Movie News

అఖిల్.. యూవీ కథ ఎందుకు ఆగినట్లు?

అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా షూటింగ్ దశలో ఉండగానే యూవీ ప్రొడక్షన్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొత్త దర్శకుడు అనిల్ తో దాదాపు 100కోట్ల బడ్జెట్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ధీర అనే టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ హఠాత్తుగా ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది. ఇక దానిపై ఒక క్లారిటీ రాకముందే అఖిల్ మరో దర్శకుడు తో సినిమాను లైన్లో పెట్టాడు.

వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో మంచి గుర్తింపును అందుకున్న దర్శకుడు మురళి కిషోర్ తో అఖిల్ తదుపరి సినిమా రాబోతోంది. నాగార్జున ద్వారానే ఈ కథ సెట్టయినట్లు తెలుస్తోంది. అయితే UV క్రియేషన్ సినిమా ఎందుకు ఆగింది అనే విషయంలో మాత్రం ఎక్కడ సరైన క్లారిటీ రాలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారమైతే నాగర్జున నిర్ణయం ద్వారా ఆ సినిమాను హోల్డ్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఏజెంట్ డిజాస్టర్ తర్వాత మళ్లీ అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా చేయడం మార్కెట్ పరంగా మంచిది కాదు అని సలహా ఇచ్చారట. ముందుగా అఖిల్ నటుడిగా మంచి గుర్తింపు అందుకోవడమే కాకుండా ఒక కమర్షియల్ సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నాగర్జున స్వయంగా రంగంలోకి దిగి మరి ఈ ప్రణాళికను మార్చినట్లుగా తెలుస్తోంది. ఇక మురళి కిషోర్ తో చేయబోయే ప్రాజెక్టు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ గా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

సినిమా కథ మాత్రం 80 కాలంలో జరిగే విధంగా దర్శకుడు తనదైన శైలిలో సిద్ధం చేసుకున్నట్లు టాక్. ఈ విషయంలో సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇక నటుడిగా అఖిల్ కొత్తగా కనిపించేందుకు ఈ సినిమాలో కంటెంట్ బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే నాగర్జున బడ్జెట్ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకూడదని అన్నపూర్ణ బ్యానర్ లోనే ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా తర్వాతే UV ప్రాజెక్టుపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

This post was last modified on November 12, 2024 5:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

45 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

10 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

10 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

12 hours ago