ప్రస్తుతం అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య దృష్టంతా తండేల్ మీదే ఉంది. గత కొన్నేళ్లలో వరుసగా డిజాస్టర్లు ఎదుర్కొన్న చైతూ.. తండేల్ మూవీతో బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. మొదలైన దగ్గర్నుంచి చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని ముందు క్రిస్మస్కు రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆలోచన మారింది. సంక్రాంతి రిలీజ్ గురించి గట్టిగానే ఆలోచిస్తున్నారు. త్వరలోనే ప్రకటన రాబోతోంది. ఆ సంగతి తేలేలోపు పెళ్లి పనుల్లో బిజీ అవుతున్నాడు చైతూ.
ఇదిలా ఉంటే చైతూ కొత్త సినిమా తాజాగా ఖరారైనట్లు తెలుస్తోంది. తండేల్ ఒక కొలిక్కి వచ్చేవరకు చైతూ వేరే సినిమా గురించి ఆలోచించలేదు. మొత్తం ఫోకస్ అంతా ఈ మూవీ మీదే పెట్టాడు. వేరే కథలు కూడా వినలేదు. కానీ కొత్తగా కిషోర్ అనే దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పినట్లు సమాచారం.
నిజానికి ఈ కిషోర్ అనే దర్శకుడు రానా దగ్గుబాటికి కథ చెప్పాడట. కానీ ఆ కథకు తనకంటే చైతూ అయితేనే కరెక్ట్ అని తన వద్దకు పంపించాడట రానా. చైతూ కూడా ఈ కథ తనకు సూటవుతుందని భావించాడట. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. రానాకు ఈ కథ నచ్చి ఈ ప్రాజెక్టు కోసం నిర్మాతను కూడా సెట్ చేశాడని.. తాను కూడా ఇందులో భాగస్వామిగా ఉండడానికి ముందుకు వచ్చాడని టాక్. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
తండేల్ తర్వాత చైతూ చేయబోయే సినిమా ఇదేనని తెలుస్తోంది. సమంత నుంచి విడిపోయాక కొంత కాలం సింగిల్గా ఉన్న చైతూ.. ఆపై శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ మొదలుపెట్టాడు. ఇటీవలే ఈ జోడీ నిశ్చితార్థం చేసుకుంది. ప్రస్తుతం పెళ్లి పనులు జరుగుతున్నాయి. కొన్ని రోజుల విరామం తర్వాత చైతూ తిరిగి తండేల్ షూట్కు హాజరవుతాడు. టాకీ పార్ట్ అంతా పూర్తి చేసి డబ్బింగ్ మొదలుపెడతాడు. తండేల్ రిలీజ్ తర్వాతే తన కొత్త చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.
This post was last modified on October 21, 2024 11:22 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…