దగ్గుబాటి రానా అంటే కేవలం నటుడు కాదు. తన తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నిర్మాత కూడా. ఐతే అతను పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలేమీ చేయడు. తనే ప్రొడక్షన్ అంతా చూసుకోడు. చిన్న సినిమాలకు తెర వెనుక ఉండి నడిపిస్తాడు. 35 లాంటి మంచి కథలకు సపోర్ట్ చేసి రీచ్ పెంచుతూ ఉంటాడు. గతంలో కేరాఫ్ కంచరపాలెం సహా పలు సినిమాలకు ఇలాంటి సహకారమే అందించాడు.
ఎవరైనా మంచి కథతో వచ్చినా, మంచి సినిమా చేసినా రానా మద్దతు ఉంటుందనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. అలాగే చిన్న సినిమాల ప్రమోషన్లకు కూడా రానా వచ్చి సాయం అందిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే అతడి మీద ప్రశంసల జల్లు కురిపించాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. ఇండస్ట్రీలో చాలామంది కొత్త వాళ్లకు రానా పెద్ద దిక్కు అని సందీప్ వ్యాఖ్యానించడం విశేషం.
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్కు రానాతో పాటు సందప్ అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా సందీప్ తన ప్రసంగం చివర్లో రానా మీద ప్రశంసల జల్లు కురిపించాడుచాలా రోజుల నుంచి వేదిక మీద మాట్లాడే అవకాశం వస్తే ఈ మాట చెబుదామని ఎదురు చూస్తున్నా. నిజంగానే చెబుతున్నా. చాలామందికి పెద్ద దిక్కు రానానే. వేరే వాళ్లకే కాదు.. నాకు కూడా అతనే పెద్ద దిక్కు. ఈ మధ్య కొందరుయంగ్ హీరోలు తమకు సరైన సపోర్ట్ సిస్టమ్ లేదని బాధ పడడం చూశా. అలాంటి వాళ్లందరికీ రానా నంబర్ ఇస్తా. ఒక్క ఫోన్ చేయండి చాలు. అతను వచ్చేస్తాడు. అంతే కాక మాలాంటి వాళ్లందరినీ కూడా ప్రమోషన్ కోసం తీసుకొస్తాడు అంటూ సందీప్ కిషన్ నవ్వేశాడు. రానా ఈ మాటలకు సిగ్గు పడుతూ కనిపించాడు.
ఇక దేవకీ నందన వాసుదేవ సినిమా గురంచి సందీప్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ తనకు తెలుసని.. ప్రశాంత్ అదిరిపోయే స్క్రిప్టు ఇచ్చాడని.. ఈ కథ కోసం ఇండస్ట్రీలో చాలామంది పోటీ పడ్డారని.. అదృష్ట వశాత్తూ అశోక్కు ఇందులో నటించే అవకాశముందని.. సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని సందీప్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
This post was last modified on November 12, 2024 11:05 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…