వసూళ్ల పరంగానే కాక రలీజ్ విషయంలోనూ ‘బాహుబలి: ది కంక్లూజన్’ అనేక రికార్డులను బద్దలు కొట్టింది. అప్పటిదాకా ఏ సినిమా రిలీజ్ కానన్ని థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఏకంగా పది వేల థియేటర్లకు పైగానే ఆ చిత్రాన్ని ప్రదర్శించాయి. ‘బాహుబలి’ తర్వాత మరే ఇండియన్ మూవీ కూడా అన్ని థియేటర్లలో రిలీజ్ కాలేదు.
‘ఆర్ఆర్ఆర్’ సైతం ఆ రికార్డును కొట్టలేకపోయింది. ఐతే ఇప్పుడు ‘పుష్ప-2’.. బాహుబలి-2 రికార్డును కొట్టబోతున్నట్లు సమాచారం. ‘బాహుబలి’ లాంటి ఈవెంట్ ఫిలిం కాకపోయినా దీనికి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ వచ్చింది. సీక్వెల్ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజ్ను ఉపయోగించుకుని భారీ ఓపెనింగ్స్ రాబట్టే దిశగా ‘పుష్ప-2’ను భారీగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
‘పుష్ప-2’ వరల్డ్ వైడ్ ఏకంగా 11,500 స్క్రీన్లలో రిలీజ్ కాబోతోందట. అందుటో ఇండియా వరకే 6500 స్క్రీన్లలో విడుదలవుతుంది. విదేశాల్లో 5 వేల స్క్రీన్లలో సినిమా ప్రదర్శితం కానుంది. ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీ కూడా ఈ స్థాయిలో రిలీజ్ కాలేదు. ‘పుష్ప: ది రైజ్’ రిలీజ్కు ముందు దాని మీద పాన్ ఇండియా స్థాయిలో పెద్దగా అంచనాల్లేవు.
తెలుగు వరకు మాత్రమే హైప్ ఉంది. కానీ రిలీజ్ తర్వాత నార్త్ ఇండియన్స్ ఈ సినిమా చూసి ఊగిపోయారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా సినిమా బాగా ఆడింది. దీంతో సీక్వెల్ మీద పాన్ ఇండియా స్థాయిలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
తెలుగు సినిమాలను పెద్దగా పట్టించుకోని పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో కూడా ‘పుష్ప-2’కు మామూలు హైప్ లేదు. ఈ నేపథ్యంలోనే సినిమాను కనీ వినీ ఎరుగని స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబరు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 27, 2024 4:05 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…