వరస వైఫల్యాల తర్వాత వరుణ్ తేజ్ ఈ నెల 14న మట్కాతో ప్రేక్షకులను పలరించబోతున్నాడు. కంగువ లాంటి తీవ్రమైన పోటీ ఉన్నా సరే ఖచ్చితంగా మెప్పిస్తామనే నమ్మకంతో నిర్మాతలు సవాల్ కి సై అన్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో వరుణ్ నాలుగు విభిన్న వయసులలో ఒక డాన్ గా ఎలా ఎదిగాడనే క్రమాన్ని చూపించబోతున్నారు. ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. లక్కీ భాస్కర్ తో లక్కీ హీరోయిన్ గా మారిన మీనాక్షి చౌదరితో పాటు అదే సినిమాకు సంగీతం సమకూర్చిన జివి ప్రకాష్ కుమార్ మట్కాకు పని చేయడం పాజిటివ్ సెంటిమెంట్ గా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
దీని సంగతి ఒకే కానీ వరుణ్ తేజ్ మట్కా తర్వాత ఎవరితో చేస్తాడనే దానికి సమాధానం దాదాపు దొరికినట్టే. దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ఈ కాంబో ఉంటుందని గతంలో లీక్ వచ్చింది కానీ ఫైనల్ వెర్షన్ సంతృప్తికరంగా రావడంతో ప్రాజెక్టు లాక్ చేసుకున్నారని తాజా వార్త. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో హారర్, కామెడీ రెండు మిక్స్ చేసిన వెరైటీ సబ్జెక్టుని సిద్ధం చేశారట. కెరీర్ లో తొలి రెండు సినిమాలు వేంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా తర్వాత మేర్లపాక గాంధీకి సక్సెస్ లేదు. కృష్ణార్జున యుద్ధం, మాస్ట్రో, లైక్ షేర్ సబ్స్క్రైబ్ నిరాశపరిచాయి. ఏక్ మినీ కథ ఓటిటిలో హిట్టయ్యింది.
అయినా సరే గాంధీకి వరుణ్ తేజ్ ఆఫర్ ఇచ్చాడంటే స్టోరీ ఏదో బాగా వచ్చినట్టు ఉంది. మట్కా నుంచి బౌన్స్ బ్యాక్ అవుతానని మెగా ప్రిన్స్ బలంగా నమ్ముతున్నాడు. ముఖ్యంగా గద్దలకొండ గణేష్ తో దగ్గరైన మాస్ తర్వాత తాను చేసిన ప్రయోగాల వల్ల దూరమయ్యారని భావించి మట్కాని ఒప్పుకున్నాడు. దీనికి ముందు కరుణ కుమార్ సైతం ఫ్లాపులతో సతమతమవుతున్నవాడే. ఇప్పుడిది హిట్ అయితే తిరిగి హీరో, దర్శకుడు ఇద్దరూ పుంజుకోవచ్చు. లావణ్య త్రిపాఠిని పెళ్లాడాక మొగుడు పోస్టుని తెచ్చుకున్న వరుణ్ తేజ్ మట్కాతో విజయం సాధిస్తే భార్య వచ్చాక కొత్తగా లక్కు కూడా తోడైనట్టు అనుకోవాలి.
This post was last modified on November 7, 2024 11:45 am
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…