అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా షూటింగ్ దశలో ఉండగానే యూవీ ప్రొడక్షన్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొత్త దర్శకుడు అనిల్ తో దాదాపు 100కోట్ల బడ్జెట్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ధీర అనే టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ హఠాత్తుగా ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది. ఇక దానిపై ఒక క్లారిటీ రాకముందే అఖిల్ మరో దర్శకుడు తో సినిమాను లైన్లో పెట్టాడు.
వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో మంచి గుర్తింపును అందుకున్న దర్శకుడు మురళి కిషోర్ తో అఖిల్ తదుపరి సినిమా రాబోతోంది. నాగార్జున ద్వారానే ఈ కథ సెట్టయినట్లు తెలుస్తోంది. అయితే UV క్రియేషన్ సినిమా ఎందుకు ఆగింది అనే విషయంలో మాత్రం ఎక్కడ సరైన క్లారిటీ రాలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారమైతే నాగర్జున నిర్ణయం ద్వారా ఆ సినిమాను హోల్డ్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఏజెంట్ డిజాస్టర్ తర్వాత మళ్లీ అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా చేయడం మార్కెట్ పరంగా మంచిది కాదు అని సలహా ఇచ్చారట. ముందుగా అఖిల్ నటుడిగా మంచి గుర్తింపు అందుకోవడమే కాకుండా ఒక కమర్షియల్ సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నాగర్జున స్వయంగా రంగంలోకి దిగి మరి ఈ ప్రణాళికను మార్చినట్లుగా తెలుస్తోంది. ఇక మురళి కిషోర్ తో చేయబోయే ప్రాజెక్టు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ గా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.
సినిమా కథ మాత్రం 80 కాలంలో జరిగే విధంగా దర్శకుడు తనదైన శైలిలో సిద్ధం చేసుకున్నట్లు టాక్. ఈ విషయంలో సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇక నటుడిగా అఖిల్ కొత్తగా కనిపించేందుకు ఈ సినిమాలో కంటెంట్ బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే నాగర్జున బడ్జెట్ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకూడదని అన్నపూర్ణ బ్యానర్ లోనే ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా తర్వాతే UV ప్రాజెక్టుపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on November 12, 2024 5:02 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…