‘మిస్టర్ బచ్చన్’ విడుదలకు ముందు ఆ సినిమాకు సంబంధించి అత్యంత హైలైట్ అయింది ఎవరు అంటే.. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అనే చెప్పాలి. ఈ ముంబయి భామ అంద చందాలను హైలైట్ చేస్తూ వదిలిన ప్రోమోలు హాట్ టాపిక్గా మారాయి. ఈ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్కు మోడర్న్ రాఘవేంద్రరావు అనే పేరు కూడా వచ్చింది.
ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగానే భాగ్యశ్రీకి అవకాశాలు వెల్లువెత్తుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ తర్వాత మొత్తం కథ మారిపోయింది. ‘మిస్టర్ బచ్చన్’లో భాగ్యశ్రీ బాగానే హైలైట్ అయినా.. సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె గురించి మాట్లాడేవారు కరవయ్యారు. విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమా మినహా మరే చిత్రంలోనూ ఆమె రోల్ ఖరారవ్వలేదు. దీంతో భాగ్యశ్రీ కెరీర్ అనుకున్నంత వేగం పుంజుకునేలా కనిపించలేదు.
కానీ కొంచెం గ్యాప్ తర్వాత భాగ్యశ్రీకి ఓ మంచి అవకాశం వచ్చింది. రామ్ పోతినేని సరసన భాగ్యశ్రీ అవకాశం అందుకుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో మంచి విజయాన్నందుకున్న మహేష్ బాబు.పి దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. గురువారమే ఈ సినిమాకు ముహూర్త వేడుక జరగనుంది. ఈ సందర్భంగా ఇందులో కథానాయికగా భాగ్యశ్రీని ఖరారు చేస్తూ టీం అధికారిక ప్రకటన చేసింది.
మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడైన రామ్తో సినిమా అంటే భాగ్యశ్రీకి మంచి అవకాశమే. వరుసగా మాస్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న రామ్.. ఈసారి మహేష్ దర్శకత్వంలో క్లాస్ టచ్ ఉన్న వెరైటీ సినిమా ఏదో చేస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.
This post was last modified on November 20, 2024 5:06 pm
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…