సుకుమార్ సినిమా అంటే ఐటెం సాంగ్ మాండేటరీ. ‘1 నేనొక్కడినే’ లాంటి సీరియస్ థ్రిల్లర్లో కూడా ఆయన ఐటెం సాంగ్ పెట్టారు. దానికి ముందు తర్వాత కూడా ఆయన సినిమాల్లో ఐటెం సాంగ్ చూడొచ్చు. ‘పుష్ప: ది రైజ్’లో సమంత చేసిన ‘ఊ అంటావా’ పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు దీని సీక్వెల్ ‘పుష్ప: రూల్’లో కూడా ఐటెం సాంగ్ ఆనవాయితీని కొనసాగిస్తున్నాడు సుక్కు. ఐతే ఈ పాటలో ఎవరు నర్తిస్తారనే విషయంలో చాన్నాళ్ల పాటు సస్పెన్స్ నడిచింది.
ఒక దశలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ బన్నీతో కలిసి స్టెప్పులేస్తుందని వార్తలొచ్చాయి. కానీ తర్వాత ఆమె స్థానంలోకి శ్రీ లీల వచ్చింది. ఆమెతోనే ఐటెం సాంగ్ తీస్తున్నారు. ఆ పాట చిత్రీకరణ కూడా పూర్తి కావచ్చింది. ఐతే శ్రద్ధా కపూర్ దాదాపుగా ఓకే అయ్యాక ఆమె ఎందుకు ఈ పాటలో నర్తించలేదా అని ఆరా తీస్తే తను డిమాండ్ చేసిన భారీ పారితోషకమే కారణమని తెలిసింది. శ్రీలీల చాలా తక్కువ పారితోషకానికే ఈ పాట చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఐతే శ్రీలీలను ఈ పాటకు ఎంచుకోవాలన్నది దర్శకుడు సుకుమార్ ఆలోచన కాదట. ఇది హీరో బన్నీ ఛాయిస్ అని సమాచారం. బన్నీ ఇంతకుముందే శ్రీలీలతో కలిసి ‘ఆహా’ కోసం ఒక యాడ్ చేశాడు. ఇక ఆమె సూపర్ డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్లలో ఒకడైన బన్నీ.. శ్రీలీలతో కలిసి ఆడి పాడితే డ్యాన్స్ ఫ్లోర్ హీటెక్కిపోవడం ఖాయం. అందుకే ఆమెను ఈ పాట కోసం బన్నీనే ఓకే చేశాడని.. సుకుమార్ కూడా సరే అనడంతో ఈ పాటలో ఆమె భాగం అయిందని సమాచారం.
బన్నీ-శ్రీలీల కాంబో మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులు ఉంటాయని సమాచారం. ఈ పాటలో హీరోయిన్ రష్మిక సైతం తళుక్కుమంటుందట. మామూలుగా ఐటెం సాంగ్స్లో హీరోయిన్లు కనిపించరు. కానీ ఇందులో మాత్రం రష్మిక కూడా భాగమేనట. బన్నీ ఈ పాటను పూర్తి చేశాక.. రష్మికతో కలిసి మరో పాట చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. దీంతో పాటు కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉండగా వారం రోజుల్లో అంతా పూర్తి చేసి చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ కూడా అవగొట్టి నెలాఖరుకు ఫస్ట్ కాపీ రెడీ చేయాలని టీం చూస్తోంది.
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…