వంద రోజులకు పైగా కారాగారంలో మగ్గుతున్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. ఆరోగ్యపరమైన కారణాలు చూపిస్తూ సర్జరి అవసరమని లాయర్ అభ్యర్థించడంతో ఆరు వారాల ఇంటెరిమ్ బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఎస్ విశ్వజిత్ శెట్టి దర్శన్ కుటుంబానికి, అనుచరులకు రిలీఫ్ ఇచ్చారు. స్వంత అభిమాని రేణుక స్వామిని దారుణంగా చిత్ర హింసకు గురి చేసి హత్య చేసిన కేసులో ఈ హీరో మీద తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. బలమైన సాక్ష్యాలు పోలీసులు సేకరించారు. నిందితుల్లో ఏ1గా ఉన్న దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడ ప్రోత్సాహంతోనే ఇది జరిగిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ దర్శన్ కు బెయిల్ రావడం ఆలస్యం నిమిషాల వ్యవధిలో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా మొదలుపెట్టారు. బాజ్ ఈజ్ బ్యాక్ అంటూ అప్పుడే ట్రెండింగ్ చేస్తున్నారు. నిజానికి అతను నిర్దోషని రుజువు కాలేదు. కేవలం షరతులతో కూడిన బెయిలు వచ్చిందంతే. గడువు ముగిశాక మళ్ళీ జైలుకు వెళ్ళాలి. నేరం నిజమని తేలితే కఠినమైన శిక్ష పడుతుంది. ఇదంతా మర్చిపోయి ఏదో ఘనకార్యం చేసి వచ్చినట్టు అభిమానులు సెలెబ్రేట్ చేసుకోవడం గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. చంపింది తమ సాటివాడినేనని గుర్తించలేని అమాయకత్వాన్ని ఏమనాలి.
ఇంకా దర్శన్ దోషిగా నిర్ధారణ కాకపోయినా జరిగిన దాంట్లో భాగం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు స్వాతిముత్యం రేంజ్ లో ఫ్యాన్స్ బిల్డప్ ఇవ్వడం మారుతున్న సామజిక ధోరణికి అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్విస్ట్ ఏంటంటే దర్శన్ జైల్లో ఉన్నప్పుడు కొన్ని పాత సినిమాలు రీ రిలీజ్ చేస్తే వాటిని మంచి వసూళ్లు వచ్చాయి. త్వరలో క్రాంతివీర సంగోళి రాయణ్ణ (2012) భారీ ఎత్తున పునఃవిడుదల చేయబోతున్నారు. కాకపోతే ఆగిపోయిన డెవిల్ షూటింగ్ ని కొనసాగించడానికీ మాత్రం దర్శన్ కు అనుమతి లేదు. కేవలం ఆపరేషన్ కారణం చూపించారు కాబట్టి అది మాత్రమే పూర్తి చేసుకోవాలి.
This post was last modified on October 30, 2024 12:27 pm
జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. కొన్నాళ్ల కిందట ముక్కుకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో…
రెండేళ్ల క్రితం 'ప్రేమలు' విడుదలైనప్పుడు అందులో హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది మమిత బైజుకే. హుషారైన నటన, జెన్ జీని…
సినీ రంగంలో తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ల మీద కొందరు ఎంతో అభిమానం, కృతజ్ఞత చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో…
చిన్న సినిమాలకు రిలీజ్ రోజు కంటే ఒకటి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే పెద్ద…
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు.…
ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…