‘మిస్టర్ బచ్చన్’ విడుదలకు ముందు ఆ సినిమాకు సంబంధించి అత్యంత హైలైట్ అయింది ఎవరు అంటే.. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అనే చెప్పాలి. ఈ ముంబయి భామ అంద చందాలను హైలైట్ చేస్తూ వదిలిన ప్రోమోలు హాట్ టాపిక్గా మారాయి. ఈ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్కు మోడర్న్ రాఘవేంద్రరావు అనే పేరు కూడా వచ్చింది.
ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగానే భాగ్యశ్రీకి అవకాశాలు వెల్లువెత్తుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ తర్వాత మొత్తం కథ మారిపోయింది. ‘మిస్టర్ బచ్చన్’లో భాగ్యశ్రీ బాగానే హైలైట్ అయినా.. సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె గురించి మాట్లాడేవారు కరవయ్యారు. విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమా మినహా మరే చిత్రంలోనూ ఆమె రోల్ ఖరారవ్వలేదు. దీంతో భాగ్యశ్రీ కెరీర్ అనుకున్నంత వేగం పుంజుకునేలా కనిపించలేదు.
కానీ కొంచెం గ్యాప్ తర్వాత భాగ్యశ్రీకి ఓ మంచి అవకాశం వచ్చింది. రామ్ పోతినేని సరసన భాగ్యశ్రీ అవకాశం అందుకుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో మంచి విజయాన్నందుకున్న మహేష్ బాబు.పి దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. గురువారమే ఈ సినిమాకు ముహూర్త వేడుక జరగనుంది. ఈ సందర్భంగా ఇందులో కథానాయికగా భాగ్యశ్రీని ఖరారు చేస్తూ టీం అధికారిక ప్రకటన చేసింది.
మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడైన రామ్తో సినిమా అంటే భాగ్యశ్రీకి మంచి అవకాశమే. వరుసగా మాస్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న రామ్.. ఈసారి మహేష్ దర్శకత్వంలో క్లాస్ టచ్ ఉన్న వెరైటీ సినిమా ఏదో చేస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.
This post was last modified on November 20, 2024 5:06 pm
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్కు…