ఓటీటీల్లో కొత్త సినిమాలు రిలీజవుతున్న ఉత్సాహం బాగానే ఉంది కానీ.. వాటిలో ప్రేక్షకులను మెప్పిస్తున్నవి చాలా తక్కువ. అందులోనూ ఇండియాలో మంచి ఆదరణ ఉన్న ఓటీటీల్లో ఒకటైన అమేజాన్ ప్రైమ్లోకి వస్తున్న కొత్త సినిమాలైతే తీవ్ర నిరాశను మిగులుస్తున్నాయి. అత్యంత దూకుడుగా, అత్యధిక పెట్టుబడి పెట్టి కొత్త సినిమాలను ఈ సంస్థ కొంటోంది కానీ.. అవేవీ ఆశించిన ఫలితాన్నందుకోవట్లేదు.
లాక్ డౌన్ మొదలయ్యాక ఈ సంస్థ రెండంకెల సంఖ్యలో కొత్త చిత్రాలు విడుదల చేసింది. కానీ అందులో ఒక్కటి కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోలేదు. దీంతో ప్రైమ్ను కేరాఫ్ డిజాస్టర్స్ అంటూ ఎద్దేవా చేసేవాళ్లు కొందరైతే.. అంతంత రేటు పెట్టి సినిమాలు కొని ఈ సంస్థ అన్యాయం అయిపోతోందే అని సానుభూతి వ్యక్తం చేసేవాళ్లు కొందరు.
థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీల్లో కొత్త సినిమాలు రిలీజ్ చేయడం అన్న ఆలోచనే ఇంతకుముందు ఉండేది కాదు. విడుదల తర్వాత నెలా నెలన్నరకు కొత్త సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేసేవాళ్లు. ఇండియాలో ఈ విషయంలో బాగా దూకుడు చూపించి పెద్ద ఎత్తున కొత్త సినిమాలను దక్కించుకుంది ప్రైమ్. ఈ క్రమంలోనే ఆ సంస్థకు భారీగా సబ్స్క్రైబర్లు సమకూరారు. వీళ్లను ఎంగేజ్ చేయడం కోసం కరోనా టైంలో కొత్త సినిమాలను మంచి రేటు పెట్టి కొని నేరుగా రిలీజ్ చేయడం మొదలుపెట్టింది ప్రైమ్.
ఈ క్రమంలోనే హిందీలో అమితాబ్ బచ్చన్-ఆయుష్మాన్ ఖురానాల ‘గులాబో సితాబో’తో పాటు ‘శకుంతలా దేవి’.. బహుభాషా చిత్రం ‘పెంగ్విన్’, తమిళ సినిమా ‘పొన్ మగల్ వందాల్’.. మలయాళ చిత్రం ‘సుజాతయుం సూఫియుం’ లాంటి సినిమాలను వరుసబెట్టి రిలీజ్ చేసింది ప్రైమ్.
కానీ అవేవీ కూడా ప్రేక్షకుల నుంచి పూర్తి ఆమోదం పొందలేకపోయాయి. ఉన్నంతలో ‘శకుంతలా దేవి’ కొంచెం బెటర్. మిగతావన్నీ తేలిపోయాయి. గత నెలలో తెలుగు నుంచి ‘వి’ లాంటి పెద్ద సినిమా ప్రైమ్లోకి వచ్చింది. దానికి పూర్తి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు మరో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘నిశ్శబ్దం’ను మూడు భాషల్లో రిలీజ్ చేసింది ప్రైమ్. అన్ని చోట్లా ఫీడ్ బ్యాక్ ఏమీ బాగాలేదు. ఈ క్రమంలోనే అమేజాన్ వాళ్లు ఏరి కోరి డిజాస్టర్లను కొంటున్నారంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. అలాగే ఆ సంస్థ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…