తమిళంలో టాప్ స్టార్లలో ఒకడు సూర్య. తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి. సూర్య తండ్రి శివకుమార్ కూడా నటుడే అయినా ఆయనది చిన్న స్థాయే. ఇలాంటి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి చాలా పెద్ద రేంజికి వెళ్లాడు సూర్య. అన్న బాటలో నటనలోకి అడుగు పెట్టిన కార్తి సైతం స్టార్గా ఎదిగాడు. ఐతే సూర్య సినిమాల్లోకి అడుగు పెట్టే సమయానికి ఆయన కుటుంబానిది సాధారణ జీవనమే. సూర్య వల్లే ఆర్థికంగానే కాక అన్ని రకాలుగా ఆ కుటుంబం స్థాయి పెరిగింది.
ఐతే తాను నటుడిగా స్థిరపడిపోవాలని, హీరోగా ఎదిగిపోవాలని సినిమాల్లోకి రాలేదని అంటున్నాడు సూర్య. తన తల్లి తండ్రికి తెలియకుండా తీసుకున్న బ్యాంక్ లోన్ తీర్చాలన్న లక్ష్యంతోనే తాను సినిమాల్లోకి వచ్చినట్లు సూర్య తాజాగా ఆసక్తికర విషయం వెల్లడించాడు.
“నేను చదువు ముగించిన వెంటనే ఓ గార్మెంట్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. మొదట 15 రోజులకు 750 రూపాయలు జీతంగా ఇచ్చారు. మూడేళ్ల తర్వాత నా జీతం 8 వేలకు పెరిగింది. ఒక రోజు నేను సొంతంగా కంపెనీ పెట్టాలని అనుకున్నా. కానీ నాన్న బాటలో ఇండస్ట్రీలోకి రావాలని మాత్రం అనుకోలేదు. ఐతే ఆ సమయంలో నాన్నకు తెలియకుండా అమ్మ 25 వేల రూపాయల బ్యాంక్ లోన్ తీసుకున్నట్లు నాకు చెప్పింది. ఆ లోన్ ఎలా తీర్చాలా అనుకుంటున్నపుడు ఓ సినిమాలో అవకాశం వచ్చింది. నేను ఇండస్ట్రీలోకి రావాలని, నటుడిగా ఎదగాలని కలలో కూడా అనుకోలేదు. మా అమ్మకు ఆ 25 వేలు ఇచ్చి, నీ లోన్ తీరిపోయింది అని చెప్పడానికి అదే మార్గం అనుకున్నాను. అలా నా కెరీర్ మొదలైంది. ఇప్పుడు సూర్యగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాను” అని సూర్య వెల్లడించాడు. సూర్య కొత్త చిత్రం ‘కంగువ’ వచ్చే నెల 14న పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 25, 2024 7:23 pm
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…