Movie News

ట్రోలింగ్ బ్యాచులను కట్టడి చేయాల్సిందే

‘క’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం తనను ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళకు గట్టిగా క్లాస్ తీసుకోవడం ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. తనను టార్గెట్ చేయడమే కాక సినిమాల్లో డైలాగుల రూపంలో సెటైర్లు వేయడం తనను బాధించిందని, అంతగా నేనేం చేశానంటూ ఆవేదన వ్యక్తం చేయడం అభిమానులను కదిలించింది. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరలో ఉన్న ఒక సంస్థ ఆఫీస్ లో ఇదంతా జరుగుతోందని చెప్పడం ఎవరా అనే ప్రశ్నను రేకెత్తించింది. గత ఏడాది రిలీజైన ఒక కన్నడ డబ్బింగ్ చిత్రంలో కిరణ్ మీద కామెంట్ చేసిన ఒక సంభాషణ ఉంది. తను చెప్పింది దాని గురించేనని ఫ్యాన్స్ కామెంట్.

గతంలో మంచు విష్ణు సైతం ఇదే తరహాలో సోషల్ మీడియా ట్రోలింగ్ కు గురవ్వడం పట్ల ఎంత ఇబ్బంది పడ్డాడో చూశాం. అలాని ఊరుకోలేదు. గట్టి పోరాటం చేసి కావాలని దుశ్చర్యకు పాల్పడిన యూట్యూబ్ ఛానల్స్ మీద చర్యలు తీసుకోవడం ద్వారా ఫలితం వచ్చేలా చూసుకున్నాడు. కోర్టుని ఆశ్రయించి ట్రోల్ వీడియోస్ తీయించేలా పోరాడాడు. ఇలా అందరికీ సాధ్యం కాదు. సమయాభావం, ఆర్థిక మద్దతు ఇలా రకరకాల కారణాల వల్ల మౌనంగా ఉంటున్న హీరో హీరోయిన్లే ఎక్కువ. కొందరు వ్యక్తిగత ప్రతిష్ట కోసం పట్టించుకోని దాఖలాలు ఉన్నాయి. ఆచార్య, భోళా శంకర్ టైంలో చిరంజీవికీ ఈ బెడద తప్పలేదు.

చూస్తూ పోనిలే అని వదిలేయడానికి ఇవి చిన్న వ్యవహారాలుగా ఉండటం లేదు. క్రమంగా విస్తరిస్తూ ఒక మాఫియాగా తయారవుతున్నాయి. ఎంతగా అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి ట్రోలింగ్స్ మీదే బ్రతుకుతూ మిలియన్ల వ్యూస్ తో ఆదాయానికి మరిగేంత. నిజంగా తప్పొప్పులను ఎంచడంలో అభ్యంతరం ఉండదు కానీ కేవలం వెటకారం కోసమే సినిమాలని వాడుకోవడం ముమ్మాటికీ తప్పే. ఇకనైనా ఒక్కొక్కరుగా ఈ ట్రోలింగ్ మహమ్మారి మీద గళం విప్పితే క్రమంగా దీన్ని కట్టడి చేయొచ్చు. తాము చేస్తోంది తప్పని ట్రోలర్స్ గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది.

This post was last modified on October 30, 2024 11:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

5 hours ago