టాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి టాప్ త్రీలో ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే కాల్ షీట్లు అంత సులభంగా దొరికేంత ఖాళీ అయితే లేదు. అయితే వరస సక్సెస్ లు పడితే వచ్చే కిక్కే వేరు. రెమ్యునరేషన్లు పెరుగుతాయి. స్టార్ హీరోల దృష్టిలో పడొచ్చు. డిమాండ్ తగ్గట్టు ఇతర బాషల ఆఫర్లు వస్తాయి. కానీ మీనాక్షి చౌదరి పరిస్థితి ఒక పండు దక్కితే వెంటనే ఒక కాయ తినాలనేలా తయారయ్యింది. గుంటూరు కారంలో గుర్తింపు లేని పాత్ర చేశాక ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంలోనూ గుర్తుంచుకునే క్యారెక్టర్ పడలేదు. ఇటీవలే లక్కీ భాస్కర్ రూపంలో పెద్ద లక్కు దొరికింది.
దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన ఈ మనీ క్రైమ్ డ్రామా వంద కోట్ల గ్రాస్ దాటేసి తెలుగు, తమిళ, మలయాళంలో జయకేతనం ఎగరేసింది. అమరన్ పోటీని తట్టుకుని విజేతగా నిలవడం మాములు విషయం కాదు. మీనాక్షి చౌదరికి భాస్కర్ భార్యగా మంచి గుర్తింపు దక్కింది. కట్ చేస్తే తక్కువ గ్యాప్ లో మరోసారి మట్కా రూపంలో ప్రేక్షకులను పలకరించింది. రివ్యూ, టాక్స్ నిరాశాజనకంగా ఉన్నాయి. కంటెంట్ సంగతి పక్కన పెడితే నిడివి పరంగా మీనాక్షికి కాసిన్ని మంచి సీన్లు పడ్డాయి కానీ స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా సాగడం వల్ల అవేవి పెర్ఫార్మన్స్ పరంగా ఏ మాత్రం ఉపయోగపడలేకపోయాయ.
దానికి తోడు వరుణ్ తేజ్ భార్యగా సెకండాఫ్ లో తన పాత్రకు ఇచ్చిన ముగింపు కూడా సోసోనే. అలా లక్కీ భాస్కర్ ఇచ్చిన ఆనందం వైజాగ్ వాసు ఆవిరి చేశాడన్న మాట. అయితే వారం తిరక్కుండానే నవంబర్ 22 విశ్వక్ సేన్ మెకానిక్ రాకీలో మళ్ళీ కనిపించనుంది. ఈసారి యూత్ టచ్ ఎక్కువగా ఉండనుంది. శ్రద్ధ శ్రీనాథ్ మరో హీరోయిన్ అయినప్పటికీ ప్రాధాన్యం ఉంటుందట. ఇది హిట్టు కొడితే మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేయొచ్చు. మీడియం రేంజ్ హీరోలకు మంచి ఛాయస్ గా మారిన మీనాక్షి చౌదరికి సాలిడ్ గా ఒకటి రెండు బ్లాక్ బస్టర్లు పడితే టాప్ లీగ్ లోకి వెళ్లిపోవచ్చు. కానీ కోసమే ఎదురు చూస్తోంది.
This post was last modified on November 15, 2024 2:07 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…