సుకుమార్ సినిమా అంటే ఐటెం సాంగ్ మాండేటరీ. ‘1 నేనొక్కడినే’ లాంటి సీరియస్ థ్రిల్లర్లో కూడా ఆయన ఐటెం సాంగ్ పెట్టారు. దానికి ముందు తర్వాత కూడా ఆయన సినిమాల్లో ఐటెం సాంగ్ చూడొచ్చు. ‘పుష్ప: ది రైజ్’లో సమంత చేసిన ‘ఊ అంటావా’ పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు దీని సీక్వెల్ ‘పుష్ప: రూల్’లో కూడా ఐటెం సాంగ్ ఆనవాయితీని కొనసాగిస్తున్నాడు సుక్కు. ఐతే ఈ పాటలో ఎవరు నర్తిస్తారనే విషయంలో చాన్నాళ్ల పాటు సస్పెన్స్ నడిచింది.
ఒక దశలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ బన్నీతో కలిసి స్టెప్పులేస్తుందని వార్తలొచ్చాయి. కానీ తర్వాత ఆమె స్థానంలోకి శ్రీ లీల వచ్చింది. ఆమెతోనే ఐటెం సాంగ్ తీస్తున్నారు. ఆ పాట చిత్రీకరణ కూడా పూర్తి కావచ్చింది. ఐతే శ్రద్ధా కపూర్ దాదాపుగా ఓకే అయ్యాక ఆమె ఎందుకు ఈ పాటలో నర్తించలేదా అని ఆరా తీస్తే తను డిమాండ్ చేసిన భారీ పారితోషకమే కారణమని తెలిసింది. శ్రీలీల చాలా తక్కువ పారితోషకానికే ఈ పాట చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఐతే శ్రీలీలను ఈ పాటకు ఎంచుకోవాలన్నది దర్శకుడు సుకుమార్ ఆలోచన కాదట. ఇది హీరో బన్నీ ఛాయిస్ అని సమాచారం. బన్నీ ఇంతకుముందే శ్రీలీలతో కలిసి ‘ఆహా’ కోసం ఒక యాడ్ చేశాడు. ఇక ఆమె సూపర్ డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్లలో ఒకడైన బన్నీ.. శ్రీలీలతో కలిసి ఆడి పాడితే డ్యాన్స్ ఫ్లోర్ హీటెక్కిపోవడం ఖాయం. అందుకే ఆమెను ఈ పాట కోసం బన్నీనే ఓకే చేశాడని.. సుకుమార్ కూడా సరే అనడంతో ఈ పాటలో ఆమె భాగం అయిందని సమాచారం.
బన్నీ-శ్రీలీల కాంబో మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులు ఉంటాయని సమాచారం. ఈ పాటలో హీరోయిన్ రష్మిక సైతం తళుక్కుమంటుందట. మామూలుగా ఐటెం సాంగ్స్లో హీరోయిన్లు కనిపించరు. కానీ ఇందులో మాత్రం రష్మిక కూడా భాగమేనట. బన్నీ ఈ పాటను పూర్తి చేశాక.. రష్మికతో కలిసి మరో పాట చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. దీంతో పాటు కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉండగా వారం రోజుల్లో అంతా పూర్తి చేసి చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ కూడా అవగొట్టి నెలాఖరుకు ఫస్ట్ కాపీ రెడీ చేయాలని టీం చూస్తోంది.
This post was last modified on November 13, 2024 2:56 pm
వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…
తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబం సృష్టించిన దుమారం ఇంకా కొనసాగుతుంది. పరకాల సీటు విషయంలో…
సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో యువత చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్లో రీల్ తీసుకునేందుకు…