ఓటీటీల్లో కొత్త సినిమాలు రిలీజవుతున్న ఉత్సాహం బాగానే ఉంది కానీ.. వాటిలో ప్రేక్షకులను మెప్పిస్తున్నవి చాలా తక్కువ. అందులోనూ ఇండియాలో మంచి ఆదరణ ఉన్న ఓటీటీల్లో ఒకటైన అమేజాన్ ప్రైమ్లోకి వస్తున్న కొత్త సినిమాలైతే తీవ్ర నిరాశను మిగులుస్తున్నాయి. అత్యంత దూకుడుగా, అత్యధిక పెట్టుబడి పెట్టి కొత్త సినిమాలను ఈ సంస్థ కొంటోంది కానీ.. అవేవీ ఆశించిన ఫలితాన్నందుకోవట్లేదు.
లాక్ డౌన్ మొదలయ్యాక ఈ సంస్థ రెండంకెల సంఖ్యలో కొత్త చిత్రాలు విడుదల చేసింది. కానీ అందులో ఒక్కటి కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోలేదు. దీంతో ప్రైమ్ను కేరాఫ్ డిజాస్టర్స్ అంటూ ఎద్దేవా చేసేవాళ్లు కొందరైతే.. అంతంత రేటు పెట్టి సినిమాలు కొని ఈ సంస్థ అన్యాయం అయిపోతోందే అని సానుభూతి వ్యక్తం చేసేవాళ్లు కొందరు.
థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీల్లో కొత్త సినిమాలు రిలీజ్ చేయడం అన్న ఆలోచనే ఇంతకుముందు ఉండేది కాదు. విడుదల తర్వాత నెలా నెలన్నరకు కొత్త సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేసేవాళ్లు. ఇండియాలో ఈ విషయంలో బాగా దూకుడు చూపించి పెద్ద ఎత్తున కొత్త సినిమాలను దక్కించుకుంది ప్రైమ్. ఈ క్రమంలోనే ఆ సంస్థకు భారీగా సబ్స్క్రైబర్లు సమకూరారు. వీళ్లను ఎంగేజ్ చేయడం కోసం కరోనా టైంలో కొత్త సినిమాలను మంచి రేటు పెట్టి కొని నేరుగా రిలీజ్ చేయడం మొదలుపెట్టింది ప్రైమ్.
ఈ క్రమంలోనే హిందీలో అమితాబ్ బచ్చన్-ఆయుష్మాన్ ఖురానాల ‘గులాబో సితాబో’తో పాటు ‘శకుంతలా దేవి’.. బహుభాషా చిత్రం ‘పెంగ్విన్’, తమిళ సినిమా ‘పొన్ మగల్ వందాల్’.. మలయాళ చిత్రం ‘సుజాతయుం సూఫియుం’ లాంటి సినిమాలను వరుసబెట్టి రిలీజ్ చేసింది ప్రైమ్.
కానీ అవేవీ కూడా ప్రేక్షకుల నుంచి పూర్తి ఆమోదం పొందలేకపోయాయి. ఉన్నంతలో ‘శకుంతలా దేవి’ కొంచెం బెటర్. మిగతావన్నీ తేలిపోయాయి. గత నెలలో తెలుగు నుంచి ‘వి’ లాంటి పెద్ద సినిమా ప్రైమ్లోకి వచ్చింది. దానికి పూర్తి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు మరో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘నిశ్శబ్దం’ను మూడు భాషల్లో రిలీజ్ చేసింది ప్రైమ్. అన్ని చోట్లా ఫీడ్ బ్యాక్ ఏమీ బాగాలేదు. ఈ క్రమంలోనే అమేజాన్ వాళ్లు ఏరి కోరి డిజాస్టర్లను కొంటున్నారంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. అలాగే ఆ సంస్థ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on October 2, 2020 4:11 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…