సుకుమార్ సినిమా అంటే ఐటెం సాంగ్ మాండేటరీ. ‘1 నేనొక్కడినే’ లాంటి సీరియస్ థ్రిల్లర్లో కూడా ఆయన ఐటెం సాంగ్ పెట్టారు. దానికి ముందు తర్వాత కూడా ఆయన సినిమాల్లో ఐటెం సాంగ్ చూడొచ్చు. ‘పుష్ప: ది రైజ్’లో సమంత చేసిన ‘ఊ అంటావా’ పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు దీని సీక్వెల్ ‘పుష్ప: రూల్’లో కూడా ఐటెం సాంగ్ ఆనవాయితీని కొనసాగిస్తున్నాడు సుక్కు. ఐతే ఈ పాటలో ఎవరు నర్తిస్తారనే విషయంలో చాన్నాళ్ల పాటు సస్పెన్స్ నడిచింది.
ఒక దశలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ బన్నీతో కలిసి స్టెప్పులేస్తుందని వార్తలొచ్చాయి. కానీ తర్వాత ఆమె స్థానంలోకి శ్రీ లీల వచ్చింది. ఆమెతోనే ఐటెం సాంగ్ తీస్తున్నారు. ఆ పాట చిత్రీకరణ కూడా పూర్తి కావచ్చింది. ఐతే శ్రద్ధా కపూర్ దాదాపుగా ఓకే అయ్యాక ఆమె ఎందుకు ఈ పాటలో నర్తించలేదా అని ఆరా తీస్తే తను డిమాండ్ చేసిన భారీ పారితోషకమే కారణమని తెలిసింది. శ్రీలీల చాలా తక్కువ పారితోషకానికే ఈ పాట చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఐతే శ్రీలీలను ఈ పాటకు ఎంచుకోవాలన్నది దర్శకుడు సుకుమార్ ఆలోచన కాదట. ఇది హీరో బన్నీ ఛాయిస్ అని సమాచారం. బన్నీ ఇంతకుముందే శ్రీలీలతో కలిసి ‘ఆహా’ కోసం ఒక యాడ్ చేశాడు. ఇక ఆమె సూపర్ డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్లలో ఒకడైన బన్నీ.. శ్రీలీలతో కలిసి ఆడి పాడితే డ్యాన్స్ ఫ్లోర్ హీటెక్కిపోవడం ఖాయం. అందుకే ఆమెను ఈ పాట కోసం బన్నీనే ఓకే చేశాడని.. సుకుమార్ కూడా సరే అనడంతో ఈ పాటలో ఆమె భాగం అయిందని సమాచారం.
బన్నీ-శ్రీలీల కాంబో మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులు ఉంటాయని సమాచారం. ఈ పాటలో హీరోయిన్ రష్మిక సైతం తళుక్కుమంటుందట. మామూలుగా ఐటెం సాంగ్స్లో హీరోయిన్లు కనిపించరు. కానీ ఇందులో మాత్రం రష్మిక కూడా భాగమేనట. బన్నీ ఈ పాటను పూర్తి చేశాక.. రష్మికతో కలిసి మరో పాట చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. దీంతో పాటు కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉండగా వారం రోజుల్లో అంతా పూర్తి చేసి చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ కూడా అవగొట్టి నెలాఖరుకు ఫస్ట్ కాపీ రెడీ చేయాలని టీం చూస్తోంది.
This post was last modified on November 13, 2024 2:56 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…