ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు అక్కినేని నాగార్జున. గత కొన్నేళ్లలో ఓం నమో వేంకటేశాయ, ఆఫీసర్, మన్మథుడు-2 లాంటి డిజాస్టర్లు ఖాతాలో వేసుకున్న ఆయన.. ప్రస్తుతం వైల్డ్ డాగ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తవగానే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేశాడు. దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
మరోవైపు నాగార్జున కోసం ఎప్పట్నుంచో బంగార్రాజు స్క్రిప్టు కూడా రెడీ అవుతోంది. ఇంతలో నాగార్జునతో కలిపి ఓ క్రేజీ డైరెక్టర్ పేరు వినిపిస్తుండటం విశేషం. ఆ పేరు మరెవ్వరిదో కాదు.. అనిల్ రావిపూడిది. పటాస్తో మొదలుపెట్టి సరిలేరు నీకెవ్వరు వరకు వరుసగా హిట్లు ఇస్తూ వచ్చాడు అనిల్. దీని తర్వాత ఎఫ్-3 స్క్రిప్టు పూర్తి చేశాడతను. ఐతే ఆ సినిమా పట్టాలెక్కడానికి సమయం పట్టేలా ఉంది. ఈలోపు అనిల్ వేరే సినిమా చేస్తాడని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
దాని సంగతేమో కానీ.. ‘ఎఫ్-3’ పూర్తి చేశాక నాగార్జునతో అనిల్ సినిమా ఉంటందంటూ కొత్తగా ఊహాగానాలు మొదలయ్యాయి. గత కొన్నేళ్లలో నాగ్ ఎక్కువగా సీరియస్ సినిమాలే చేశాడు. ఇప్పడు నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’, దీని తర్వాత చేయబోయే ప్రవీణ్ సత్తారు సినిమా కూడా సీరియస్ మూవీసే. దీని తర్వాత ‘బంగార్రాజు’ చేస్తే అది ఎంటర్టైనరే అయ్యేది కానీ.. ఆ సినిమా నాగ్ చేస్తాడా లేదా అన్నది ఒక పట్టాన తేలట్లేదు. కొన్నేళ్లుగా దాని పని నడుస్తోంది. ఎంతకీ తెగట్లేదు. దాని సంగతి తేల్చకుండా అనిల్ దర్శకత్వంలో ఓ ఎంటర్టైనర్ చేయడానికి నాగ్ సన్నాహాలు చేసుకుంటున్నాడని చెబుతున్నారు.
అనిలే ఆయన్ని సంప్రదించాడని.. వీళ్ల కలయికలో సినిమా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు అనిల్ మరో సీనియర్ హీరో బాలకృష్ణతో కూడా ఓ సినిమా చేయాలని ఆశపడుతుండగా.. ఆయన ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
This post was last modified on October 5, 2020 1:59 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…