డిసెంబర్ మొదటి వారంలో పుష్ప 2 ది రూల్ తో పోటీ పడేందుకు సిద్ధపడిన బాలీవుడ్ ప్యాన్ ఇండియా మూవీ చావా వాయిదా పడటం దాదాపు ఖరారైనట్టే. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటిదాకా ప్రమోషన్లు మొదలుపెట్టకపోవడంతో పోస్ట్ పోన్ జస్ట్ లాంఛనమేనని చెప్పాలి. ముందు చెప్పిన ప్రకారమైతే ఆ నెల 6 విడుదల కావాలి. అయితే పుష్ప 2 క్లాష్ వల్ల ఓపెనింగ్స్ దెబ్బ తింటాయని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. మరాఠా వీరుడు శంభాజీ బయోపిక్ గా రూపొందిన ఈ చారిత్రక డ్రామాలో రష్మిక మందన్ననే హీరోయిన్ కావడం గమనార్షం. ఇప్పుడు అసలు ట్విస్టు చూద్దాం.
అల్లు అర్జున్ తో క్లాష్ వద్దనుకున్న చావా ఇప్పుడు రామ్ చరణ్ తో పోటీకి సిద్ధపడుతోంది. కొత్త డేట్ గా జనవరి 10 లాక్ చేయబోతున్నట్టు ముంబై మీడియా టాక్. నిజానికి డిసెంబర్ 20 ఆప్షన్ పరిగణనలోకి తీసుకున్నారు. కానీ అదే రోజు ముఫాసా లయన్ కింగ్ ని ఇండియాలో పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. గత భాగం మన దేశంలో నూటా ఎనభై కోట్లకు పైగా వసూలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త మృగరాజుని తక్కువంచనా వేయడానికి లేదు. పైగా తెలుగు, తమిళంలో చెప్పుకోదగ్గ నోటెడ్ రిలీజులు చాలానే ఉన్నాయి. దానికన్నా కీలకమైన సంక్రాంతికి షిఫ్ట్ అయిపోతే ఏ గొడవా లేకుండా మంచి కలెక్షన్లు చూడొచ్చు.
సో పుష్ప 2తో తలపడటం కన్నా గేమ్ చేంజర్ ని ఢీ కొట్టడమే సేఫని చావా టీమ్ భావించింది. రామ్ చరణ్ కు ఉత్తరాదిలో ఇమేజ్ ఉంది కానీ దర్శకుడు శంకర్ బ్రాండ్ అక్కడ మరీ తీవ్రంగా లేదు. సో పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇంకో రెండు మూడు రోజుల్లో చావాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషించిన చావా మీద రెండు వందల కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టారట. మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇవ్వబోతున్నారని సమాచారం. దీని గురించి చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన పని లేదు. చావా ప్రభావం ఉత్తరాదికే ఎక్కువగా పరిమితమవుతుంది.
This post was last modified on November 9, 2024 12:27 pm
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…