తమిళంలో టాప్ స్టార్లలో ఒకడు సూర్య. తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి. సూర్య తండ్రి శివకుమార్ కూడా నటుడే అయినా ఆయనది చిన్న స్థాయే. ఇలాంటి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి చాలా పెద్ద రేంజికి వెళ్లాడు సూర్య. అన్న బాటలో నటనలోకి అడుగు పెట్టిన కార్తి సైతం స్టార్గా ఎదిగాడు. ఐతే సూర్య సినిమాల్లోకి అడుగు పెట్టే సమయానికి ఆయన కుటుంబానిది సాధారణ జీవనమే. సూర్య వల్లే ఆర్థికంగానే కాక అన్ని రకాలుగా ఆ కుటుంబం స్థాయి పెరిగింది.
ఐతే తాను నటుడిగా స్థిరపడిపోవాలని, హీరోగా ఎదిగిపోవాలని సినిమాల్లోకి రాలేదని అంటున్నాడు సూర్య. తన తల్లి తండ్రికి తెలియకుండా తీసుకున్న బ్యాంక్ లోన్ తీర్చాలన్న లక్ష్యంతోనే తాను సినిమాల్లోకి వచ్చినట్లు సూర్య తాజాగా ఆసక్తికర విషయం వెల్లడించాడు.
“నేను చదువు ముగించిన వెంటనే ఓ గార్మెంట్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. మొదట 15 రోజులకు 750 రూపాయలు జీతంగా ఇచ్చారు. మూడేళ్ల తర్వాత నా జీతం 8 వేలకు పెరిగింది. ఒక రోజు నేను సొంతంగా కంపెనీ పెట్టాలని అనుకున్నా. కానీ నాన్న బాటలో ఇండస్ట్రీలోకి రావాలని మాత్రం అనుకోలేదు. ఐతే ఆ సమయంలో నాన్నకు తెలియకుండా అమ్మ 25 వేల రూపాయల బ్యాంక్ లోన్ తీసుకున్నట్లు నాకు చెప్పింది. ఆ లోన్ ఎలా తీర్చాలా అనుకుంటున్నపుడు ఓ సినిమాలో అవకాశం వచ్చింది. నేను ఇండస్ట్రీలోకి రావాలని, నటుడిగా ఎదగాలని కలలో కూడా అనుకోలేదు. మా అమ్మకు ఆ 25 వేలు ఇచ్చి, నీ లోన్ తీరిపోయింది అని చెప్పడానికి అదే మార్గం అనుకున్నాను. అలా నా కెరీర్ మొదలైంది. ఇప్పుడు సూర్యగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాను” అని సూర్య వెల్లడించాడు. సూర్య కొత్త చిత్రం ‘కంగువ’ వచ్చే నెల 14న పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 25, 2024 7:23 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…