Movie News

మురారిని గుర్తు చేసిన వాసుదేవ

హీరోతో టాలీవుడ్ కు పరిచయమైన అశోక్ గల్లా డెబ్యూతో ఆశించిన ఫలితం అందుకోకపోవడంతో రెండో సినిమాకు బాగా గ్యాప్ తీసుకున్నాడు. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ అందించిన కథ కావడం వల్ల దీని మీద ప్రత్యేక అంచనాలున్నాయి. వాస్తవానికి కంగువ, మట్కాతో పోటీ పడాలని నవంబర్ 14 విడుదల తేదీ ప్రకటించారు. తర్వాత ప్రాక్టికల్ గా అలోచించి వారం వాయిదా వేస్తే మంచిదనే ఉద్దేశంతో నవంబర్ 22కి షిఫ్ట్ చేశారు. ఇవాళ దగ్గుబాటి రానా అతిథిగా హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ జరిగింది. ఎక్కువ నాన్చకుండా కథకు సంబంధించి కీలకమైన క్లూస్ ఇచ్చారు.

తల్లి గారాబంతో పెరిగిన ఒక యువకుడు. జాతకం ప్రకారం ఫలానా సంవత్సరంలో గండం ఉందని జ్యోతిష్యుడు చెబుతాడు. ఇంకోవైపు ఇతని పుట్టుక వల్ల శత్రువు ప్రాణం పోయే ప్రమాదం ఉందని ఒక స్వామి చెప్పడంతో రెండు కుటుంబాల మధ్య కనిపించని అగాథం ఉంటుంది. పెరిగి పెద్దయ్యాక ఊళ్ళో గొడవలు మొదలవుతాయి. సుదర్శన చక్రం ఉన్న కృష్ణుడి విగ్రహం ఉన్న ఒకే ఊరిలో కురుక్షేత్ర సంగ్రామానికి పునాది పడుతుంది. కంసుడి లాంటి బంధువుని వాసుదేవుడు ఎలా కాచుకున్నాడనే పాయింట్ మీద మంచి కమర్షియల్ విలేజ్ ఎంటర్ టైనర్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

ఇదంతా చూస్తే మురారి గుర్తుకు రావడం సహజం. అందులో మహేష్ బాబుకు వంశపారంపర్యంగా వచ్చిన శాపం వల్ల ప్రాణ గండం ఉంటుంది. దాన్నుంచి తప్పించేందుకు బామ్మ చాలా తపన పడుతుంది. వాసుదేవలో ఆ బాధ్యతని తల్లికి ఇచ్చారు. గుణ 369తో దర్శకుడిగా మారిన అర్జున్ జంధ్యాల ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ బడ్జెట్ పెట్టారు. విఎఫెక్స్ క్వాలిటీ బాగుంది. ప్రశాంత్ వర్మ రచన కాబట్టి ఆయన పర్యవేక్షణ ఉండే ఉంటుంది. డేట్ మారినా కాంపిటీషన్ అయితే గట్టిగానే ఉంది. విశ్వక్ సేన్, సత్యదేవ్ లను కాచుకోవాల్సి ఉంటుంది. ఫాంటసీ ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ మెప్పిస్తే కనక వాసుదేవకు విజయమే.

This post was last modified on November 12, 2024 2:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

1 hour ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

3 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

4 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

4 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

5 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

5 hours ago