ఫిలిం ఇండస్ట్రీలో ప్రేమాయణాలు.. బ్రేకప్లు సర్వ సాధారణమే. ఐతే బాలీవుడ్లో ఈ ఒరవడి ఎక్కువ కాగా.. సౌత్ ఇండస్ట్రీల్లో కొంచెం తక్కువ. సౌత్ సినిమాల్లో పని చేసే హీరో హీరోయిన్లు తమ ప్రేమాయణాల గురించి.. బ్రేకప్ స్టోరీల గురించి పెద్దగా ఓపెన్ కారు. ఐతే పేరుకు నార్త్ ఇండియా అమ్మాయే అయినప్పటికీ.. సౌత్ సినిమాలతోనే మంచి పేరు సంపాదించిన రాశి ఖన్నా.. లేటెస్ట్గా తన బ్రేకప్ స్టోరీ గురించి మీడియా ముందు ఓపెన్ అయింది.
తాను ఎవరితో ప్రేమలో పడిందో చెప్పలేదు కానీ.. బ్రేకప్ వల్ల తాను పడ్డ బాధ గురించి మాత్రం ఆమె పంచుకుంది. “వ్యక్తిగతంగా నేను చాలా ఎమోషనల్గా ఉంటాను. గతంలో నాకో ప్రేమకథ ఉండేది. కొన్ని కారణాల వల్ల మేం బ్రేకప్ అయ్యాం. ఆ సమయంలో ఎంతో బాధ పడ్డా. డిప్రెషన్కు గురయ్యాను. కానీ కొన్నాళ్లకు నన్ను నేను మార్చుకున్నాను. బలంగా నిలబడ్డాను. కెరీర్ మీద దృష్టిపెట్టా” అని రాశి ఖన్నా చెప్పింది. ఇండస్ట్రీలో కంటే తనకు బయటే స్నేహితులు ఎక్కువ అని చెప్పిన రాశి.. కష్ట కాలంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా నిలిచారని తెలిపింది.
ఇక ఒక సినిమా హీరోయిన్కు స్టార్ డమ్ ఎలా ఉంటుందో తన తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ రిలీజైన కొన్ని రోజులకు తెలిసిందని రాశి చెప్పింది. “నా తొలి చిత్రం రిలీజయ్యాక మేం తిరుపతికి వెళ్లాం. ఒక్కసారిగా జనం పెద్ద ఎత్తున మమ్మల్ని చుట్టుముట్టారు. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. మేనేజర్ను అడిగితే వాళ్లంతా నన్ను చూడ్డానికే వచ్చారని చెప్పాడు. నేను షాకయ్యా. ఆ సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేను. ఫేమ్ గురించి నాకు అప్పటిదాకా తెలియదు. రాను రాను అలవాటు చేసుకున్నా” అని రాశి చెప్పింది. ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేసిన రాశికి ప్రస్తుతం కొంచెం వెనుకపడింది. సిద్ధు జొన్నలగడ్డ సరసన నటిస్తున్న ‘తెలుసు కదా’ మాత్రమే ఆమె చేతిలో ఉన్న తెలుగు సినిమా.
This post was last modified on November 13, 2024 2:58 pm
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…
వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…
మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…
ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…