రేపు విడుదల కాబోతున్న కంగువకు కష్టాల పరంపర కొనసాగుతోంది. తమిళనాడులో అమరన్ స్ట్రాంగ్ గా ఉండటం వల్ల మూడో వారంలోనూ దానికి స్క్రీన్లు కేటాయించాలని నిర్ణయించుకోవడం ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని ఫ్యాన్స్ ఇప్పటికే టెన్షన్ పడుతున్నారు. ఇటు చూస్తేనేమో తెలుగు వెర్షన్ కు సైతం చిక్కొచ్చి పడింది. ఇప్పటిదాకా ఏషియన్, పివిఆర్, మిరాజ్ తదితర కార్పొరేట్ చైన్లకు సంబంధించిన మల్టీప్లెక్సులు, సింగల్ స్క్రీన్లలో కంగువ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టలేదు. పర్సెంటేజ్ షేరింగ్ విషయంలో మైత్రితో ఏర్పడిన ఇబ్బందుల వల్లే టికెట్ల అమ్మకం మొదలుకాలేదని తెలిసింది.
ఒక్క హైదరాబాద్ మాత్రమే చూసుకున్నా ఇప్పటిదాకా కంగువకు పట్టుమని రెండు వందల షోల కేటాయింపు జరగలేదు. కొన్ని ప్రీమియం స్క్రీన్ల కోసమే ఎదురు చూసే ప్రేక్షకులు ఉంటారు. కానీ ఆలస్యం జరిగే కొద్దీ మనసు మార్చుకోవడమో లేదా పోటీలో ఉన్న ఇతర రిలీజులకు వెళ్లిపోవడమో జరుగుతుంది. సూర్య కెరీర్ లోనే అత్యంత ఖరీదయిన ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన కంగువ అటు హిందీలోనూ బుకింగ్స్ ఆలస్యం కావడం గాయం మీద కారం చల్లినట్టు అయ్యింది. మొన్నో ప్రెస్ మీట్ లో బాలీవుడ్ రిపోర్టర్ ప్రత్యేకంగా దీని గురించే ప్రస్తావించడం గమనించాల్సిన విషయం.
కోలీవుడ్ బాహుబలిగా అంచనాలున్న కంగువ ఇలా జరగడం పట్ల అభిమానులు కలత చెందుతున్నారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా వెయ్యి కోట్లకు వసూళ్లు తక్కువ రావన్న ధీమాని చూపిస్తుండగా వాస్తవ పరిస్థితి దానికి మద్దతు ఇచ్చేలా లేదు. ఒక చోట అయితే ఏదో అనుకోవచ్చు. కానీ శాపం వెంటాడినట్టు ఒకదాని వెంట మరొకటి చిక్కులు వస్తూనే ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నంలోపు కంగువ నైజామ్ సమస్యని తీర్చేలా పెద్దల మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. సిరుతై శివ దర్శకత్వం వహించిన కంగువలో దిశా పటాని, బాబీ డియోల్ లాంటి భారీ క్యాస్టింగ్ తో పాటు దేవిశ్రీప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…