ఒకప్పుడు కొత్త సినిమా అంటే థియేటర్లలో మాత్రమే రిలీజయ్యేది. కానీ ఇప్పుడు నేరుగా మన ఇంట్లోని టీవీలో విడుదలైపోతోంది. ఈ విప్లవానికి కారణం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్. ఇంతకుముందు ఇవి కొత్త సినిమాలు రిలీజైన నెల నుంచి రెండు మూడు నెలల మధ్య కొత్త సినిమాలను విడుదల చేసేవి. కానీ కరోనా ధాటికి థియేటర్లు మూతపడ్డ గత ఆరేడు నెలల్లో కొత్త సినిమాలను నేరుగా రిలీజ్ చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. ఈ క్రమంలో వీటికి అనూహ్యమైన ఆదరణ లభించింది. సబ్స్క్రైబర్లు భారీగా పెరిగారు.
ఆహా లాంటి లోకల్ యాప్ సైతం సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ క్రమంలో ఇండియాలో అత్యధికంగా ఆదరణ పొందుతున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఏది.. దేనికి అధిక స్థాయిలో సబ్స్క్రైబర్లు ఉన్నారు.. వీటిలో ఏది నంబర్ వన్ అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం.
ఒక బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ ట్విట్టర్ ద్వారా ఈ విషయమై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆయన సమాచారం ప్రకారం ఇండియాలో నంబర్వన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్.. డిస్నీ+హాట్స్టార్. ఆ సంస్థకు ఇండియాలో ప్రస్తుతం 2.05 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ముందు నుంచి ఎక్స్క్లూజివ్ స్పోర్స్స్ కంటెంట్తో భారీగా ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ సంస్థ.. గత కొన్ని నెలల్లో పెద్ద ఎత్తున కొత్త కంటెంట్ పెంచి సబ్స్క్రైబర్లను పెంచుకుంది. ప్రస్తుతం నడుస్తున్న ఐపీఎల్తో దీనికి ఆదరణ ఇంకా పెరిగింది.
ఇక ఇండియన్ ఫిలిం, వెబ్ కంటెంట్ను గత కొన్నేళ్లలో భారీగా పెంచిన అమేజాన్ ప్రైమ్.. 82 లక్షల మంది సబ్స్క్రైబర్లతో రెండో స్థానంలో ఉంది. హిందీ సినిమాలు, సీరియళ్లతో పాటు లోకల్ కంటెంట్ బాగా అందుబాటులోకి తెచ్చిన జీ5 49 లక్షల సబ్స్క్రిప్షన్లతో మూడో స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో ఏక్తా కపూర్కు చెందిన ఏఎల్టీ బాలాజీ సంస్థ ఉండటం విశేషం. దాని సబ్స్క్రైబర్లు 40 లక్షలు. ఇక ఇంటర్నేషనల్ కంటెంట్ను భారీ స్థాయిలో అందిస్తూ ప్రపంచంలోనే నంబర్ వన్ ఓటీటీ ఫ్లాట్ఫామ్గా ఉన్న నెట్ఫ్లిక్స్కు ఇండియాలో ఐదో స్థానానికి పరిమితమైంది. దాని సబ్స్క్రైబర్ల సంఖ్య 31 లక్షలట. దాని సబ్స్క్రిప్షన్ ధర ఎక్కువుండటం, లోకల్ కంటెంట్ తక్కువుండటం ఇందుక్కారణం కావచ్చు.
This post was last modified on October 3, 2020 10:41 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…