మాస్ రాజా రవితేజ కొత్త చిత్రానికి రంగం సిద్ధమైంది. ఇంతకుముందు తనకు ‘వీర’ లాంటి డిజాస్టర్ ఇచ్చినప్పటికీ.. దర్శకుడు రమేష్ వర్మను నమ్మి అతడితో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు రవితేజ. రమేష్ వర్మతో వరుసగా అసోసియేట్ అవుతున్న నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.
తన సినిమాల్లో ఆకర్షణీయమైన హీరోయిన్లను పెట్టడం రమేష్ వర్మకు అలవాటు. రవితేజ సినిమాకు ఒకరికిద్దరు యంగ్, హాట్ బ్యూటీస్ను కథానాయికలుగా సెట్ చేశాడట అతను. ఆ ఇద్దరూ నిధి అగర్వాల్, అను ఇమ్మాన్యుయెల్.
‘సవ్యసాచి’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలతో కెరీర్ ఆరంభంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్నప్పటికీ.. ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ సక్సెస్ అందుకుని క్రేజీ హీరోయిన్గా మారింది నిధి.
ఇక అను విషయానికొస్తే మొదట్లో మజ్ను, కిట్టు ఉన్నాడు జాగ్రత్త లాంటి చిన్న సినిమాలు చేసినా.. ఆ తర్వాత నా పేరు సూర్య, అజ్ఞాతవాసి లాంటి భారీ చిత్రాల్లో నటించింది. ఐతే ఒక దశలో వరుసగా డిజాస్టర్లు ఎదురవడంతో అను కెరీర్లో బ్రేక్ వచ్చింది. ఈ మధ్యనే ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఇద్దరు కథానాయికల్లో ఒకరిగా అవకాశం అందుకుందామె. వెంటనే ఇప్పుడు రవితేజ సినిమాతో ఛాన్స్ పట్టేసింది.
రమేష్ వర్మ ఎక్కువగా మాస్ మసాలా సినిమాలే తీస్తుంటాడు. రవితేజకు సెట్టయ్యేవి కూడా ఆ టైపు సినిమాలే. ఇక ఇద్దరు హాట్ హీరోయిన్లు దీనికి తోడయ్యారంటే మాస్ ప్రేక్షకులకు మాంచి వినోదం గ్యారెంటీ అన్నమాటే. ప్రస్తుతం మాస్ రాజా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అది మరికొన్ని రోజుల్లో పూర్తవుతుంది. వెంటనే రమేష్ వర్మ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు.
This post was last modified on October 4, 2020 6:49 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…