దక్షిణాదిన పేరున్న హీరోలు చాలామంది ఓటీటీ రిలీజ్ విషయంలో తీవ్ర వ్యతిరేకతతో ఉన్న సమయంలో తన చిత్రాన్ని ఆ మార్గంలో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన హీరోల్లో విశాల్ ఒకడు. తాను హీరోగా స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘చక్ర’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి మూణ్నెల్ల ముందే అతను ఒప్పందం చేసుకున్నాడు.
జీ5 ఆ సినిమా హక్కుల్ని సొంతం చేసుకుంది. ట్రైలర్ కూడా లాంచ్ చేసి ఇక సినిమా విడుదల దగ్గర పడిందన్న సంకేతాలు కూడా ఇచ్చాడు విశాల్. కానీ ఇంతలో అతడికి అనుకోని అవాంతరం వచ్చి పడింది. విశాల్ చివరి సినిమా ‘యాక్షన్’ను భారీ బడ్జెట్లో నిర్మించి.. సినిమా ఆశించిన ఫలితం అందుకోకపోవడంతో బాగా నష్టపోయిన రవీంద్రన్ అనే నిర్మాత ‘చక్ర’ విడుదలపై స్టే ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించడంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది.
‘యాక్షన్’ సినిమాకు సంబంధించి విశాల్ తనకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రవీంద్రన్ ‘చక్ర’ విడుదలపై స్టే కోరాడు. కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ పరిహారం అందించే విషయంలో విశాల్ ఏం చేశాడన్నది వెల్లడి కాలేదు. ఇష్యూ సెటిలైనట్లు అయితే కనిపించలేదు. ఐతే తాజాగా కోర్టు.. ‘చక్ర’ విడుదలపై స్టేను కొనసాగించలేమంటూ తీర్పు ఇచ్చింది. దీంతో ఆ సినిమా రిలీజ్కు లైన్ క్లియర్ అయింది. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో దీపావళి కానుకగా విడుదల చేయాలని విశాల్ చూస్తున్నాడు.
దసరా టైంలో సూర్య చిత్రం ‘సూరారై పొట్రు’ (ఆకాశమే నీ హద్దురా) విడుదలవుతున్న నేపథ్యంలో ఆ తర్వాత దీపావళి పండక్కి తన సినిమాను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆనందన్ అనే దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని విశాల్ హిట్ మూవీ ‘ఇరుంబు తిరై‘ (అభిమన్యుడు)కు సీక్వెల్గా భావిస్తున్నారు. ‘చక్ర’ను తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేయనున్నారు.
This post was last modified on October 1, 2020 3:58 pm
హఠాత్తుగా నిన్నటి నుంచి దురంధర్ ది రివెంజ్ బాగా డౌన్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం చాలా ఏరియాల్లో అరవై…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో టొవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర…
https://www.youtube.com/watch?v=stdHpPR8djw అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క మలయాళం డెబ్యూ కథనర్ తో జరగబోతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు.…
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి,…
సాధారణంగా తన పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులు ఆయా పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. వారి పనితీరు మెచ్చుకుంటాయి. మరింత మెరుగు పరుచుకోవాలని…
షాకింగ్ విషాద ఉదంతం చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతంలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు తెలంగాణ…