ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు అక్కినేని నాగార్జున. గత కొన్నేళ్లలో ఓం నమో వేంకటేశాయ, ఆఫీసర్, మన్మథుడు-2 లాంటి డిజాస్టర్లు ఖాతాలో వేసుకున్న ఆయన.. ప్రస్తుతం వైల్డ్ డాగ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తవగానే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేశాడు. దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
మరోవైపు నాగార్జున కోసం ఎప్పట్నుంచో బంగార్రాజు స్క్రిప్టు కూడా రెడీ అవుతోంది. ఇంతలో నాగార్జునతో కలిపి ఓ క్రేజీ డైరెక్టర్ పేరు వినిపిస్తుండటం విశేషం. ఆ పేరు మరెవ్వరిదో కాదు.. అనిల్ రావిపూడిది. పటాస్తో మొదలుపెట్టి సరిలేరు నీకెవ్వరు వరకు వరుసగా హిట్లు ఇస్తూ వచ్చాడు అనిల్. దీని తర్వాత ఎఫ్-3 స్క్రిప్టు పూర్తి చేశాడతను. ఐతే ఆ సినిమా పట్టాలెక్కడానికి సమయం పట్టేలా ఉంది. ఈలోపు అనిల్ వేరే సినిమా చేస్తాడని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
దాని సంగతేమో కానీ.. ‘ఎఫ్-3’ పూర్తి చేశాక నాగార్జునతో అనిల్ సినిమా ఉంటందంటూ కొత్తగా ఊహాగానాలు మొదలయ్యాయి. గత కొన్నేళ్లలో నాగ్ ఎక్కువగా సీరియస్ సినిమాలే చేశాడు. ఇప్పడు నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’, దీని తర్వాత చేయబోయే ప్రవీణ్ సత్తారు సినిమా కూడా సీరియస్ మూవీసే. దీని తర్వాత ‘బంగార్రాజు’ చేస్తే అది ఎంటర్టైనరే అయ్యేది కానీ.. ఆ సినిమా నాగ్ చేస్తాడా లేదా అన్నది ఒక పట్టాన తేలట్లేదు. కొన్నేళ్లుగా దాని పని నడుస్తోంది. ఎంతకీ తెగట్లేదు. దాని సంగతి తేల్చకుండా అనిల్ దర్శకత్వంలో ఓ ఎంటర్టైనర్ చేయడానికి నాగ్ సన్నాహాలు చేసుకుంటున్నాడని చెబుతున్నారు.
అనిలే ఆయన్ని సంప్రదించాడని.. వీళ్ల కలయికలో సినిమా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు అనిల్ మరో సీనియర్ హీరో బాలకృష్ణతో కూడా ఓ సినిమా చేయాలని ఆశపడుతుండగా.. ఆయన ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
This post was last modified on October 5, 2020 1:59 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…