ఊహించినట్టే పుష్ప 2 ది రూల్ విడుదల తేదీ ముందు ప్రకటించిన దానికన్నా ఒక రోజు ముందుకు జరిగి డిసెంబర్ 5 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ వార్త రెండు వారాల క్రితమే మా సైట్ ఎక్స్ క్లూజివ్ గా అందించిన సంగతి తెలిసిందే. ఇవాళ దాన్నే హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ ద్వారా కొత్త పోస్టర్ తో పాటు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చేతిలో సిగార్ పైప్ తో సైడ్ లుక్ తో అల్లు అర్జున్ ఇచ్చిన స్టిల్ ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చేలా ఉంది. దేశవ్యాప్తంగా పుష్ప 2ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న పంపిణీదారులతో కలిసి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం విశేషం.
రిలీజ్ డేట్ విషయంలో డిసెంబర్ 5ని ఫిక్స్ చేయడం ద్వారా మైత్రి మూవీ మేకర్స్ వేసిన ఎత్తుగడ ఓపెనింగ్స్ పరంగా అద్భుత ఫలితాన్ని ఇవ్వడం ఖాయం. గురువారం రిలీజులు పాజిటివ్ టాక్ వచ్చిన ప్యాన్ ఇండియా మూవీస్ కి ఎంత పెద్దగా ఉపయోగపడుతుందో సరిపోదా శనివారం, దేవర లాంటివి నిరూపించిన నేపథ్యంలో పుష్ప 2 వాటిని మించిన ప్రయోజనం అందుకోవడం ఖాయం. బాలీవుడ్ నుంచి ఆరో తేదీ విక్కీ కౌశల్ చావా ఉన్న నేపథ్యంలో బన్నీ ఒక రోజు ముందే బరిలో దిగడం ద్వారా టాక్ నుంచి వచ్చే పూర్తి ప్రయోజనం అందుకునే అవకాశం ఉంటుంది. లాంగ్ వీకెండ్ కలిసి వచ్చే పెద్ద అంశం.
ఇంకో 40 రోజుల్లోనే పుష్ప 2 ఆగమనం ఫిక్స్ అయిపోవడంతో అభిమానుల ఎగ్జైట్ మెంట్, కౌంట్ డౌన్ మొదలైపోయాయి. ఆగస్ట్ లోనే రావాల్సిన ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఫైనల్ గా డిసెంబర్ ను లాక్ చేసుకుంది. క్రిస్మస్ సెలవులకు ఇతర రిలీజులు ఎక్కువగా ఉండటంతో ఆలోగా దొరికే పదిహేను రోజుల అడ్వాంటేజ్ ని వాడుకోవడానికి పుష్పకు అవకాశం దొరికింది. దేవిశ్రీప్రసాద్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్న పుష్ప 2లో మొదటి భాగంలో నటించిన రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, ధనుంజయలతో జగపతిబాబు కూడా తోడవుతున్నారు.
This post was last modified on October 24, 2024 3:19 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…