మాస్ రాజా రవితేజ కొత్త చిత్రానికి రంగం సిద్ధమైంది. ఇంతకుముందు తనకు ‘వీర’ లాంటి డిజాస్టర్ ఇచ్చినప్పటికీ.. దర్శకుడు రమేష్ వర్మను నమ్మి అతడితో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు రవితేజ. రమేష్ వర్మతో వరుసగా అసోసియేట్ అవుతున్న నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.
తన సినిమాల్లో ఆకర్షణీయమైన హీరోయిన్లను పెట్టడం రమేష్ వర్మకు అలవాటు. రవితేజ సినిమాకు ఒకరికిద్దరు యంగ్, హాట్ బ్యూటీస్ను కథానాయికలుగా సెట్ చేశాడట అతను. ఆ ఇద్దరూ నిధి అగర్వాల్, అను ఇమ్మాన్యుయెల్.
‘సవ్యసాచి’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలతో కెరీర్ ఆరంభంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్నప్పటికీ.. ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ సక్సెస్ అందుకుని క్రేజీ హీరోయిన్గా మారింది నిధి.
ఇక అను విషయానికొస్తే మొదట్లో మజ్ను, కిట్టు ఉన్నాడు జాగ్రత్త లాంటి చిన్న సినిమాలు చేసినా.. ఆ తర్వాత నా పేరు సూర్య, అజ్ఞాతవాసి లాంటి భారీ చిత్రాల్లో నటించింది. ఐతే ఒక దశలో వరుసగా డిజాస్టర్లు ఎదురవడంతో అను కెరీర్లో బ్రేక్ వచ్చింది. ఈ మధ్యనే ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఇద్దరు కథానాయికల్లో ఒకరిగా అవకాశం అందుకుందామె. వెంటనే ఇప్పుడు రవితేజ సినిమాతో ఛాన్స్ పట్టేసింది.
రమేష్ వర్మ ఎక్కువగా మాస్ మసాలా సినిమాలే తీస్తుంటాడు. రవితేజకు సెట్టయ్యేవి కూడా ఆ టైపు సినిమాలే. ఇక ఇద్దరు హాట్ హీరోయిన్లు దీనికి తోడయ్యారంటే మాస్ ప్రేక్షకులకు మాంచి వినోదం గ్యారెంటీ అన్నమాటే. ప్రస్తుతం మాస్ రాజా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అది మరికొన్ని రోజుల్లో పూర్తవుతుంది. వెంటనే రమేష్ వర్మ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…