హీరోతో టాలీవుడ్ కు పరిచయమైన అశోక్ గల్లా డెబ్యూతో ఆశించిన ఫలితం అందుకోకపోవడంతో రెండో సినిమాకు బాగా గ్యాప్ తీసుకున్నాడు. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ అందించిన కథ కావడం వల్ల దీని మీద ప్రత్యేక అంచనాలున్నాయి. వాస్తవానికి కంగువ, మట్కాతో పోటీ పడాలని నవంబర్ 14 విడుదల తేదీ ప్రకటించారు. తర్వాత ప్రాక్టికల్ గా అలోచించి వారం వాయిదా వేస్తే మంచిదనే ఉద్దేశంతో నవంబర్ 22కి షిఫ్ట్ చేశారు. ఇవాళ దగ్గుబాటి రానా అతిథిగా హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ జరిగింది. ఎక్కువ నాన్చకుండా కథకు సంబంధించి కీలకమైన క్లూస్ ఇచ్చారు.
తల్లి గారాబంతో పెరిగిన ఒక యువకుడు. జాతకం ప్రకారం ఫలానా సంవత్సరంలో గండం ఉందని జ్యోతిష్యుడు చెబుతాడు. ఇంకోవైపు ఇతని పుట్టుక వల్ల శత్రువు ప్రాణం పోయే ప్రమాదం ఉందని ఒక స్వామి చెప్పడంతో రెండు కుటుంబాల మధ్య కనిపించని అగాథం ఉంటుంది. పెరిగి పెద్దయ్యాక ఊళ్ళో గొడవలు మొదలవుతాయి. సుదర్శన చక్రం ఉన్న కృష్ణుడి విగ్రహం ఉన్న ఒకే ఊరిలో కురుక్షేత్ర సంగ్రామానికి పునాది పడుతుంది. కంసుడి లాంటి బంధువుని వాసుదేవుడు ఎలా కాచుకున్నాడనే పాయింట్ మీద మంచి కమర్షియల్ విలేజ్ ఎంటర్ టైనర్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.
ఇదంతా చూస్తే మురారి గుర్తుకు రావడం సహజం. అందులో మహేష్ బాబుకు వంశపారంపర్యంగా వచ్చిన శాపం వల్ల ప్రాణ గండం ఉంటుంది. దాన్నుంచి తప్పించేందుకు బామ్మ చాలా తపన పడుతుంది. వాసుదేవలో ఆ బాధ్యతని తల్లికి ఇచ్చారు. గుణ 369తో దర్శకుడిగా మారిన అర్జున్ జంధ్యాల ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ బడ్జెట్ పెట్టారు. విఎఫెక్స్ క్వాలిటీ బాగుంది. ప్రశాంత్ వర్మ రచన కాబట్టి ఆయన పర్యవేక్షణ ఉండే ఉంటుంది. డేట్ మారినా కాంపిటీషన్ అయితే గట్టిగానే ఉంది. విశ్వక్ సేన్, సత్యదేవ్ లను కాచుకోవాల్సి ఉంటుంది. ఫాంటసీ ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ మెప్పిస్తే కనక వాసుదేవకు విజయమే.
This post was last modified on November 12, 2024 2:33 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…