‘మిస్టర్ బచ్చన్’ విడుదలకు ముందు ఆ సినిమాకు సంబంధించి అత్యంత హైలైట్ అయింది ఎవరు అంటే.. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అనే చెప్పాలి. ఈ ముంబయి భామ అంద చందాలను హైలైట్ చేస్తూ వదిలిన ప్రోమోలు హాట్ టాపిక్గా మారాయి. ఈ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్కు మోడర్న్ రాఘవేంద్రరావు అనే పేరు కూడా వచ్చింది.
ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగానే భాగ్యశ్రీకి అవకాశాలు వెల్లువెత్తుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ తర్వాత మొత్తం కథ మారిపోయింది. ‘మిస్టర్ బచ్చన్’లో భాగ్యశ్రీ బాగానే హైలైట్ అయినా.. సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె గురించి మాట్లాడేవారు కరవయ్యారు. విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమా మినహా మరే చిత్రంలోనూ ఆమె రోల్ ఖరారవ్వలేదు. దీంతో భాగ్యశ్రీ కెరీర్ అనుకున్నంత వేగం పుంజుకునేలా కనిపించలేదు.
కానీ కొంచెం గ్యాప్ తర్వాత భాగ్యశ్రీకి ఓ మంచి అవకాశం వచ్చింది. రామ్ పోతినేని సరసన భాగ్యశ్రీ అవకాశం అందుకుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో మంచి విజయాన్నందుకున్న మహేష్ బాబు.పి దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. గురువారమే ఈ సినిమాకు ముహూర్త వేడుక జరగనుంది. ఈ సందర్భంగా ఇందులో కథానాయికగా భాగ్యశ్రీని ఖరారు చేస్తూ టీం అధికారిక ప్రకటన చేసింది.
మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడైన రామ్తో సినిమా అంటే భాగ్యశ్రీకి మంచి అవకాశమే. వరుసగా మాస్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న రామ్.. ఈసారి మహేష్ దర్శకత్వంలో క్లాస్ టచ్ ఉన్న వెరైటీ సినిమా ఏదో చేస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…