ఇండియన్ సినీ సెలబ్రిటీల జీవితాలను, కెరీర్లను డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించి క్యాష్ చేసుకునే పనిలో నెట్ ఫ్లిక్స్ బిజీగా ఉంది. ఆ మధ్య రాజమౌళిది విపరీతమైన అంచనాల మధ్య స్ట్రీమింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. స్పందన బాగానే వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో అద్భుతాలు చేయలేకపోయింది. ఇప్పుడు నయనతార వంతు వచ్చింది. బియాండ్ ది ఫెయిరీ టైల్ పేరుతో నవంబర్ 18న ఒక స్పెషల్ ఎపిసోడ్ ని విడుదల చేయనుంది. అభిమానులకే కాదు సగటు ప్రేక్షకులకూ దీని మీద విపరీతమైన ఆసక్తి కలిగే అవకాశాలు బోలెడున్నాయి. అదెలాగో చూద్దాం.
నయనతార ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. 2003లో మల్లువుడ్ ల్లో ఎంట్రీ జరిగాక తొలి బ్రేక్ చంద్రముఖి రూపంలో దక్కింది. గజిని నుంచి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. తెలుగులోనూ లక్ష్మి, దుబాయ్ శీను, తులసి లాంటి సూపర్ హిట్స్ ఎన్నో పడ్డాయి. మాములుగా ఇరవై సంవత్సరాల తర్వాత అంటే ఏ హీరోయిన్ అయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోతుంది. కానీ నయన్ ఇప్పటికీ టాప్ డిమాండ్ లో ఉంది. గతంలో శింబు, ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారాలకు సంబంధించి బోలెడు కథనాలు వచ్చాయి. వాటి గురించి ఈ ఫెయిరీ టైల్ లో ఏమైనా చెబుతారేమో చూడాలి.
కోట్ల పారితోషికం తీసుకున్నా తాను నటించే సినిమా ప్రమోషన్లకు అరిచి గీ పెట్టినా రాదని నయనతార మీద ఎప్పటి నుంచో కామెంట్స్ ఉన్నాయి. అవి నిజం కూడా. దానికి సరైన కారణమేంటో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విగ్నేష్ శివన్ తో ప్రేమకథ, అటుపై పెళ్ళికి దారి తీసిన పరిణామాలు, సరోగసి పిల్లలు ఇలా పంచుకునే విషయాలు బోలెడు ఉంటాయి. మరి ఏ మేరకు నిజాలు ఉంటాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్. గతంలో సన్నీ లియోన్ మీద ఏకంగా వెబ్ సిరీస్ వచ్చింది కానీ ఇప్పుడు నయనతారది కేవలం సింగల్ డాక్యుమెంటరీ మాత్రమే. ఏమేం చెబుతారో లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on October 30, 2024 12:31 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…