దీపావళి పండగ ముందు రోజు బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్ వార్ జరగనుంది. విడుదల తేదీ రేపే అయినప్పటికీ ముందు రోజు సాయంత్రం నుంచే రెండు సినిమాలు పోటాపోటీ ప్రీమియర్లకు సిద్ధపడటం ఇటు మీడియా అటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని పెంచుతోంది. దుల్కర్ సల్మాన్ తన మార్కెట్ తెలుగులో విస్తరించుకునే ఉద్దేశంతో చాలా సమయం వెచ్చింది లక్కీ భాస్కర్ చేశాడు. ధనుష్ తో హిట్ కొట్టాక దర్శకుడు వెంకీ అట్లూరి సైతం ఎక్కువ సమయం వెచ్చించి పూర్తి చేశాడు. ఈ కాంబో మీద నమ్మకంతోనే సితార సంస్థ నాగవంశీ అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెటే ఖర్చు పెట్టినట్టు ట్రైలర్ లో కనిపించింది.
రిట్రో సెటప్, మీనాక్షి చౌదరి, జివి ప్రకాష్ కుమార్ సంగీతం లాంటి అట్రాక్షన్లు బోలెడున్నాయి. సాయంత్రం 7 నుంచే షోలు మొదలు కాబోతున్నాయి. ఇక ‘క’ది ఇంచుమించు ఇదే పరిస్థితి. కిరణ్ అబ్బవరం మీద ఏకంగా పదిహేను కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు. అంత బిజినెస్ జరిగినా జరగకపోయినా హక్కుల ద్వారానే మొత్తం రికవర్ అవుతుందనే నమ్మకం మేకర్స్ లో ఉంది. ప్రమోషన్లు, నాగ చైతన్య అతిధిగా ఈవెంట్, ట్రైలర్ ఇవన్నీ హైప్ తీసుకొచ్చేందుకు దోహదపడ్డాయి. అయితే మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ మరీ జోరుగా లేవు. టాక్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇవాళ షోలు కీలకం.
క, లక్కీ భాస్కర్ రెండు సినిమాలకు ఒక సారూప్యత ఉంది. ఇవి వర్తమానంలో జరిగే కథలు కాదు. పీరియాడిక్ డ్రామాలు. ఇద్దరు దర్శకులు ఎనభై, తొంభై దశకాన్ని తీసుకున్నారు. సో వీటి కాన్సెప్ట్ కనెక్ట్ కావడం చాలా ముఖ్యం. మ్యూజిక్ పరంగా స్పందన కూడా ఒకేలా రావడం గమనార్హం. మంచి పాటలనే ఫీడ్ బ్యాక్ వచ్చింది కానీ ఛార్ట్ బస్టర్స్ కాలేదు. రేపు వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు అమరన్, బఘీరాలు ఉన్నప్పటికీ జనం దృష్టిలో ప్రాధాన్యత పరంగా ముందు వరసలో ఉన్నది కిరణ్, దుల్కర్ లే. మరి ఈ ప్రీమియర్ల వార్ లో ఇద్దరూ సంయుక్త విజేతలుగా నిలవాలని ట్రేడ్ కోరుకుంటోంది. చూడాలి ఏం జరుగుతుందో .
This post was last modified on October 30, 2024 11:23 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…