టర్ బచ్చన్’ విడుదలకు ముందు ఆ సినిమాకు సంబంధించి అత్యంత హైలైట్ అయింది ఎవరు అంటే.. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అనే చెప్పాలి. ఈ ముంబయి భామ అంద చందాలను హైలైట్ చేస్తూ వదిలిన ప్రోమోలు హాట్ టాపిక్గా మారాయి. ఈ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్కు మోడర్న్ రాఘవేంద్రరావు అనే పేరు కూడా వచ్చింది.
ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగానే భాగ్యశ్రీకి అవకాశాలు వెల్లువెత్తుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ తర్వాత మొత్తం కథ మారిపోయింది. ‘మిస్టర్ బచ్చన్’లో భాగ్యశ్రీ బాగానే హైలైట్ అయినా.. సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె గురించి మాట్లాడేవారు కరవయ్యారు. విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమా మినహా మరే చిత్రంలోనూ ఆమె రోల్ ఖరారవ్వలేదు. దీంతో భాగ్యశ్రీ కెరీర్ అనుకున్నంత వేగం పుంజుకునేలా కనిపించలేదు.
కానీ కొంచెం గ్యాప్ తర్వాత భాగ్యశ్రీకి ఓ మంచి అవకాశం వచ్చింది. రామ్ పోతినేని సరసన భాగ్యశ్రీ అవకాశం అందుకుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో మంచి విజయాన్నందుకున్న మహేష్ బాబు.పి దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. గురువారమే ఈ సినిమాకు ముహూర్త వేడుక జరగనుంది. ఈ సందర్భంగా ఇందులో కథానాయికగా భాగ్యశ్రీని ఖరారు చేస్తూ టీం అధికారిక ప్రకటన చేసింది.
మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడైన రామ్తో సినిమా అంటే భాగ్యశ్రీకి మంచి అవకాశమే. వరుసగా మాస్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న రామ్.. ఈసారి మహేష్ దర్శకత్వంలో క్లాస్ టచ్ ఉన్న వెరైటీ సినిమా ఏదో చేస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…
మార్క్ ఆంటోనీ, గత ఏడాది అజిత్ తో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహార తీరుపై ఇప్పటికే లెక్కలేనన్ని చర్చలు జరిగాయి. అటు సినిమాలు,…
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సామెత. కొందరు మాత్రం రచ్చ గెలిచి, తర్వాత ఇంటికి వస్తుంటారు. శోభిత…
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…