బాలీవుడ్లో పెద్ద ఫ్యామిలీకి కోడలిగా వెళ్లిన మలైకా అరోరా.. తర్వాత వైవాహిక బంధానికి తెర దించి ఓ కుర్ర హీరోతో సహజీవనం చేయడం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మలైకా.. ఆ పిల్లలు యుక్త వయసుకు వస్తున్న దశలో అర్బాజ్ నుంచి విడిపోయి, అర్జున్ కపూర్తో రిలేషన్షిప్లోకి వెళ్లింది.
అర్జున్ కంటే 12 ఏళ్లు పెద్దదైన మలైకా.. అతడితో సహజీవనం చేయడం ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. వీళ్లిద్దరి బంధం మీద చాలా విమర్శలు వచ్చినా ఆ జంట పట్టించుకోలేదు. ఇద్దరూ కలిసి ఓ ఇల్లు కొనుక్కుని అందులో కలిసి ఉన్నారు. మొదట్లో తమ బంధాన్ని దాచడానికి ప్రయత్నించిన ఈ జంట.. తర్వాత ఓపెన్ అయిపోయింది. చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. కొన్నేళ్ల రిలేషన్షిప్ తర్వాత వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.
కానీ మధ్యలో ఏమైందో ఏమో.. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. వీళ్లిద్దరూ విడిపోతున్నట్లు, విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ మధ్య అయితే ఇద్దరూ కలిసి కనిపించడం లేదు. మరి అర్జున్, మలైకా నిజంగా విడిపోయారా లేదా అనే విషయంలో స్పష్టత లేకపోయింది. ఇప్పుడు అర్జున్ దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. మలైకా నుంచి విడిపోయినట్లు చెప్పకనే చెప్పేశాడు. తాజాగా ఓ కార్యక్రమం సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి.. మీరు రిలేషన్షిప్లో ఉన్నారా అని అడగ్గా.. “లేదు. నేను సింగిల్గా ఉన్నా. అంతే కాదు చాలా సంతోషంగా కూడా ఉన్నా” అని అర్జున్ బదులిచ్చాడు.
దీంతో మలైకా నుంచి అర్జున్ విడిపోయాడని.. కొత్తగా మరే బంధంలోకి కూడా వెళ్లలేదని కన్ఫమ్ అయింది. ఇదిలా ఉండగా అర్జున్ కెరీర్ ఈ మధ్య ఏమంత బాగా లేదు. హీరోగా వరుసగా డిజాస్టర్లు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడతను విలన్ పాత్ర పోషించిన ‘సింగమ్ అగైన్’ దీపావళి కానుకగా నవంబరు 1న రిలీజవుతుంది.
This post was last modified on October 29, 2024 3:59 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…