దీపావళి పండగ ముందు రోజు బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్ వార్ జరగనుంది. విడుదల తేదీ రేపే అయినప్పటికీ ముందు రోజు సాయంత్రం నుంచే రెండు సినిమాలు పోటాపోటీ ప్రీమియర్లకు సిద్ధపడటం ఇటు మీడియా అటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని పెంచుతోంది. దుల్కర్ సల్మాన్ తన మార్కెట్ తెలుగులో విస్తరించుకునే ఉద్దేశంతో చాలా సమయం వెచ్చింది లక్కీ భాస్కర్ చేశాడు. ధనుష్ తో హిట్ కొట్టాక దర్శకుడు వెంకీ అట్లూరి సైతం ఎక్కువ సమయం వెచ్చించి పూర్తి చేశాడు. ఈ కాంబో మీద నమ్మకంతోనే సితార సంస్థ నాగవంశీ అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెటే ఖర్చు పెట్టినట్టు ట్రైలర్ లో కనిపించింది.
రిట్రో సెటప్, మీనాక్షి చౌదరి, జివి ప్రకాష్ కుమార్ సంగీతం లాంటి అట్రాక్షన్లు బోలెడున్నాయి. సాయంత్రం 7 నుంచే షోలు మొదలు కాబోతున్నాయి. ఇక ‘క’ది ఇంచుమించు ఇదే పరిస్థితి. కిరణ్ అబ్బవరం మీద ఏకంగా పదిహేను కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు. అంత బిజినెస్ జరిగినా జరగకపోయినా హక్కుల ద్వారానే మొత్తం రికవర్ అవుతుందనే నమ్మకం మేకర్స్ లో ఉంది. ప్రమోషన్లు, నాగ చైతన్య అతిధిగా ఈవెంట్, ట్రైలర్ ఇవన్నీ హైప్ తీసుకొచ్చేందుకు దోహదపడ్డాయి. అయితే మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ మరీ జోరుగా లేవు. టాక్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇవాళ షోలు కీలకం.
క, లక్కీ భాస్కర్ రెండు సినిమాలకు ఒక సారూప్యత ఉంది. ఇవి వర్తమానంలో జరిగే కథలు కాదు. పీరియాడిక్ డ్రామాలు. ఇద్దరు దర్శకులు ఎనభై, తొంభై దశకాన్ని తీసుకున్నారు. సో వీటి కాన్సెప్ట్ కనెక్ట్ కావడం చాలా ముఖ్యం. మ్యూజిక్ పరంగా స్పందన కూడా ఒకేలా రావడం గమనార్హం. మంచి పాటలనే ఫీడ్ బ్యాక్ వచ్చింది కానీ ఛార్ట్ బస్టర్స్ కాలేదు. రేపు వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు అమరన్, బఘీరాలు ఉన్నప్పటికీ జనం దృష్టిలో ప్రాధాన్యత పరంగా ముందు వరసలో ఉన్నది కిరణ్, దుల్కర్ లే. మరి ఈ ప్రీమియర్ల వార్ లో ఇద్దరూ సంయుక్త విజేతలుగా నిలవాలని ట్రేడ్ కోరుకుంటోంది. చూడాలి ఏం జరుగుతుందో .
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…