Movie News

రేణుదేశాయ్ కోసం ఉపాసన సాయం

ఎన్ని రకాల కామెంట్స్ వచ్చినా కూడా మెగా కాంపౌండ్ లో బాండింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని చెప్పవచ్చు. ఇక రేణుదేశాయ్ కోసం ఇప్పుడు ఉపాసన తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది.

మూగ జీవాల సంరక్షణకు కృషి చేస్తూ రేణుదేశాయ్ స్థాపించిన శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్‌కి సినీ నటుడు రామ్‌చరణ్ భార్య ఉపాసన తన మద్దతు అందించారు. రేణు‌దేశాయ్‌ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

మూగ జీవాల సహాయార్థం ఓ అంబులెన్స్‌ను కొనుగోలు చేసినట్లు రేణు వివరించారు. ఈ ప్రయత్నంలో ఉపాసన తన వంతు విరాళాన్ని అందించారని, రామ్‌చరణ్ పెంపుడు కుక్క రైమీ పేరుతో ఆ సాయం అందిందని రేణు తెలిపారు. “రైమీ, మీ మద్దతుకు ధన్యవాదాలు” అని రేణు పేర్కొంటూ ఉపాసనను ట్యాగ్ చేశారు. తన స్వచ్ఛంద సంస్థ కార్యకలాపాలకు విరాళాలు అందించాలని రేణు‌దేశాయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో విజ్ఞప్తి చేశారు.

ఎవరైనా ప్రతి నెల కనీసం రూ.100 విరాళం ఇస్తే, అది మూగ జీవాల సంరక్షణకు ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు. ఇది పూర్తిగా స్వచ్ఛంద సేవకు సంబంధించినదని, తన వ్యక్తిగత అవసరాల కోసం కాదని స్పష్టం చేశారు.

మూగ జీవాల కోసం చిన్నప్పటి నుంచి తనలో సంతోషంగా ఉన్న కోరికను రేణు‌దేశాయ్ ఇప్పుడు శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ ద్వారా సాకారం చేసుకుంటున్నారు. విరాళాలు అందిస్తే మరిన్ని సేవలు చేయడం వీలవుతుందని, అందరి సహకారం తోడ్పాటుతోనే ఈ ప్రయత్నం విజయవంతమవుతుందని రేణు అభిప్రాయపడ్డారు.

This post was last modified on October 27, 2024 2:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

29 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago