ఊహించినట్టే పుష్ప 2 ది రూల్ విడుదల తేదీ ముందు ప్రకటించిన దానికన్నా ఒక రోజు ముందుకు జరిగి డిసెంబర్ 5 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ వార్త రెండు వారాల క్రితమే మా సైట్ ఎక్స్ క్లూజివ్ గా అందించిన సంగతి తెలిసిందే. ఇవాళ దాన్నే హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ ద్వారా కొత్త పోస్టర్ తో పాటు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చేతిలో సిగార్ పైప్ తో సైడ్ లుక్ తో అల్లు అర్జున్ ఇచ్చిన స్టిల్ ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చేలా ఉంది. దేశవ్యాప్తంగా పుష్ప 2ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న పంపిణీదారులతో కలిసి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం విశేషం.
రిలీజ్ డేట్ విషయంలో డిసెంబర్ 5ని ఫిక్స్ చేయడం ద్వారా మైత్రి మూవీ మేకర్స్ వేసిన ఎత్తుగడ ఓపెనింగ్స్ పరంగా అద్భుత ఫలితాన్ని ఇవ్వడం ఖాయం. గురువారం రిలీజులు పాజిటివ్ టాక్ వచ్చిన ప్యాన్ ఇండియా మూవీస్ కి ఎంత పెద్దగా ఉపయోగపడుతుందో సరిపోదా శనివారం, దేవర లాంటివి నిరూపించిన నేపథ్యంలో పుష్ప 2 వాటిని మించిన ప్రయోజనం అందుకోవడం ఖాయం. బాలీవుడ్ నుంచి ఆరో తేదీ విక్కీ కౌశల్ చావా ఉన్న నేపథ్యంలో బన్నీ ఒక రోజు ముందే బరిలో దిగడం ద్వారా టాక్ నుంచి వచ్చే పూర్తి ప్రయోజనం అందుకునే అవకాశం ఉంటుంది. లాంగ్ వీకెండ్ కలిసి వచ్చే పెద్ద అంశం.
ఇంకో 40 రోజుల్లోనే పుష్ప 2 ఆగమనం ఫిక్స్ అయిపోవడంతో అభిమానుల ఎగ్జైట్ మెంట్, కౌంట్ డౌన్ మొదలైపోయాయి. ఆగస్ట్ లోనే రావాల్సిన ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఫైనల్ గా డిసెంబర్ ను లాక్ చేసుకుంది. క్రిస్మస్ సెలవులకు ఇతర రిలీజులు ఎక్కువగా ఉండటంతో ఆలోగా దొరికే పదిహేను రోజుల అడ్వాంటేజ్ ని వాడుకోవడానికి పుష్పకు అవకాశం దొరికింది. దేవిశ్రీప్రసాద్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్న పుష్ప 2లో మొదటి భాగంలో నటించిన రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, ధనుంజయలతో జగపతిబాబు కూడా తోడవుతున్నారు.
This post was last modified on October 24, 2024 3:19 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…