ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల విషయంలో ఇది బాగా బయటపడుతుంది. పుష్ప 2 ది రూల్ ట్రైలర్ ఎంత వేగంగా బోలెడన్ని షాట్లు, సీన్లతో అల్ట్రా ఫాస్ట్ గా పరుగులు పెట్టడం చూశాం. అంచనాలు పెంచే విషయంలో దర్శకుడు సుకుమార్ తగ్గేదేలే తరహాలో తన మార్కు మేకింగ్ తో అదరగొట్టేశాడు. వీలైనంత వరకు కథకు సంబంధించిన క్లూలు, లీకులు ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు కానీ 0.25 స్లో స్పీడ్, ఫ్రీజ్ షాట్ల రూపంలో అధ్యయనం చేశాక కొన్ని ట్విస్టులు బయటపడ్డాయి.
వాటిలో ఒకటి భారీ వర్షం పడుతుండగా, వేలాది మంది స్మశానంలో గుమికూడి ఉండగా ఎర్రచందనం దుంగల మీద ఒక మృతదేహానికి అంత్యక్రియలు జరగడం. సన్నివేశం మొత్తం గొడుగులతో నిండిపోయింది. ఇంత పెద్ద సెటప్ అంటే స్టోరీ ప్రకారం చాలా కీలకమైన ఆర్టిస్టు అయ్యుండాలి. మొదటి అంచనా శ్రీవల్లిగా నటించిన రష్మిక మందన్న. ఇదే ట్రైలర్ లో ఒక చోట బన్నీ చీర కట్టుకుని ఫైట్ చేయడం కనిపిస్తుంది. అంటే శ్రీవల్లిని హత్య చేసి ఉంటే దానికి ప్రతీకారంగా ఆమె బట్టలే వేసుకుని శత్రువును ముట్టడించాడన్న మాట. సునీల్, అనసూయ లాంటి వాళ్ళు కాదు. ఎందుకంటే ఆ షాట్ లోనే ఉన్నారు కాబట్టి.
పుష్ప ఫ్రెండ్ గా చేసిన జగదీశ్ కు ప్రాధాన్యం పెరిగినా ఇంత బిల్డప్ ఇచ్చే ఎపిసోడ్ పెట్టి ఉండరు. డాలీ ధనుంజయ్, రావు రమేష్ లను కూడా గెస్ చేయొచ్చు కానీ సెటప్ విషయంలోనే అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ కెజిఎఫ్ 2 లాగా పుష్పకు ఏమైనా షాకింగ్ ముగింపు ఇచ్చారా అనేది కూడా సస్పెన్సే. పుష్ప 3 కోసం ఓపెన్ క్లైమాక్స్ పెడతారనే టాక్ గతంలోనే ఉంది కాబట్టి అది కాకపోవచ్చు. సో ఎక్కువ అవకాశాలు శ్రీవల్లికే ఉన్నాయి. పుష్పరాజ్ విశ్వరూపానికి దారి తీసే కారణం ఇదే కావొచ్చు. చూడాలి మరి ఇక్కడ విశ్లేషణ చేసినట్టే పుష్ప 2 ట్విస్టు ఉంటుందా లేక సుకుమార్ ఏదైనా షాక్ ఇస్తారానేది.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…