విడుదల ముంగిట వచ్చిన ట్రైలర్ మీద మిశ్రమ స్పందనతో ‘దేవర’ సినిమా మీద అనేక అనుమానాలు నెలకొన్నాయి. రిలీజ్ ముందు రోజు అర్ధరాత్రి వేసి స్పెషల్ షోల నుంచి కూడా పూర్తి పాజిటివ్ టాక్ రాలేదు. కొందరేమో ఏకంగా కొరటాల శివ ‘ఆచార్య-2’ తీశాడని అన్నారు. డివైడ్ టాక్ చూస్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం నిలబడుతుందో అన్న సందేహాలు కలిగాయి. కానీ ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగానే నిలబడింది.
వీకెండ్లో భారీ వసూళ్లు సాధించింది. తర్వాత కొంచెం వెనుకబడ్డట్లు కనిపించినా.. మళ్లీ దసరా సెలవులు రాగానే పుంజుకుంది. సినిమాకు లాంగ్ రన్ రావడంతో బయ్యర్లందరూ సేఫ్ అయిపోయారు. కొన్ని చోట్ల లాభాలు వచ్చాయి. కొన్ని చోట్ల జస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది. ఓవరాల్గా సినిమా సక్సెస్ ఫుల్ అనిపించుకుంది.
తాజాగా ‘దేవర’ అరుదైన క్లబ్బులోకి అడుగు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద కోట్ల షేర్ రాబట్టిన మూడు చిత్రాల్లో ఒకటిగా మారింది. ఇప్పటిదాకా బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. ప్రభాస్ సినిమాలు సలార్, కల్కి ఘనవిజయం సాధించినప్పటికీ ఏపీలో ఈ మార్కును అందుకోలేకపోయాయి. కానీ ‘దేవర’ మాత్రం ఈ రేర్ ఫీట్ను సాధ్యం చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ను కూడా కలిపితే ఏపీలో రెండు వంద కోట్ల షేర్ సినిమాలు ఉన్న ఏకైక హీరో జూనియన్ ఎన్టీఆర్ నిలిచాడు. కొంచెం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సినిమాతో ఈ ఫీట్ సాధించడం అంటే చిన్న విషయం కాదు.
‘దేవర’ తర్వాత సరైన సినిమాలు పడకపోవడంతో ఇప్పటికీ ఈ చిత్రం థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. తక్కువ స్క్రీన్లలో ఒక మోస్తరు వసూళ్లతో సినిమా నడుస్తోంది. ఓవరాల్గా ‘దేవర’ గ్రాస్ వసూళ్లు రూ.500 కోట్ల మార్కును టచ్ చేసినట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…