మొత్తానికి లక్కీ భాస్కర్ సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి తన బ్రాండ్ ఇమేజ్ ను మార్చేసుకున్నాడు. మొదట్లో వరుసగా తొలిప్రేమ – మిస్టర్ మజ్ను – రంగ్ దే అంటూ ప్రేమ కథలు టచ్ చేసిన వెంకీ ఒకే రకమైన కథలు చేస్తాడనే మార్క్ ఉండేది. కానీ సార్ సినిమాతో ట్రాక్ మార్చి లక్కీ భాస్కర్ తో పర్ఫెక్ట్ కంటెంట్ ఉన్న డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా కథలు మొదట మన హీరోలతో ఎందుకు చేయలేదు అనే చర్చ గట్టిగానే నడిచింది.
ధనుష్ – దుల్కర్ సల్మాన్ తరహా ఇమేజ్ తో ఉండే హీరోలు టాలీవుడ్ లో కూడా ఉన్నారు. వరుణ్ తేజ్, నాని, నాగచైతన్య లాంటి హీరోలు ఆ కథలకు సూటవుతారు కదా అనే సందేహం రాకుండా ఉండదు. నిజానికి ఈ రెండు కథలు వరుణ్ తేజ్ ముందు చర్చల్లోకి వచ్చినవే. ఎందుకంటే తొలిప్రేమ కలయికతో డైరెక్టర్ హీరోకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. దీంతో ఏ కథ సిద్ధం చేసుకున్నా కూడా వెంకీ నాకు చెబుతాడు అని ఇటీవల మట్కా ప్రమోషన్ లో వరుణ్ చెప్పాడు.
ఇక లక్కీ భాస్కర్ కథ కూడా నాకు చెప్పినప్పుడు బాగా అనిపించింది, కానీ సార్ కథ చేయాలని ఉండేది. అయితే అప్పటికే వెంకీ ధనుష్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ భవిష్యత్తులో మాత్రం తప్పకుండా వెంకీతో ఒక సినిమా చేస్తానని వరుణ్ ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఇక నెక్స్ట్ మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు చెబుతూ, అదొక కామెడీ హారర్ సినిమా అని వివరణ ఇచ్చారు. అలాగే చెల్లి ప్రొడక్షన్ లో కూడా ఒక సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వరుణ్ తెలిపాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…