ప్రస్తుతం అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య దృష్టంతా తండేల్ మీదే ఉంది. గత కొన్నేళ్లలో వరుసగా డిజాస్టర్లు ఎదుర్కొన్న చైతూ.. తండేల్ మూవీతో బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. మొదలైన దగ్గర్నుంచి చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని ముందు క్రిస్మస్కు రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆలోచన మారింది. సంక్రాంతి రిలీజ్ గురించి గట్టిగానే ఆలోచిస్తున్నారు. త్వరలోనే ప్రకటన రాబోతోంది. ఆ సంగతి తేలేలోపు పెళ్లి పనుల్లో బిజీ అవుతున్నాడు చైతూ.
ఇదిలా ఉంటే చైతూ కొత్త సినిమా తాజాగా ఖరారైనట్లు తెలుస్తోంది. తండేల్ ఒక కొలిక్కి వచ్చేవరకు చైతూ వేరే సినిమా గురించి ఆలోచించలేదు. మొత్తం ఫోకస్ అంతా ఈ మూవీ మీదే పెట్టాడు. వేరే కథలు కూడా వినలేదు. కానీ కొత్తగా కిషోర్ అనే దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పినట్లు సమాచారం.
నిజానికి ఈ కిషోర్ అనే దర్శకుడు రానా దగ్గుబాటికి కథ చెప్పాడట. కానీ ఆ కథకు తనకంటే చైతూ అయితేనే కరెక్ట్ అని తన వద్దకు పంపించాడట రానా. చైతూ కూడా ఈ కథ తనకు సూటవుతుందని భావించాడట. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. రానాకు ఈ కథ నచ్చి ఈ ప్రాజెక్టు కోసం నిర్మాతను కూడా సెట్ చేశాడని.. తాను కూడా ఇందులో భాగస్వామిగా ఉండడానికి ముందుకు వచ్చాడని టాక్. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
తండేల్ తర్వాత చైతూ చేయబోయే సినిమా ఇదేనని తెలుస్తోంది. సమంత నుంచి విడిపోయాక కొంత కాలం సింగిల్గా ఉన్న చైతూ.. ఆపై శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ మొదలుపెట్టాడు. ఇటీవలే ఈ జోడీ నిశ్చితార్థం చేసుకుంది. ప్రస్తుతం పెళ్లి పనులు జరుగుతున్నాయి. కొన్ని రోజుల విరామం తర్వాత చైతూ తిరిగి తండేల్ షూట్కు హాజరవుతాడు. టాకీ పార్ట్ అంతా పూర్తి చేసి డబ్బింగ్ మొదలుపెడతాడు. తండేల్ రిలీజ్ తర్వాతే తన కొత్త చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…