దగ్గుబాటి రానా అంటే కేవలం నటుడు కాదు. తన తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నిర్మాత కూడా. ఐతే అతను పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలేమీ చేయడు. తనే ప్రొడక్షన్ అంతా చూసుకోడు. చిన్న సినిమాలకు తెర వెనుక ఉండి నడిపిస్తాడు. 35 లాంటి మంచి కథలకు సపోర్ట్ చేసి రీచ్ పెంచుతూ ఉంటాడు. గతంలో కేరాఫ్ కంచరపాలెం సహా పలు సినిమాలకు ఇలాంటి సహకారమే అందించాడు.
ఎవరైనా మంచి కథతో వచ్చినా, మంచి సినిమా చేసినా రానా మద్దతు ఉంటుందనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. అలాగే చిన్న సినిమాల ప్రమోషన్లకు కూడా రానా వచ్చి సాయం అందిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే అతడి మీద ప్రశంసల జల్లు కురిపించాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. ఇండస్ట్రీలో చాలామంది కొత్త వాళ్లకు రానా పెద్ద దిక్కు అని సందీప్ వ్యాఖ్యానించడం విశేషం.
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్కు రానాతో పాటు సందప్ అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా సందీప్ తన ప్రసంగం చివర్లో రానా మీద ప్రశంసల జల్లు కురిపించాడుచాలా రోజుల నుంచి వేదిక మీద మాట్లాడే అవకాశం వస్తే ఈ మాట చెబుదామని ఎదురు చూస్తున్నా. నిజంగానే చెబుతున్నా. చాలామందికి పెద్ద దిక్కు రానానే. వేరే వాళ్లకే కాదు.. నాకు కూడా అతనే పెద్ద దిక్కు. ఈ మధ్య కొందరుయంగ్ హీరోలు తమకు సరైన సపోర్ట్ సిస్టమ్ లేదని బాధ పడడం చూశా. అలాంటి వాళ్లందరికీ రానా నంబర్ ఇస్తా. ఒక్క ఫోన్ చేయండి చాలు. అతను వచ్చేస్తాడు. అంతే కాక మాలాంటి వాళ్లందరినీ కూడా ప్రమోషన్ కోసం తీసుకొస్తాడు అంటూ సందీప్ కిషన్ నవ్వేశాడు. రానా ఈ మాటలకు సిగ్గు పడుతూ కనిపించాడు.
ఇక దేవకీ నందన వాసుదేవ సినిమా గురంచి సందీప్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ తనకు తెలుసని.. ప్రశాంత్ అదిరిపోయే స్క్రిప్టు ఇచ్చాడని.. ఈ కథ కోసం ఇండస్ట్రీలో చాలామంది పోటీ పడ్డారని.. అదృష్ట వశాత్తూ అశోక్కు ఇందులో నటించే అవకాశముందని.. సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని సందీప్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
This post was last modified on November 12, 2024 11:05 pm
వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…
గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…
కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…
2027 సంక్రాంతి పందెం క్రమంగా వేడెక్కుతోంది. శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబో ' జార్జ్ క్రిష్' జనవరి 14…
తాజాగా విడుదలైన బట్వారా 1947 ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ తెచ్చుకోలేకపోవడం బయ్యర్ వర్గాలను నిరాశ పరుస్తోంది. అనూహ్యంగా ఆవారాపన్ 2…
టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, అనుకున్నది ఠక్కున చెప్పేయడం ఆమె నైజం. ఇక,…