మొన్న వెంకటేష్ 76 సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో పాటు సంక్రాంతి విడుదలని ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం నిర్మిస్తున్న దిల్ రాజు బ్యానర్ నుంచే వస్తున్న గేమ్ ఛేంజర్ కోసం విశ్వంభరని వాయిదా వేసుకున్నప్పుడు వెంకీకి ఆ సూత్రం వర్తించదా అంటూ మెగా ఫ్యాన్స్ నుంచి ఎదురవుతున్న ప్రశ్న. టైటిల్ లోనే పండగను పెట్టుకుని వేరే సీజన్ కు వస్తే భావ్యం కాదనేది దర్శకుడు అనిల్ రావిపూడి వెర్షనట. అసలు ఈ సీజన్ లో ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతోనే ఆ పేరు పెట్టి ఉంటారనే కామెంట్స్ కూడా లేకపోలేదు. దేన్నీ కొట్టిపారేయలేని పరిస్థితి నెలకొంది.
అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఒకటే. చిరంజీవి రిక్వెస్ట్ చేసి వాయిదా వేయించినప్పుడు తమ బ్యానర్ హీరో వెంకటేష్ ని ఎందుకు అడగలేకపోయారని. కానీ ఇక్కడ కొన్ని విషయాలున్నాయి. వెంకీ-రావిపూడి ప్రాజెక్టు అనౌన్స్ చేసిన టైంలోనే సంక్రాంతికి విడుదలని స్పష్టంగా ప్రీ లుక్ పోస్టర్స్ లో చెప్పారు. ఆ సమయానికి గేమ్ ఛేంజర్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. డిసెంబర్ లో వస్తుందనే ప్రచారమే జరిగింది. దిల్ రాజు కూడా క్రిస్మస్ కానుకంటూ చెప్పుకుంటూ వచ్చారు. హఠాత్తుగా నిర్ణయం మార్చుకుని జనవరి 10కి వెళ్లిపోవడంతో అదే స్లాట్ ని ప్లాన్ చేసుకున్న సంక్రాంతికి వస్తున్నాంకి చిక్కొచ్చి పడింది.
నిజానికి విశ్వంభర బ్యాలన్స్ కి జనవరి 10 విడుదల సాధ్యం కాదు కాబట్టే గేమ్ చేంజర్ కి ఆ తేదీ ఇవ్వడం సులువయ్యిందనే వెర్షన్ మరొకటి ఉంది. ఏది ఏమైనా రామ్ చరణ్, వెంకటేష్ లకు వీలైనన్ని థియేటర్లు వచ్చేలా చేయడంలో దిల్ రాజు పెద్ద ప్లానింగే చేయాల్సి ఉంటుంది. వీటికి తోడు బాలయ్య 109, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ పోటీని తట్టుకోవాలి. సంక్రాంతికి వస్తున్నాం కనక కొంచెం వాయిదా పడి ఉంటే బాగుండేది కానీ ఆ ఛాన్స్ లేనందువల్లే ఇప్పుడీ ఇరకాటం పడింది. ట్విస్ట్ ఏంటంటే గతంలో ఏఎన్ఆర్ కృష్ణల ఊరంతా సంక్రాంతి (1983), వెంకటేష్ సంక్రాంతి (2005) రెండూ ఫిబ్రవరిలో రిలీజయ్యాయి.
This post was last modified on November 2, 2024 2:50 pm
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…