చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ‘చెక్’ సినిమా షూటింగ్ నితిన్ ఏనాడో మొదలు పెట్టాడు కానీ దానిపై ఎందుకో అంత ఆసక్తి చూపించలేదు. ‘భీష్మ’ తర్వాత ‘రంగ్ దే’పైనే నితిన్ ఫోకస్ పెట్టాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ‘అంధాధూన్’ రీమేక్ పనులకు నితిన్ సమాయత్తమవుతున్నాడు. ఇంతలో మీడియా ఏలేటి సినిమాను గుర్తు చేసి నితిన్ ఆ సినిమాను అటకెక్కించేసినట్టున్నాడంటూ కథనాలు రాసింది. దాంతో ఆ సినిమా నిర్మాతలు నితిన్పై ఒత్తిడి తెచ్చారు.
తమ సినిమాను పక్కనపెట్టి వేరేది చేస్తే కనుక దీనిని మీడియా పూర్తిగా ‘రైట్ ఆఫ్’ చేసేస్తుందని, తర్వాత ఈ సినిమా న్యూస్లోకి వచ్చినా కానీ అవుట్ డేటెడ్ అనిపిస్తుందని మీడియా రిపోర్టులు చూపించి నితిన్ని కార్నర్ చేసారు. దీంతో సదరు సినిమా టైటిల్ సడన్గా అనౌన్స్ చేసారు.
చెక్ అనే టైటిల్ చాలా కాలంగా మీడియాలో నానుతున్నా కానీ దానినిప్పుడు ఖరారు చేసారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని చెబుతున్నారు కానీ బ్యాలెన్స్ వర్క్ చాలానే వుందట. నితిన్ ఈ సినిమా పూర్తి చేసి కానీ అంధాదూన్ రీమేక్ మొదలు పెట్టే వీల్లేకుండా టైటిల్ అనౌన్స్మెంట్తో అతడిని లాక్ చేసి అలాగే ఈ సినిమా ఆగిపోయిందనే రూమర్లకు కూడా చెక్ పెట్టేసారు.
This post was last modified on October 2, 2020 4:31 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…