Movie News

విశాల్ సినిమా ఓటీటీ రిలీజ్‌కు లైన్ క్లియర్

దక్షిణాదిన పేరున్న హీరోలు చాలామంది ఓటీటీ రిలీజ్ విషయంలో తీవ్ర వ్యతిరేకతతో ఉన్న సమయంలో తన చిత్రాన్ని ఆ మార్గంలో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన హీరోల్లో విశాల్ ఒకడు. తాను హీరోగా స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘చక్ర’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి మూణ్నెల్ల ముందే అతను ఒప్పందం చేసుకున్నాడు.

జీ5 ఆ సినిమా హక్కుల్ని సొంతం చేసుకుంది. ట్రైలర్ కూడా లాంచ్ చేసి ఇక సినిమా విడుదల దగ్గర పడిందన్న సంకేతాలు కూడా ఇచ్చాడు విశాల్. కానీ ఇంతలో అతడికి అనుకోని అవాంతరం వచ్చి పడింది. విశాల్ చివరి సినిమా ‘యాక్షన్’ను భారీ బడ్జెట్లో నిర్మించి.. సినిమా ఆశించిన ఫలితం అందుకోకపోవడంతో బాగా నష్టపోయిన రవీంద్రన్ అనే నిర్మాత ‘చక్ర’ విడుదలపై స్టే ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించడంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది.

‘యాక్షన్’ సినిమాకు సంబంధించి విశాల్ తనకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రవీంద్రన్ ‘చక్ర’ విడుదలపై స్టే కోరాడు. కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ పరిహారం అందించే విషయంలో విశాల్ ఏం చేశాడన్నది వెల్లడి కాలేదు. ఇష్యూ సెటిలైనట్లు అయితే కనిపించలేదు. ఐతే తాజాగా కోర్టు.. ‘చక్ర’ విడుదలపై స్టేను కొనసాగించలేమంటూ తీర్పు ఇచ్చింది. దీంతో ఆ సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ అయింది. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో దీపావళి కానుకగా విడుదల చేయాలని విశాల్ చూస్తున్నాడు.

దసరా టైంలో సూర్య చిత్రం ‘సూరారై పొట్రు’ (ఆకాశమే నీ హద్దురా) విడుదలవుతున్న నేపథ్యంలో ఆ తర్వాత దీపావళి పండక్కి తన సినిమాను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆనందన్ అనే దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని విశాల్ హిట్ మూవీ ‘ఇరుంబు తిరై‘ (అభిమన్యుడు)కు సీక్వెల్‌‌గా భావిస్తున్నారు. ‘చక్ర’ను తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేయనున్నారు.

This post was last modified on October 1, 2020 3:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

1 hour ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

3 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

3 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

4 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

5 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

5 hours ago