పెట్టిన వందల కోట్ల బడ్జెట్ కి, చూపిస్తున్న క్యాస్టింగ్ కి తగ్గ రేంజ్ లో గేమ్ ఛేంజర్ సినిమాకు బజ్ ఇంకా పెరగలేదు. మూడేళ్ళకు పైగా నిర్మాణం, దర్శకుడు శంకర్ మీద ఇండియన్ 2 ఫలితం తాలూకు ప్రభావం, జరగండి పాట మీద వచ్చిన నెగటివిటీ ఇవన్నీ అంచనాల పరంగా ప్లస్ కంటే ఎక్కువ మైనస్ గా పని చేశాయి. వాటిని సరిచేసే పనిలో భాగంగా ఎస్విసి టీమ్ గేర్ మార్చేందుకు సిద్ధమవుతోంది. దీపావళికి రిలీజ్ చేసే టార్గెట్ తో ప్రస్తుతం టీజర్ ఎడిటింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. బిజినెస్ అగ్రిమెంట్లు మొదలుపెట్టే టైం కాబట్టి ట్రేడ్ లో జోష్ రెట్టింపు కావాలంటే దీని పాత్ర చాలా కీలకం.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 150 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ ఆశిస్తున్నారు దిల్ రాజు. అంత రికవరీ కావాలంటే ఎంత సంక్రాంతి అయినా సరే వీలైనంత పోటీ తక్కువగా ఉండాలి. బాలకృష్ణ, వెంకటేష్, అజిత్, సందీప్ కిషన్ ఇలా కాంపిటీషన్ అయితే భారీగా ఉంది కానీ ఎవరు తప్పుకుంటారు ఎవరు ఉంటారనేది తేలడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. రామ్ చరణ్ కొచ్చిన గ్లోబల్ ఇమేజ్ ఓవర్సీస్ మార్కెట్ లో వాడుకోవచ్చు కానీ సగటు మాస్ ఆడియన్స్ ని గేమ్ ఛేంజర్ చేరుకోవాలంటే మాత్రం మాస్ కంటెంట్ ని పబ్లిసిటీలో చూపించాల్సిందే. దానికి బలమైన పునాది టీజర్ తోనే జరగాలి.
ఇది లాంచ్ అయ్యాక ఒక్కసారిగా ప్రమోషన్ల స్పీడ్ పెంచాల్సి ఉంటుంది. ఒకవైపు పుష్ప 2 ది రూల్ ఎలాంటి హడావిడి చేయకపోయినా విపరీతమైన బజ్ తెచ్చేసుకుంది. వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ జరిగిందన్న వార్త దావానలంలా అన్నిచోట్లా కమ్మేసింది. ట్రైలర్ లేకుండానే ఈ స్థాయి రచ్చ చేయడం చూస్తే పుష్ప బ్రాండ్ దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా గేమ్ ఛేంజర్ కూ జరగాలని మెగా ఫ్యాన్స్ కోరిక. జనవరి 10 విడుదలకు ఇంకో 75 రోజులు మాత్రమే సమయముంది. ప్రస్తుతం ఫస్ట్ గేర్ లోనే ఉన్న రామ్ చరణ్ బండి వీలైనంత త్వరగా థర్డ్ గేరుకి వెళ్ళిపోయి స్పీడ్ పెంచాలి.
This post was last modified on %s = human-readable time difference 2:01 pm
తెలుగు ఎంట్రీని సీతారామం రూపంలో ఘనంగా జరుపుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి ఆ తర్వాత హాయ్ నాన్న కూడా…
మాజీ మంత్రి కేటీఆర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు మధ్య ఆస్తి వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. సొంత…
టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత చెబుతున్నా.. వినిపించుకోవడం లేదన్న ఆవేదన సీఎం చంద్రబాబులో కనిపి స్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు కీలక…
గత మూడు సీజన్లలో అన్ స్టాపబుల్ షో కోసం రామ్ చరణ్ వస్తాడేమోనని ఫ్యాన్స్ తెగ ఎదురు చూశారు కానీ…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా సంచలన లేఖ ఒకటి మీడియాకు విడుదల చేశారు. దీనిలో ప్రధానంగా ఆమె…