మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో సాఫ్ట్ గా వంటలు చేసుకునే ఫైవ్ స్టార్ చెఫ్ గా కనిపించిన స్వీటీ అనుష్క ఒక్కసారిగా ఊర మాస్ ఘాటీగా మారిపోయింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా షూటింగ్ పూర్తి చేసుకోవడానికి దగ్గరలో ఉంది. ఈ రోజు అనుష్క పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. మాములుగా నిమిషంలోపు నిడివి ఉండే ఇలాంటి వీడియోలని బట్టి కంటెంట్ అంచనా వేయడం కష్టం కానీ క్రిష్ మాత్రం తాను జేజమ్మని ఎంత వయొలెంట్ గా చూపించబోతున్నారో చిన్న శాంపిల్ ఇచ్చారు. విజువల్స్ చాలా ఇంటెన్స్ గా అంచనాలు పెంచేలా ఉన్నాయి.
కథ చెప్పలేదు కానీ కొన్ని క్లూస్ అయితే ఇచ్చారు. అడవి, సముద్రం, చెరువుల గుండా అక్రమ రవాణా జరిగే నేర సామ్రాజ్యంలో ఘాటీ మాములు అమ్మాయి స్థాయి నుంచి మహారాణిగా అందరిని శాసించే స్థాయికి ఎదుగుతుంది. ఈ క్రమంలో బస్సును ఆపి శత్రువు తలను నరికేసి దర్జాగా దాన్ని బయటికి తీసుకొచ్చేంత ధైర్యం తనది. ఇంత హింసాత్మకంగా తనెందుకు మారిందనేది తెరమీద చూడాలి. నాగవెల్లి విద్యాసాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మనోజ్ రెడ్డి కాటసాని ఛాయాగ్రహణం మంచి స్టాండర్ లో ఉన్నాయి. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు వినిపించే ఛాన్స్ ఇవ్వలేదు. మ్యూజిక్ తో సరిపెట్టారు.
ఇప్పటినుంచి ఘాటీ లెక్కలు మారనున్నాయి. అరుంధతి తర్వాత మళ్ళీ అంత డెప్త్ ఉన్న పాత్రను ఘాటీలో అనుష్క పోషించింది. ఇతర తారాగణం తదితర వివరాలు బయట పెట్టలేదు కానీ క్యాస్టింగ్ పెద్దదే ఉండబోతోంది. విడుదల తేదీ మాత్రం ఇంకా సస్పెన్స్ లో ఉంచారు. ఈ ఏడాదిలో నవంబర్ మినహాయిస్తే ఇంకొక్క నెల బ్యాలన్స్ ఉంది కాబట్టి 2025లోనే ఘాటీ థియేటర్లలో అడుగు పెడుతుంది. హరిహర వీరమల్లు నుంచి తప్పుకుని ఈ సినిమా చేసిన దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్టు మీద చాలా కష్టపడ్డాడు. ఎన్టీఆర్ బయోపిక్, కొండపొలం వైఫల్యం, పవన్ సినిమా ఆలస్యం ఇవన్నీ మరిపించేలా హిట్టు కొట్టాలి మరి.
This post was last modified on November 7, 2024 4:50 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…