వసూళ్ల పరంగానే కాక రలీజ్ విషయంలోనూ ‘బాహుబలి: ది కంక్లూజన్’ అనేక రికార్డులను బద్దలు కొట్టింది. అప్పటిదాకా ఏ సినిమా రిలీజ్ కానన్ని థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఏకంగా పది వేల థియేటర్లకు పైగానే ఆ చిత్రాన్ని ప్రదర్శించాయి. ‘బాహుబలి’ తర్వాత మరే ఇండియన్ మూవీ కూడా అన్ని థియేటర్లలో రిలీజ్ కాలేదు.
‘ఆర్ఆర్ఆర్’ సైతం ఆ రికార్డును కొట్టలేకపోయింది. ఐతే ఇప్పుడు ‘పుష్ప-2’.. బాహుబలి-2 రికార్డును కొట్టబోతున్నట్లు సమాచారం. ‘బాహుబలి’ లాంటి ఈవెంట్ ఫిలిం కాకపోయినా దీనికి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ వచ్చింది. సీక్వెల్ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజ్ను ఉపయోగించుకుని భారీ ఓపెనింగ్స్ రాబట్టే దిశగా ‘పుష్ప-2’ను భారీగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
‘పుష్ప-2’ వరల్డ్ వైడ్ ఏకంగా 11,500 స్క్రీన్లలో రిలీజ్ కాబోతోందట. అందుటో ఇండియా వరకే 6500 స్క్రీన్లలో విడుదలవుతుంది. విదేశాల్లో 5 వేల స్క్రీన్లలో సినిమా ప్రదర్శితం కానుంది. ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీ కూడా ఈ స్థాయిలో రిలీజ్ కాలేదు. ‘పుష్ప: ది రైజ్’ రిలీజ్కు ముందు దాని మీద పాన్ ఇండియా స్థాయిలో పెద్దగా అంచనాల్లేవు.
తెలుగు వరకు మాత్రమే హైప్ ఉంది. కానీ రిలీజ్ తర్వాత నార్త్ ఇండియన్స్ ఈ సినిమా చూసి ఊగిపోయారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా సినిమా బాగా ఆడింది. దీంతో సీక్వెల్ మీద పాన్ ఇండియా స్థాయిలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
తెలుగు సినిమాలను పెద్దగా పట్టించుకోని పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో కూడా ‘పుష్ప-2’కు మామూలు హైప్ లేదు. ఈ నేపథ్యంలోనే సినిమాను కనీ వినీ ఎరుగని స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబరు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 27, 2024 4:05 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…