Movie News

కంగువని వెంటాడుతున్న థియేటర్ టెన్షన్లు

రేపు విడుదల కాబోతున్న కంగువకు కష్టాల పరంపర కొనసాగుతోంది. తమిళనాడులో అమరన్ స్ట్రాంగ్ గా ఉండటం వల్ల మూడో వారంలోనూ దానికి స్క్రీన్లు కేటాయించాలని నిర్ణయించుకోవడం ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని ఫ్యాన్స్ ఇప్పటికే టెన్షన్ పడుతున్నారు. ఇటు చూస్తేనేమో తెలుగు వెర్షన్ కు సైతం చిక్కొచ్చి పడింది. ఇప్పటిదాకా ఏషియన్, పివిఆర్, మిరాజ్ తదితర కార్పొరేట్ చైన్లకు సంబంధించిన మల్టీప్లెక్సులు, సింగల్ స్క్రీన్లలో కంగువ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టలేదు. పర్సెంటేజ్ షేరింగ్ విషయంలో మైత్రితో ఏర్పడిన ఇబ్బందుల వల్లే టికెట్ల అమ్మకం మొదలుకాలేదని తెలిసింది.

ఒక్క హైదరాబాద్ మాత్రమే చూసుకున్నా ఇప్పటిదాకా కంగువకు పట్టుమని రెండు వందల షోల కేటాయింపు జరగలేదు. కొన్ని ప్రీమియం స్క్రీన్ల కోసమే ఎదురు చూసే ప్రేక్షకులు ఉంటారు. కానీ ఆలస్యం జరిగే కొద్దీ మనసు మార్చుకోవడమో లేదా పోటీలో ఉన్న ఇతర రిలీజులకు వెళ్లిపోవడమో జరుగుతుంది. సూర్య కెరీర్ లోనే అత్యంత ఖరీదయిన ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన కంగువ అటు హిందీలోనూ బుకింగ్స్ ఆలస్యం కావడం గాయం మీద కారం చల్లినట్టు అయ్యింది. మొన్నో ప్రెస్ మీట్ లో బాలీవుడ్ రిపోర్టర్ ప్రత్యేకంగా దీని గురించే ప్రస్తావించడం గమనించాల్సిన విషయం.

కోలీవుడ్ బాహుబలిగా అంచనాలున్న కంగువ ఇలా జరగడం పట్ల అభిమానులు కలత చెందుతున్నారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా వెయ్యి కోట్లకు వసూళ్లు తక్కువ రావన్న ధీమాని చూపిస్తుండగా వాస్తవ పరిస్థితి దానికి మద్దతు ఇచ్చేలా లేదు. ఒక చోట అయితే ఏదో అనుకోవచ్చు. కానీ శాపం వెంటాడినట్టు ఒకదాని వెంట మరొకటి చిక్కులు వస్తూనే ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నంలోపు కంగువ నైజామ్ సమస్యని తీర్చేలా పెద్దల మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. సిరుతై శివ దర్శకత్వం వహించిన కంగువలో దిశా పటాని, బాబీ డియోల్ లాంటి భారీ క్యాస్టింగ్ తో పాటు దేవిశ్రీప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.

This post was last modified on November 13, 2024 4:16 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago