ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో ఎక్కువ ఎడ్జ్ ఉన్నది మెకానిక్ రాకీకే. విశ్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది. అయితే పుష్ప 2 ది రూల్ వేడుక టైంలోనే ఇదీ ఉండటంతో ప్రేక్షకుల దృష్టి ఎక్కువ ఇటు వైపు పడలేదు. అందుకే థియేట్రికల్ రిలీజ్ ట్రైలర్ ని సోమవారానికి సెట్ చేసుకున్నారు. ఎప్పటిలాగే విశ్వక్ ఈసారి కూడా కొన్ని మెరుపులు, సెటైర్లతో కూడిన స్పీచ్ మాట్లాడాడు. కాకపోతే శపథాలు, ఛాలెంజులు గట్రా లేకుండా ఈసారి తనను టార్గెట్ చేసే వారికి వెరైటీగా వార్నింగులు గట్రా ఇచ్చాడు.
మెకానిక్ రాకీనే కాదు ఏ సినిమా హిట్టయినా ఫ్లాప్ అయినా చొక్కా విప్పి తిరగడాలు, ఫిలిం నగర్ ఇల్లు ఖాళీ చేయడాలు లాంటివి ఉండవని, నేనింతేలో రవితేజ చెప్పినట్టు ఫలితంతో సంబంధం లేకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చాడు. రివ్యూల మీద కాస్తా ఘాటుగానే స్పందిస్తూ సహేతుకంగా విమర్శిస్తే ఎలాంటి ఇబ్బంది లేదని, పర్సనల్ గా టార్గెట్ చేసుకుంటే మాత్రం వీపు మిగులుతుందని హెచ్చరిక చేశాడు. నిజానికి అలా కావాలని బురద చల్లుతున్నది ఎవరో కానీ ప్రతిసారి ప్రీ రిలీజ్ ఈవెంట్లతో నన్ను అణిచేస్తున్నారు, ఇంకా ఎదిగి చూపిస్తానని చెప్పడం మాత్రం రిపీట్ అవుతోంది.
సరే దీని సంగతి ఎలా ఉన్నా మెకానిక్ రాకీకి సాలిడ్ ఓపెనింగ్స్ రావాలంటే మొదటి రోజు టాక్ చాలా కీలకం. దీపావళి సినిమాలు మూడు సూపర్ హిట్టయ్యాక మళ్ళీ బాక్సాఫీస్ వద్ద జోష్ తగ్గిపోయింది. కంగువ పెద్ద షాక్ ఇస్తే మట్కా ఊసులో లేకుండా పోయింది. వీటిని మూవీ లవర్స్ సీరియస్ గా తీసుకోలేదు. ఈ గ్యాప్ ని మెకానిక్ రాకీ వాడుకోవాలి. దేవకీనందన వాసుదేవ, జీబ్రాలతో పోటీ ఉన్నప్పటికీ వాటి హీరోల కంటే విశ్వక్ సేన్ ఇమేజ్, మార్కెట్ రెండూ పెద్దవి కనక ఆ అడ్వాంటేజ్ ని తీసుకోవాలి. కమర్షియల్, యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందిన మెకానిక్ రాకీకి జేక్స్ బెజోయ్ సంగీతం ప్రధాన ఆకర్షణట.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…