Movie News

లక్కీ భాస్కర్ – సార్.. వెంకీ నాకు చెప్పాడు కానీ..

మొత్తానికి లక్కీ భాస్కర్ సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి తన బ్రాండ్ ఇమేజ్ ను మార్చేసుకున్నాడు. మొదట్లో వరుసగా తొలిప్రేమ – మిస్టర్ మజ్ను – రంగ్ దే అంటూ ప్రేమ కథలు టచ్ చేసిన వెంకీ ఒకే రకమైన కథలు చేస్తాడనే మార్క్ ఉండేది. కానీ సార్ సినిమాతో ట్రాక్ మార్చి లక్కీ భాస్కర్ తో పర్ఫెక్ట్ కంటెంట్ ఉన్న డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా కథలు మొదట మన హీరోలతో ఎందుకు చేయలేదు అనే చర్చ గట్టిగానే నడిచింది.

ధనుష్ – దుల్కర్ సల్మాన్ తరహా ఇమేజ్ తో ఉండే హీరోలు టాలీవుడ్ లో కూడా ఉన్నారు. వరుణ్ తేజ్, నాని, నాగచైతన్య లాంటి హీరోలు ఆ కథలకు సూటవుతారు కదా అనే సందేహం రాకుండా ఉండదు. నిజానికి ఈ రెండు కథలు వరుణ్ తేజ్ ముందు చర్చల్లోకి వచ్చినవే. ఎందుకంటే తొలిప్రేమ కలయికతో డైరెక్టర్ హీరోకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. దీంతో ఏ కథ సిద్ధం చేసుకున్నా కూడా వెంకీ నాకు చెబుతాడు అని ఇటీవల మట్కా ప్రమోషన్ లో వరుణ్ చెప్పాడు.

ఇక లక్కీ భాస్కర్ కథ కూడా నాకు చెప్పినప్పుడు బాగా అనిపించింది, కానీ సార్ కథ చేయాలని ఉండేది. అయితే అప్పటికే వెంకీ ధనుష్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ భవిష్యత్తులో మాత్రం తప్పకుండా వెంకీతో ఒక సినిమా చేస్తానని వరుణ్ ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఇక నెక్స్ట్ మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు చెబుతూ, అదొక కామెడీ హారర్ సినిమా అని వివరణ ఇచ్చారు. అలాగే చెల్లి ప్రొడక్షన్ లో కూడా ఒక సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వరుణ్ తెలిపాడు.

This post was last modified on November 12, 2024 5:02 pm

Share

Recent Posts

యష్ ఇమేజ్ వల్లే ఇంత ఓపెనింగ్

టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…

1 hour ago

చిరు అతడితో సినిమా చేసి ఉంటే..

మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…

2 hours ago

స్పిరిట్ కంటే వారణాసి పెద్ద సినిమా: సందీప్ వంగా

సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్‌లో స్పిరిట్,…

3 hours ago

బ్రేకింగ్… అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత

అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…

3 hours ago

హైదరాబాద్ – విజయవాడ ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…

5 hours ago

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

11 hours ago