వసూళ్ల పరంగానే కాక రలీజ్ విషయంలోనూ ‘బాహుబలి: ది కంక్లూజన్’ అనేక రికార్డులను బద్దలు కొట్టింది. అప్పటిదాకా ఏ సినిమా రిలీజ్ కానన్ని థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఏకంగా పది వేల థియేటర్లకు పైగానే ఆ చిత్రాన్ని ప్రదర్శించాయి. ‘బాహుబలి’ తర్వాత మరే ఇండియన్ మూవీ కూడా అన్ని థియేటర్లలో రిలీజ్ కాలేదు.
‘ఆర్ఆర్ఆర్’ సైతం ఆ రికార్డును కొట్టలేకపోయింది. ఐతే ఇప్పుడు ‘పుష్ప-2’.. బాహుబలి-2 రికార్డును కొట్టబోతున్నట్లు సమాచారం. ‘బాహుబలి’ లాంటి ఈవెంట్ ఫిలిం కాకపోయినా దీనికి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ వచ్చింది. సీక్వెల్ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజ్ను ఉపయోగించుకుని భారీ ఓపెనింగ్స్ రాబట్టే దిశగా ‘పుష్ప-2’ను భారీగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
‘పుష్ప-2’ వరల్డ్ వైడ్ ఏకంగా 11,500 స్క్రీన్లలో రిలీజ్ కాబోతోందట. అందుటో ఇండియా వరకే 6500 స్క్రీన్లలో విడుదలవుతుంది. విదేశాల్లో 5 వేల స్క్రీన్లలో సినిమా ప్రదర్శితం కానుంది. ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీ కూడా ఈ స్థాయిలో రిలీజ్ కాలేదు. ‘పుష్ప: ది రైజ్’ రిలీజ్కు ముందు దాని మీద పాన్ ఇండియా స్థాయిలో పెద్దగా అంచనాల్లేవు.
తెలుగు వరకు మాత్రమే హైప్ ఉంది. కానీ రిలీజ్ తర్వాత నార్త్ ఇండియన్స్ ఈ సినిమా చూసి ఊగిపోయారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా సినిమా బాగా ఆడింది. దీంతో సీక్వెల్ మీద పాన్ ఇండియా స్థాయిలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
తెలుగు సినిమాలను పెద్దగా పట్టించుకోని పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో కూడా ‘పుష్ప-2’కు మామూలు హైప్ లేదు. ఈ నేపథ్యంలోనే సినిమాను కనీ వినీ ఎరుగని స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబరు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 27, 2024 4:05 pm
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…