చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ‘చెక్’ సినిమా షూటింగ్ నితిన్ ఏనాడో మొదలు పెట్టాడు కానీ దానిపై ఎందుకో అంత ఆసక్తి చూపించలేదు. ‘భీష్మ’ తర్వాత ‘రంగ్ దే’పైనే నితిన్ ఫోకస్ పెట్టాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ‘అంధాధూన్’ రీమేక్ పనులకు నితిన్ సమాయత్తమవుతున్నాడు. ఇంతలో మీడియా ఏలేటి సినిమాను గుర్తు చేసి నితిన్ ఆ సినిమాను అటకెక్కించేసినట్టున్నాడంటూ కథనాలు రాసింది. దాంతో ఆ సినిమా నిర్మాతలు నితిన్పై ఒత్తిడి తెచ్చారు.
తమ సినిమాను పక్కనపెట్టి వేరేది చేస్తే కనుక దీనిని మీడియా పూర్తిగా ‘రైట్ ఆఫ్’ చేసేస్తుందని, తర్వాత ఈ సినిమా న్యూస్లోకి వచ్చినా కానీ అవుట్ డేటెడ్ అనిపిస్తుందని మీడియా రిపోర్టులు చూపించి నితిన్ని కార్నర్ చేసారు. దీంతో సదరు సినిమా టైటిల్ సడన్గా అనౌన్స్ చేసారు.
చెక్ అనే టైటిల్ చాలా కాలంగా మీడియాలో నానుతున్నా కానీ దానినిప్పుడు ఖరారు చేసారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని చెబుతున్నారు కానీ బ్యాలెన్స్ వర్క్ చాలానే వుందట. నితిన్ ఈ సినిమా పూర్తి చేసి కానీ అంధాదూన్ రీమేక్ మొదలు పెట్టే వీల్లేకుండా టైటిల్ అనౌన్స్మెంట్తో అతడిని లాక్ చేసి అలాగే ఈ సినిమా ఆగిపోయిందనే రూమర్లకు కూడా చెక్ పెట్టేసారు.
This post was last modified on October 2, 2020 4:31 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…