Movie News

అఖిల్.. యూవీ కథ ఎందుకు ఆగినట్లు?

అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా షూటింగ్ దశలో ఉండగానే యూవీ ప్రొడక్షన్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొత్త దర్శకుడు అనిల్ తో దాదాపు 100కోట్ల బడ్జెట్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ధీర అనే టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ హఠాత్తుగా ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది. ఇక దానిపై ఒక క్లారిటీ రాకముందే అఖిల్ మరో దర్శకుడు తో సినిమాను లైన్లో పెట్టాడు.

వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో మంచి గుర్తింపును అందుకున్న దర్శకుడు మురళి కిషోర్ తో అఖిల్ తదుపరి సినిమా రాబోతోంది. నాగార్జున ద్వారానే ఈ కథ సెట్టయినట్లు తెలుస్తోంది. అయితే UV క్రియేషన్ సినిమా ఎందుకు ఆగింది అనే విషయంలో మాత్రం ఎక్కడ సరైన క్లారిటీ రాలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారమైతే నాగర్జున నిర్ణయం ద్వారా ఆ సినిమాను హోల్డ్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఏజెంట్ డిజాస్టర్ తర్వాత మళ్లీ అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా చేయడం మార్కెట్ పరంగా మంచిది కాదు అని సలహా ఇచ్చారట. ముందుగా అఖిల్ నటుడిగా మంచి గుర్తింపు అందుకోవడమే కాకుండా ఒక కమర్షియల్ సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నాగర్జున స్వయంగా రంగంలోకి దిగి మరి ఈ ప్రణాళికను మార్చినట్లుగా తెలుస్తోంది. ఇక మురళి కిషోర్ తో చేయబోయే ప్రాజెక్టు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ గా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

సినిమా కథ మాత్రం 80 కాలంలో జరిగే విధంగా దర్శకుడు తనదైన శైలిలో సిద్ధం చేసుకున్నట్లు టాక్. ఈ విషయంలో సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇక నటుడిగా అఖిల్ కొత్తగా కనిపించేందుకు ఈ సినిమాలో కంటెంట్ బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే నాగర్జున బడ్జెట్ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకూడదని అన్నపూర్ణ బ్యానర్ లోనే ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా తర్వాతే UV ప్రాజెక్టుపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Satya

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

2 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

3 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

5 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

7 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

7 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

8 hours ago