ఎన్ని రకాల కామెంట్స్ వచ్చినా కూడా మెగా కాంపౌండ్ లో బాండింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని చెప్పవచ్చు. ఇక రేణుదేశాయ్ కోసం ఇప్పుడు ఉపాసన తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది.
మూగ జీవాల సంరక్షణకు కృషి చేస్తూ రేణుదేశాయ్ స్థాపించిన శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్కి సినీ నటుడు రామ్చరణ్ భార్య ఉపాసన తన మద్దతు అందించారు. రేణుదేశాయ్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
మూగ జీవాల సహాయార్థం ఓ అంబులెన్స్ను కొనుగోలు చేసినట్లు రేణు వివరించారు. ఈ ప్రయత్నంలో ఉపాసన తన వంతు విరాళాన్ని అందించారని, రామ్చరణ్ పెంపుడు కుక్క రైమీ పేరుతో ఆ సాయం అందిందని రేణు తెలిపారు. “రైమీ, మీ మద్దతుకు ధన్యవాదాలు” అని రేణు పేర్కొంటూ ఉపాసనను ట్యాగ్ చేశారు. తన స్వచ్ఛంద సంస్థ కార్యకలాపాలకు విరాళాలు అందించాలని రేణుదేశాయ్ తన ఇన్స్టాగ్రామ్లో విజ్ఞప్తి చేశారు.
ఎవరైనా ప్రతి నెల కనీసం రూ.100 విరాళం ఇస్తే, అది మూగ జీవాల సంరక్షణకు ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు. ఇది పూర్తిగా స్వచ్ఛంద సేవకు సంబంధించినదని, తన వ్యక్తిగత అవసరాల కోసం కాదని స్పష్టం చేశారు.
మూగ జీవాల కోసం చిన్నప్పటి నుంచి తనలో సంతోషంగా ఉన్న కోరికను రేణుదేశాయ్ ఇప్పుడు శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ ద్వారా సాకారం చేసుకుంటున్నారు. విరాళాలు అందిస్తే మరిన్ని సేవలు చేయడం వీలవుతుందని, అందరి సహకారం తోడ్పాటుతోనే ఈ ప్రయత్నం విజయవంతమవుతుందని రేణు అభిప్రాయపడ్డారు.
This post was last modified on October 27, 2024 2:00 pm
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…