మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో సాఫ్ట్ గా వంటలు చేసుకునే ఫైవ్ స్టార్ చెఫ్ గా కనిపించిన స్వీటీ అనుష్క ఒక్కసారిగా ఊర మాస్ ఘాటీగా మారిపోయింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా షూటింగ్ పూర్తి చేసుకోవడానికి దగ్గరలో ఉంది. ఈ రోజు అనుష్క పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. మాములుగా నిమిషంలోపు నిడివి ఉండే ఇలాంటి వీడియోలని బట్టి కంటెంట్ అంచనా వేయడం కష్టం కానీ క్రిష్ మాత్రం తాను జేజమ్మని ఎంత వయొలెంట్ గా చూపించబోతున్నారో చిన్న శాంపిల్ ఇచ్చారు. విజువల్స్ చాలా ఇంటెన్స్ గా అంచనాలు పెంచేలా ఉన్నాయి.
కథ చెప్పలేదు కానీ కొన్ని క్లూస్ అయితే ఇచ్చారు. అడవి, సముద్రం, చెరువుల గుండా అక్రమ రవాణా జరిగే నేర సామ్రాజ్యంలో ఘాటీ మాములు అమ్మాయి స్థాయి నుంచి మహారాణిగా అందరిని శాసించే స్థాయికి ఎదుగుతుంది. ఈ క్రమంలో బస్సును ఆపి శత్రువు తలను నరికేసి దర్జాగా దాన్ని బయటికి తీసుకొచ్చేంత ధైర్యం తనది. ఇంత హింసాత్మకంగా తనెందుకు మారిందనేది తెరమీద చూడాలి. నాగవెల్లి విద్యాసాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మనోజ్ రెడ్డి కాటసాని ఛాయాగ్రహణం మంచి స్టాండర్ లో ఉన్నాయి. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు వినిపించే ఛాన్స్ ఇవ్వలేదు. మ్యూజిక్ తో సరిపెట్టారు.
ఇప్పటినుంచి ఘాటీ లెక్కలు మారనున్నాయి. అరుంధతి తర్వాత మళ్ళీ అంత డెప్త్ ఉన్న పాత్రను ఘాటీలో అనుష్క పోషించింది. ఇతర తారాగణం తదితర వివరాలు బయట పెట్టలేదు కానీ క్యాస్టింగ్ పెద్దదే ఉండబోతోంది. విడుదల తేదీ మాత్రం ఇంకా సస్పెన్స్ లో ఉంచారు. ఈ ఏడాదిలో నవంబర్ మినహాయిస్తే ఇంకొక్క నెల బ్యాలన్స్ ఉంది కాబట్టి 2025లోనే ఘాటీ థియేటర్లలో అడుగు పెడుతుంది. హరిహర వీరమల్లు నుంచి తప్పుకుని ఈ సినిమా చేసిన దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్టు మీద చాలా కష్టపడ్డాడు. ఎన్టీఆర్ బయోపిక్, కొండపొలం వైఫల్యం, పవన్ సినిమా ఆలస్యం ఇవన్నీ మరిపించేలా హిట్టు కొట్టాలి మరి.
This post was last modified on November 7, 2024 4:50 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…