ఏళ్ళ నిరీక్షణకు శుభం కార్డు వేస్తూ జనవరి 10 విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగా తపించిపోతున్నారో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తో ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక రామ్ చరణ్ క్యామియో చేసిన ఆచార్య దారుణంగా పోయింది. అయినా సరే అతిథి పాత్ర కాబట్టి అభిమానులు దాన్ని పరిగణనలోకి తీసుకోరు కనక ఇప్పుడు దర్శకుడు శంకర్ మీదే భారం మొత్తం వేసి ఎదురు చూస్తున్నారు. ఎల్లుండి లక్నోలో జరిగే గ్రాండ్ ఈవెంట్ కు టాలీవుడ్ మీడియా కూడా హాజరు కానుండగా చరణ్, శంకర్, ఎస్జె సూర్య, శ్రీకాంత్ తో పాటు ప్రధాన క్యాస్ట్ అండ్ క్రూ పాల్గొనబోతోంది.
డేట్ ఇష్యూ వల్ల కియారా అద్వానీ రాకపోవచ్చని టాక్. ఇక టీజర్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన లీక్స్ ఆసక్తిని రెట్టింపు చేసేలా ఉన్నాయి. 91 సెకండ్ల పాటు నడిచే వీడియోలో ముందు క్రూరంగా నవ్వే ఎస్జె సూర్య ఇంట్రోతో మొదలై రామ్ చరణ్ ఎలివేషన్ షాట్లు, ట్రైన్ ఎపిసోడ్ విజువల్స్, అప్పన్న గెటప్ తాలూకు చిన్న అవుట్ లుక్ ఇలా సీన్లతోనే నడిపించి చివర్లో చరణ్ నోటివెంట అన్ ప్రిడిక్టబుల్ అనే మాటతో ముగిస్తారని తెలిసింది. ఒక్క చిన్న డైలాగు తప్ప వీడియో మొత్తం మాటలు ఉండవట. కానీ పదే పదే చూసేలా ఎడిటింగ్ చేయించిన తీరు అంచనాలు పెంచేలా ఉందని చూసినవాళ్లు చెబుతున్న మాట.
ఇప్పుడీ చిన్న టీజరే గేమ్ మొత్తాన్ని మార్చబోతోందని సమాచారం. నిర్మాత దిల్ రాజు ఇంకా బిజినెస్ డీల్స్ పూర్తి స్థాయిలో క్లోజ్ చేయలేదు. థర్డ్ పార్ట్ ఇస్తున్న రేట్లు టీజర్ వచ్చాక పెరుగుతాయని ఆశిస్తున్నారు. ఈ కారణంగానే డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ వేడుక పట్ల ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఇండియన్ 2 తాలూకు ప్రభావం ఉంటుందని తొలుత భావించినప్పటికీ శంకర్ బ్రాండ్ కన్నా ఇది రామ్ చరణ్ మూవీగా ఎక్కువ పబ్లిసిటీ చేసుకోవడంతో క్రమంగా హైప్ ఎక్కడికో వెళ్లేలా ఉంది. సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో ఫుల్ లెన్త్ టీజర్ వదలుతున్న మొదటి సినిమా గేమ్ ఛేంజరే.
This post was last modified on November 8, 2024 10:09 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…