మొత్తానికి లక్కీ భాస్కర్ సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి తన బ్రాండ్ ఇమేజ్ ను మార్చేసుకున్నాడు. మొదట్లో వరుసగా తొలిప్రేమ – మిస్టర్ మజ్ను – రంగ్ దే అంటూ ప్రేమ కథలు టచ్ చేసిన వెంకీ ఒకే రకమైన కథలు చేస్తాడనే మార్క్ ఉండేది. కానీ సార్ సినిమాతో ట్రాక్ మార్చి లక్కీ భాస్కర్ తో పర్ఫెక్ట్ కంటెంట్ ఉన్న డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా కథలు మొదట మన హీరోలతో ఎందుకు చేయలేదు అనే చర్చ గట్టిగానే నడిచింది.
ధనుష్ – దుల్కర్ సల్మాన్ తరహా ఇమేజ్ తో ఉండే హీరోలు టాలీవుడ్ లో కూడా ఉన్నారు. వరుణ్ తేజ్, నాని, నాగచైతన్య లాంటి హీరోలు ఆ కథలకు సూటవుతారు కదా అనే సందేహం రాకుండా ఉండదు. నిజానికి ఈ రెండు కథలు వరుణ్ తేజ్ ముందు చర్చల్లోకి వచ్చినవే. ఎందుకంటే తొలిప్రేమ కలయికతో డైరెక్టర్ హీరోకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. దీంతో ఏ కథ సిద్ధం చేసుకున్నా కూడా వెంకీ నాకు చెబుతాడు అని ఇటీవల మట్కా ప్రమోషన్ లో వరుణ్ చెప్పాడు.
ఇక లక్కీ భాస్కర్ కథ కూడా నాకు చెప్పినప్పుడు బాగా అనిపించింది, కానీ సార్ కథ చేయాలని ఉండేది. అయితే అప్పటికే వెంకీ ధనుష్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ భవిష్యత్తులో మాత్రం తప్పకుండా వెంకీతో ఒక సినిమా చేస్తానని వరుణ్ ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఇక నెక్స్ట్ మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు చెబుతూ, అదొక కామెడీ హారర్ సినిమా అని వివరణ ఇచ్చారు. అలాగే చెల్లి ప్రొడక్షన్ లో కూడా ఒక సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వరుణ్ తెలిపాడు.
This post was last modified on November 12, 2024 5:02 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…