ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ స్టార్లు లేని, బడ్జెట్ పెద్దగా ఖర్చు పెట్టని సినిమాల్లో నటించినప్పుడు గుర్తింపు, ఫేమ్ రెండు నెమ్మదిగా వస్తాయి. ఇప్పుడు నయన్ సారిక ఈ కోవలోకే చేరుతోంది. ఇటీవల కిరణ్ అబ్బవరం ‘క’లో మెప్పించింది ఈ బ్యూటీనే. పల్లెటూరిలో జరిగే క్రైమ్ థ్రిల్లరే అయినప్పటికీ దర్శకులు సుజిత్ – సందీప్ చేసిన పాత్ర డిజైన్ వల్ల నయన్ సారికకు మంచి గుర్తింపుతో పాటు చక్కని పాటలు పడ్డాయి. ఫ్లాపులతో సతమతమవుతున్న కిరణ్ అబ్బవరం సూపర్ హిట్లో భాగం పంచుకుంది.
కొన్ని నెలల క్రితం వెనక్కు ‘ఆయ్’లో నితిన్ నార్నె సరసన మురిపించింది కూడా ఈ నయన్ సారికే. మ్యాడ్ తో వచ్చిన గుర్తింపుని ఈ కుర్రాడు స్టాండర్డ్ చేసుకుంది ఆయ్ తోనే. అగ్ర కులానికి చెందిన చలాకి అమ్మాయి పల్లవిగా అందులో నయన్ చూపించిన పెర్ఫార్మన్స్ ప్రశంసలు దక్కించుకుంది. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ల దెబ్బకు అమ్మడికి మీడియం నిర్మాతల నుంచి వరస కాల్స్ వస్తున్నాయట. నిజానికి దీనికన్నా ముందు తను ఆనంద్ దేవరకొండ ‘గంగం గణేశా’లో చేసింది. అదే డెబ్యూ. కానీ ఫ్లాప్ కావడంతో పాటు అందులో ప్రాధాన్యత ఏమంత లేకపోవడంతో ఆడియన్స్ అంతగా పట్టించుకోలేదు.
ఇప్పుడు ఆయ్, క అంటూ చిన్న అక్షరాలా టైటిల్స్ పెట్టుకున్న సినిమాలతో నయన్ సారిక అందుకుంటున్న హిట్లు చూస్తే మెల్లగా సెటిలైపోయేలా ఉంది. హైదరాబాద్ కే చెందిన ఈ తెలుగమ్మాయి ఇన్స్ టాలో మూడు లక్షలకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ఫేమ్ పుణ్యమాని ఆ నెంబర్ అంతకంత పెరుగుతోంది. బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ లోనూ నటించిన నయన్ ఇకపై సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్లను తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో నయన్ సారిక లాంటి వాళ్లకు మరిన్ని ఆవకాశాలు దక్కితే స్టార్లతో జోడీకట్టే రోజులు ఎంతో దూరంలో లేవు.
ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార కూటమి, విపక్ష వైసీపీ మధ్య నిత్యం వాగ్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి…
యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తిరిగి ప్రబలుతోందా? అంటే... ఇతర ప్రాంతాల గురించి అటుంచితే... ఏపీ విషయంలో మాత్రం నిజమేనేమోననే…
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…