మొన్న వెంకటేష్ 76 సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో పాటు సంక్రాంతి విడుదలని ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం నిర్మిస్తున్న దిల్ రాజు బ్యానర్ నుంచే వస్తున్న గేమ్ ఛేంజర్ కోసం విశ్వంభరని వాయిదా వేసుకున్నప్పుడు వెంకీకి ఆ సూత్రం వర్తించదా అంటూ మెగా ఫ్యాన్స్ నుంచి ఎదురవుతున్న ప్రశ్న. టైటిల్ లోనే పండగను పెట్టుకుని వేరే సీజన్ కు వస్తే భావ్యం కాదనేది దర్శకుడు అనిల్ రావిపూడి వెర్షనట. అసలు ఈ సీజన్ లో ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతోనే ఆ పేరు పెట్టి ఉంటారనే కామెంట్స్ కూడా లేకపోలేదు. దేన్నీ కొట్టిపారేయలేని పరిస్థితి నెలకొంది.
అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఒకటే. చిరంజీవి రిక్వెస్ట్ చేసి వాయిదా వేయించినప్పుడు తమ బ్యానర్ హీరో వెంకటేష్ ని ఎందుకు అడగలేకపోయారని. కానీ ఇక్కడ కొన్ని విషయాలున్నాయి. వెంకీ-రావిపూడి ప్రాజెక్టు అనౌన్స్ చేసిన టైంలోనే సంక్రాంతికి విడుదలని స్పష్టంగా ప్రీ లుక్ పోస్టర్స్ లో చెప్పారు. ఆ సమయానికి గేమ్ ఛేంజర్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. డిసెంబర్ లో వస్తుందనే ప్రచారమే జరిగింది. దిల్ రాజు కూడా క్రిస్మస్ కానుకంటూ చెప్పుకుంటూ వచ్చారు. హఠాత్తుగా నిర్ణయం మార్చుకుని జనవరి 10కి వెళ్లిపోవడంతో అదే స్లాట్ ని ప్లాన్ చేసుకున్న సంక్రాంతికి వస్తున్నాంకి చిక్కొచ్చి పడింది.
నిజానికి విశ్వంభర బ్యాలన్స్ కి జనవరి 10 విడుదల సాధ్యం కాదు కాబట్టే గేమ్ చేంజర్ కి ఆ తేదీ ఇవ్వడం సులువయ్యిందనే వెర్షన్ మరొకటి ఉంది. ఏది ఏమైనా రామ్ చరణ్, వెంకటేష్ లకు వీలైనన్ని థియేటర్లు వచ్చేలా చేయడంలో దిల్ రాజు పెద్ద ప్లానింగే చేయాల్సి ఉంటుంది. వీటికి తోడు బాలయ్య 109, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ పోటీని తట్టుకోవాలి. సంక్రాంతికి వస్తున్నాం కనక కొంచెం వాయిదా పడి ఉంటే బాగుండేది కానీ ఆ ఛాన్స్ లేనందువల్లే ఇప్పుడీ ఇరకాటం పడింది. ట్విస్ట్ ఏంటంటే గతంలో ఏఎన్ఆర్ కృష్ణల ఊరంతా సంక్రాంతి (1983), వెంకటేష్ సంక్రాంతి (2005) రెండూ ఫిబ్రవరిలో రిలీజయ్యాయి.
This post was last modified on November 2, 2024 2:50 pm
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…