హీరోతో టాలీవుడ్ కు పరిచయమైన అశోక్ గల్లా డెబ్యూతో ఆశించిన ఫలితం అందుకోకపోవడంతో రెండో సినిమాకు బాగా గ్యాప్ తీసుకున్నాడు. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ అందించిన కథ కావడం వల్ల దీని మీద ప్రత్యేక అంచనాలున్నాయి. వాస్తవానికి కంగువ, మట్కాతో పోటీ పడాలని నవంబర్ 14 విడుదల తేదీ ప్రకటించారు. తర్వాత ప్రాక్టికల్ గా అలోచించి వారం వాయిదా వేస్తే మంచిదనే ఉద్దేశంతో నవంబర్ 22కి షిఫ్ట్ చేశారు. ఇవాళ దగ్గుబాటి రానా అతిథిగా హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ జరిగింది. ఎక్కువ నాన్చకుండా కథకు సంబంధించి కీలకమైన క్లూస్ ఇచ్చారు.
తల్లి గారాబంతో పెరిగిన ఒక యువకుడు. జాతకం ప్రకారం ఫలానా సంవత్సరంలో గండం ఉందని జ్యోతిష్యుడు చెబుతాడు. ఇంకోవైపు ఇతని పుట్టుక వల్ల శత్రువు ప్రాణం పోయే ప్రమాదం ఉందని ఒక స్వామి చెప్పడంతో రెండు కుటుంబాల మధ్య కనిపించని అగాథం ఉంటుంది. పెరిగి పెద్దయ్యాక ఊళ్ళో గొడవలు మొదలవుతాయి. సుదర్శన చక్రం ఉన్న కృష్ణుడి విగ్రహం ఉన్న ఒకే ఊరిలో కురుక్షేత్ర సంగ్రామానికి పునాది పడుతుంది. కంసుడి లాంటి బంధువుని వాసుదేవుడు ఎలా కాచుకున్నాడనే పాయింట్ మీద మంచి కమర్షియల్ విలేజ్ ఎంటర్ టైనర్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.
ఇదంతా చూస్తే మురారి గుర్తుకు రావడం సహజం. అందులో మహేష్ బాబుకు వంశపారంపర్యంగా వచ్చిన శాపం వల్ల ప్రాణ గండం ఉంటుంది. దాన్నుంచి తప్పించేందుకు బామ్మ చాలా తపన పడుతుంది. వాసుదేవలో ఆ బాధ్యతని తల్లికి ఇచ్చారు. గుణ 369తో దర్శకుడిగా మారిన అర్జున్ జంధ్యాల ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ బడ్జెట్ పెట్టారు. విఎఫెక్స్ క్వాలిటీ బాగుంది. ప్రశాంత్ వర్మ రచన కాబట్టి ఆయన పర్యవేక్షణ ఉండే ఉంటుంది. డేట్ మారినా కాంపిటీషన్ అయితే గట్టిగానే ఉంది. విశ్వక్ సేన్, సత్యదేవ్ లను కాచుకోవాల్సి ఉంటుంది. ఫాంటసీ ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ మెప్పిస్తే కనక వాసుదేవకు విజయమే.
This post was last modified on November 12, 2024 2:33 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…